Karimnagar

News July 13, 2024

జగిత్యాల: ‘స్కాలర్షిప్‌కు అప్లై చేసుకోండి’

image

జగిత్యాల జిల్లాలో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ చదువుతున్న బీడీ కార్మికుల పిల్లలు స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవాలని బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ డిస్పెన్సరీ డా.శ్రీకాంత్ తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను scholerships.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు. ప్రీ మెట్రిక్ విద్యార్థులు ఆగస్ట్ 31 వరకు, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చన్నారు.

News July 13, 2024

కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం 65.39 లక్షలు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో గల హుండీల ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. 35 రోజులకు గాను ఆలయంలో గల 12 హుండీల ద్వారా వచ్చిన ఆదాయం లెక్కించగా నగదు రూ.65 లక్షల 39 వేల 167 సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 41 గ్రాముల బంగారం, కిలో 850 గ్రాముల వెండి, 38 విదేశీ కరెన్సీలు వచ్చినట్లు పేర్కొన్నారు.

News July 13, 2024

KNR: ఉరేసుకొని యువతి ఆత్మహత్య

image

మనస్తాపానికి గురై ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్ణంలో జరిగింది. ఎస్సై కిరణ్ కుమార్ వివరాల ప్రకారం.. పట్టణంలోని అల్లమయ్య గుట్ట ప్రాంతానికి చెందిన రుచిత(19) అనే యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో తనకు ఇష్టంలేని పెళ్లి సంబంధం మాట్లాడారని మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయింది.

News July 13, 2024

KNR: భ్ర్రూణ హత్యల నిర్ధారణ.. హాస్పిటల్ సీజ్

image

HZBDలో గర్భ విచ్ఛిత్తి ఘటనతో ఇన్‌ఛార్జి DMHO సుజాత స్థానిక మాధవి హాస్పిటల్‌ను శుక్రవారం సీజ్ చేశారు. ఓ యువతి గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు ఆమెను ఈ హాస్పిటల్‌కు తీసుకొచ్చి గర్భవిచ్ఛిత్తి చేయించారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆమె తల్లిదండ్రులతో సహా పలువురిపై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు.

News July 13, 2024

ధర్మపురి: లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.83,815/- ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ 39,316/-, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.27,350/-, అన్నదానం రూ.17,149/-,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

News July 13, 2024

ఇల్లందకుంట ఆలయ ఆదాయం@ రూ.7,23,433

image

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు ఆలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్ అధ్వర్యంలో లెక్కించారు. దేవాలయానికి భక్తులు సమర్పించిన 70 రోజులకు సంబంధించిన హుండీ డబ్బులను లెక్కించారు. భక్తులు ముడుపుల రూపంలో వేసిన రూ.7,23,433 లక్షల సమకూరినట్లు తెలిపారు.

News July 12, 2024

హ్యాండ్లూమ్స్ స్పెషల్ ఎక్స్‌పోలో పాల్గొన్న ప్రభుత్వ విప్

image

వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం హైదరాబాద్‌లోని పద్మశాలి బాయ్స్ హాస్టల్ ఆవరణలో మంగళగిరి హ్యాండ్లూమ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాండ్లూమ్ స్పెషల్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేతన్నల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.

News July 12, 2024

రామగుండం: పోలీస్ కమిషనరేట్‌లో SIల బదిలీలు

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్సైలు బదిలీ అయ్యారు. రామగుండం SIసతీష్ – NTPC-SIగా, NTPC-SIఉదయ్ కిరణ్‌ని VRకు బదిలీ చేశారు. GDK-1 SI సమ్మయ్య- రామగుండం SIగా, RGM-SI ఉషారాణి VRకు, VRలో ఉన్న బానేష్ – GDK-1Townకు, GDK-SI సౌజన్య- బెల్లంపల్లికి, బెల్లంపల్లి-SIప్రశాంత్‌ను- GDK-1కు బదిలీ చేశారు. మరో ఇద్దరు SIలు బదిలీ అయ్యారు.

News July 12, 2024

పెద్దపల్లి జిల్లాలో 12వ శతాబ్ధం నాటి అరుదైన విగ్రహం

image

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో అరుదైన విగ్రహాన్ని గుర్తించారు. పెద్దపల్లికి చెందిన చరిత్ర పరిశోధకుడు సతీశ్.. ఇటీవల ఆలయాన్ని సందర్శించిన సమయంలో అరుదైన అష్ట మహిషులతో కూడిన విగ్రహాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ విగ్రహం 12వ శతాబ్ధంలో కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదిగా భావిస్తున్నట్లు తెలిపారు.
SHARE

News July 12, 2024

కరీంనగర్: మద్యం తాగి వాహనం నడిపితే జైలు

image

మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు కరీంనగర్ కోర్టు జైలు శిక్ష విధించినట్లు కరీంనగర్ ట్రాఫిక్ సీఐ కరీముల్లా ఖాన్ గురువారం తెలిపారు. ముగ్గురికి మూడు రోజుల జైలు శిక్ష, రూ.7,000 జరిమానా విధించారు. మిగతా ఇరవై మందికి రూ.35,500 జరిమానా విధించినట్లు సీఐ కరీముల్లా ఖాన్ వివరించారు.