Karimnagar

News July 6, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాలు
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
@ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే.
@ కాలేశ్వరంలో భక్తుల రద్దీ.
@ అమ్మ ఆదర్శ పాఠశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న సిరిసిల్ల కలెక్టర్.
@ బీర్పూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ.

News July 6, 2024

మంథని: చంద్రబాబును కలిసిన మంత్రి శ్రీధర్ బాబు

image

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న చారిత్రాత్మిక సమావేశంలో మంథని ఎమ్మెల్యే, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు పాల్గొన్నారు.

News July 6, 2024

రామగుండంలో ఒకరు సస్పెండ్.. మరొకరు సరెండర్

image

అనుమతి లేకుండా దీర్ఘ కాలంగా విధులకు గైర్హాజరవుతున్న రామగుండం కార్పొరేషన్ బిల్ కలెక్టర్ సతీశ్‌ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ శ్రీ హర్ష నేడు ఉత్తర్వులు జారీ చేశారు. పారిశుద్ధ్య పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్న శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. రామగుండం MLA రాజ్ ఠాకూర్ శానిటేషన్ అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

News July 6, 2024

బండి సంజయ్ కుమార్ రేపటి షెడ్యూల్

image

రేపటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ షెడ్యూల్ కింది విధంగా ఉంది.
✓రేపు ఉదయం కరీంనగర్‌కు చేరుకుంటారు. ✓8:30 గంటలకు మహాశక్తి ఆలయాన్ని సందర్శిస్తారు.
✓11:30 గంటలకు ప్రభుత్వ అధికారులతో సమావేశం.
✓మధ్యాహ్నం 2 నుంచి కరీంనగర్ పట్టణంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
✓సాయంత్రం 7 గంటలకు ఎంపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.

News July 6, 2024

ఉమ్మడి KNR జిల్లాలో డెంగ్యూ

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి కలకలం రేపుతోంది. వర్షాకాలం కావడంతో దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఇద్దరికి డెంగ్యూ సోకిందని వైద్యులు తెలిపారు. గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి, రాజిరెడ్డి అనే తండ్రి కొడుకులు డెంగ్యూ వ్యాధితో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నాలుగు రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు.

News July 6, 2024

సీఎంను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే!

image

సీఎం రేవంత్ రెడ్డిని జగిత్యాల MLA డా.సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
తన జన్మదినం సందర్భంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో వారి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు. జగిత్యాల సమగ్ర అభివృద్దికి సహకరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు జగిత్యాల ప్రజల పక్షాన సీఎంకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

News July 6, 2024

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

సిరిసిల్ల జిల్లాలో ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని ,సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా దగ్గరిలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించి పిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలో డబ్బులు సంపాదన, వ్యక్తి గత విషయాలు పంచుకోవద్దని తెలిపారు.

News July 6, 2024

KNR: త్వరలో కొత్త రేషన్ కార్డులు!

image

కొత్త రేషన్ కార్డులు జారీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. త్వరలో కొత్త కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆశావహుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మీ-సేవ పోర్టల్ ఓపెన్ చేసి కొత్త దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.

News July 6, 2024

జమ్మికుంట: 14 ఏళ్లకు పిల్లలను కలిశాడు!

image

జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లె గ్రామానికి చెందిన సారయ్య- సత్తమ్మ భార్యాభర్తలు. వీరి ఇద్దరి మధ్య 2010లో చిన్న గొడవ జరగగా సత్తమ్మ మృతి చెందింది. దీంతో సారయ్య 14 ఏళ్ల పాటు జైలులో ఉన్నాడు. ఇద్దరు పిల్లలు అనాథశ్రమంలో చేరారు. సారయ్య సత్ప్రవర్తన కింద ఈ నెల 3న విడుదలయ్యాడు. అనాథశ్రమంలో ఉన్న పిల్లలను కలిశాడు. పిల్లలను తన వెంట తీసుకెళ్తానని తెలపడంతో ఆశ్రమ నిర్వాహకులు కంటనీరు పెట్టి తండ్రితో పంపించారు.

News July 6, 2024

కరీంనగర్: బాలిక ప్రసవం.. వ్యక్తిపై కేసు నమోదు

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల పరిధిలో ఓ బాలిక ప్రసవించిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో వరుసకు బావ అయినా వెంకటేశ్ బాలికతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. దీంతో బాలిక ఈ నెల 1న వరంగల్ MGM ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆరోగ్యం తెలిపారు.