Karimnagar

News July 7, 2024

కరీంనగర్: డ్రమ్ సీడర్‌తో ఒకేరోజు 8 ఎకరాలు వరినాటు

image

ఆధునికసాగుతో కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన చిగుర్లు ఆశాలు ఒకేరోజు 8 ఎకరాల్లో వరినాటు వేశాడు. ఆశాలు డ్రమ్ సీడర్ తో 8ఎకరాలు సాగుచేయడం వల్ల సమయంతో పాటు, కూలీల ఖర్చులు ఆదా అయ్యిందని తెలిపారు. 8ఎకరాలకు తనకు రూ.2400 మాత్రమే ఖర్చయినట్లు తెలిపాడు.

News July 7, 2024

KNR: ఇల్లందకుంట, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తా: బండి సంజయ్

image

రామాయణ సర్క్యూట్ కింద ఇల్లందకుంట, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని.. అందుకోసం తాను తప్పకుండా కృషి చేస్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చుతానన్నారు. ప్రతిపాదనలు పంపాలని గత ప్రభుత్వాన్ని అనేకమార్లు కోరినా పంపలేదన్నారు .

News July 7, 2024

ఓదెల మల్లన్న ఆలయంలో ఈనెల 15న పెద్దపట్నం

image

పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ఈనెల 15న పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏటా ఏకాదశి ముందు పెద్ద పట్నాలు, అగ్నిగుండ మహోత్సవం పెద్దఎత్తున నిర్వహిస్తారు. కావున భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ అధికారులు కోరారు.

News July 7, 2024

KNR: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

అనుమానాస్పద స్థితిలో ఓవ్యక్తి మృతి చెందాడని కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాలు.. కేశవపట్నం మండలం గడ్డపాకకు చెందిన చిత్తారి రత్నం సుభాష్‌నగర్‌లో అద్దెకు ఉంటూ కరెంట్ పోల్స్‌ సబ్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. అర్దరాత్రి అతడి నోట్లో నురుగులు రావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. మృతుడి సోదరుడు రాజు ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News July 7, 2024

KRM: బాలుడు మృతి.. బంధువుల ఆందోళన

image

వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇల్లంతకుంట మండలం వంతడుపులకి చెందిన అనిల్-శిరీష దంపతులు ఐదేళ్ల బాలుడు అయాన్ష్ జ్వరంతో బాధపడుతుండగా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు బాలుడికి ఇంజక్షన్ ఇవ్వడంతో మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు.

News July 7, 2024

కరీంనగర్: ‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలులో విఫలం’

image

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా ఎన్నికల హామీలు పూర్తిగా అమలు కావడం లేదన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News July 7, 2024

నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఆషాఢం బోనాలు

image

ఉమ్మడి కరీంగనగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి బోనాల సందడి ప్రారంభం కానుంది. వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలు హోరెత్తనున్నాయి. నగునూరు దుర్గ భవాని ఆలయం, రామేశ్వర ఆలయం, మహా శక్తి ఆలయంలో ప్రత్యేక పూజలతో బోనాల వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతి ఆషాఢ మాసంలో కుర్మ కులస్థులు పోచమ్మకు బోనాలు సమర్పిస్తుంటారు. డివిజన్ల వారీగా బోనాల పండగను జిల్లా ప్రజలు కలిసికట్టుగా చేసుకుంటారు.

News July 7, 2024

KNR: ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం పరీక్ష ఫలితాలు విడుదల

image

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరిగిన ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు యూనివర్సిటీ అధికారులు శనివారం విడుదల చేశారు. గత జూన్ నెలలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను వెబ్ సైట్ https://satavahana.ac.inలో అందుబాటులో ఉంచామని లేదా సమాచారం కోసం యూనివర్సిటీని సంప్రదించాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డా.శ్రీరంగ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

News July 7, 2024

హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం: బండి

image

రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేశవరావుతో కాంగ్రెస్ రాజీనామా చేయించిందని, మరి బీఆర్ఎస్ నుంచి వచ్చిన MLA, MLCలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఆ పార్టీలోకి ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.

News July 6, 2024

ఏపీ సీఎంని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

image

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న చారిత్రాత్మక సమావేశంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి అనువైన సమావేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.