Karimnagar

News July 11, 2024

కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి విఫలం: మంత్రి పొన్నం

image

కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి విఫలమయ్యారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలో కేంద్ర టూరిజం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు ఒక్క రూపాయి తీసుకురాలేదని ఆరోపించారు. స్థానిక సంస్థలకు 73, 74 రాజ్యాంగం ద్వారా వచ్చే 15వ ఫైనాన్స్ నిధులు తప్ప అదనంగా ఒక్క రూపాయి కిషన్ రెడ్డి తీసుకురాలేదన్నారు. హైదరాబాద్ ఇమేజ్‌కి భంగం కలిగించేలా కిషన్ మాటలు ఉన్నాయని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని పొన్నం అన్నారు.

News July 11, 2024

మంత్రిని కలిసిన MLC జీవన్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల నియోజకవర్గ ఇరిగేషన్ అభివృద్ధిపై చర్చించారు. ఇరిగేషన్ పనులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మంత్రిని MLC కోరారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని జీవన్ రెడ్డి తెలిపారు.

News July 11, 2024

సిరిసిల్ల: డిప్లమా అగ్రికల్చర్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

సిరిసిల్ల జిల్లాలో డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్‌టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్(దేశీ)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా ఆత్మ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ భాస్కర్ తెలిపారు. దేశీలో 80 దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, జిల్లాలోని ఎరువుల విక్రయ, క్రిమిసంహారక లై సెన్స్, పదో తరగతి చదివిన డీలర్లు అర్హులుగా పేర్కొన్నారు.

News July 11, 2024

మంత్రిని కలిసిన ఏమ్మెల్సీ జీవన్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల నియోజకవర్గ ఇరిగేషన్ అభివృద్ధిపై చర్చించారు. ఇరిగేషన్ పనులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మంత్రిని MLC కోరారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని జీవన్ రెడ్డి తెలిపారు.

News July 11, 2024

BREAKING.. KNR: ఆర్టీసీ బస్సులో ఫిట్స్‌తో ప్రయాణికుడు మృతి

image

కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సులో ఫిట్స్‌తో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. ఈ ఘటన రామడుగు మండలం వెదిర గ్రామంలో చోటుచేసుకుంది. KNR నుంచి గంగాధరకు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న రాజయ్యకు ఫిట్స్ వచ్చింది. దీంతో తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకునే సరికి మృతిచెందినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 11, 2024

గోదావరిఖని: దంత వైద్య విభాగంలో క్లిష్టమైన ఆపరేషన్

image

గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలోని దంత వైద్య విభాగంలో మొట్ట మొదటిసారిగా అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను నిర్వహించారు. వ్యక్తికి సంబంధించి ముఖంలోని ఆరు దవడ ఎముకలు విరిగిపోవడంతో దంత వైద్య నిపుణులు 6 మినీ ప్లేట్లు, 20 స్క్రూలు బిగించి ఆపరేషన్ విజయవంతం చేశారు. వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్ అభినందించారు.

News July 11, 2024

కాటారం: అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య

image

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన BHPL జిల్లా కాటారం మండలం మేడిపల్లిలో జరిగింది. SI అభినవ్ వివరాల ప్రకారం.. మేడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బస్వాపూరకి చెందిన లింగయ్య(35) రెండున్నర ఎకరాలను రెండేళ్ల క్రితం కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లతో పంట దిగుబడి రాకనోవడంతో రూ.4 లక్షల అప్పయ్యాడు. మనస్తాపం చెందిన రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 11, 2024

KNR: రుణ మాఫీ పై ప్రచార లోపం.. రైతన్నలకు శాపం

image

రైతు రుణమాఫీపై స్పష్టత లేకపోగా ఏటా తీసుకున్న రుణాన్ని చెల్లించి తిరిగి తీసుకుంటే వడ్డీ బాధ పోయేది. కరీంనగర్ జిల్లాలో 1.34లక్షల మంది రైతులు రుణమాఫీ దారులు ఉండగా అందులో దాదాపు 60వేల మంది వడ్డీ కడుతూ వస్తున్నారు. ఇక రూ.2లక్షల రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఆగస్టు 15లోపు ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన విధివిధానాలపై రైతన్నల్లో ఆందోళన నెలకొంది.

News July 11, 2024

పెద్దపల్లి: సెప్టిక్ ట్యాంక్‌లో పడిన బాలుడు మృతి.. UPDATE

image

MHBD జిల్లాకు చెందిన శ్రీనివాస్ కుమారుడు జాన్‌వెస్లీ(7) మంగళవారం పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రిలోని సెప్టిక్ ట్యాంకులో పడిన విషయం తెలిసిందే. బాలుడు తీవ్ర ఆస్వస్థతకు గురికాగా మెరుగైన వైద్యం కోసం KNR ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బాలుడు బుధవారం మృతి చెందాడు. ట్యాంక్ మూత తెరిచి ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి డిమాండ్ చేశారు.

News July 11, 2024

విద్య ద్వారానే నిజమైన అభివృద్ధి : మంత్రి పొన్నం ప్రభాకర్

image

విద్య ద్వారానే నిజమైన అభివృద్ధి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్నివర్గాలకు ఉన్నత విద్య అందించడానికి రాజీవ్ గాంధీ వేసిన బాటలు రహదారులుగా మారాయని ఆయన పేర్కొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తే .. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థులకు ఫీజు రాయితీ ఇచ్చి డాక్టర్లను, ఇంజనీర్లను చేశారన్నారు.