India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సివిల్స్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ కోసం ఈ నెల 7న ఆన్ లైన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరక్టర్ డాక్టర్ రవి కుమార్ తెలిపారు. అభ్యర్థులు వెబ్ సైట్ www.studycircle.cgg.gov.in ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
జగిత్యాల జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ను జడ్పీ స్పెషల్ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రఘువరన్, కలెక్టర్ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
@ ధర్మపురి మండలంలో కుక్క కాటుతో వృద్ధురాలు మృతి. @ ఎండపల్లి మండలంలో తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు. @ ముస్తాబాద్ మండలంలో ఏడుగురు పేకాటరాయుళ్ల పట్టివేత. @ కోరుట్ల శివారులో ట్రాక్టర్, స్కూటీ డీ.. ఒకరి మృతి. @ సైదాపూర్ మండలంలో తేనెటీగల దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలు. @ జమ్మికుంటలో భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య. @ జగిత్యాల జిల్లాలో వన మహోత్సవాన్ని ప్రారంభించిన కలెక్టర్
కరీంనగర్ పరిషత్ పాలకవర్గాలకు గురువారంతో గడువు ముగియడంతో జిల్లాలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గురువారం నాటికి ఎంపీటీసీలు, జడ్పీటిసిల పదవీకాలం ముగియటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్కు అధికారులు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.
హుస్నాబాద్ ప్రాంతం టూరిజం స్పాట్కు అనుకూలంగా ఉందని తెలిపారు. ఈ మేరకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ దేవాలయం, శనిగరం ప్రాజెక్టు, మహాసముద్రం, రాయికల్ జలపాతం, సర్వాయిపేట, వంగర, కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రవర్తన మార్చుకోకుండా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన మహిళకు రూ.50 వేల జరిమానా విధించారు. నారాయణపూర్ గ్రామానికి చెందిన ఆనరాశి పోచవ్వ 2023 అక్టోబర్లో నాటుసారా తరలిస్తూ పట్టుబడింది. ఎల్లారెడ్డిపేట MRO ఆఫీస్ ఎదుట రూ.లక్ష పూచీకత్తుతో బైండోవర్ చేశారు. అయితే మరోసారి నాటుసారా తరలిస్తూ ఆమె పట్టుబడింది. దీంతో ఆమెకు జరిమానా విధించినట్లు ఎక్సైజ్ CI శ్రీనివాస్ తెలిపారు.
రైతులకు ఆధునిక ,సాంకేతిక సమాచారాన్ని అందించేందుకు ఒక వేదికను నిర్మించాలని గత ప్రభుత్వం రైతు వేదికలకు శ్రీకారం చుట్టింది. ఆరేళ్ల క్రితం అట్టహాసంగా రైతువేదికల నిర్మాణం చేపట్టగా అసంపూర్తి పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. కరీంనగర్ మండలంలో దుర్శేడు, బొమ్మకల్, నగునూర్, చామనపల్లిలో నిర్మించిన రైతువేదిక భవనాల్లో సౌకర్యాలు లేక, అసంపూర్తిగా నిర్మాణాలు చేయగా, ఇవి నిరుపయోగంగా మారుతున్నాయి.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఇద్దరు యువకులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కరీంనగర్కు చెందిన సంపత్, మన్నెంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గురువారం జలపాతాన్ని చూసేందుకు వెళ్లగా.. తేనెటీగలు దాడి చేశాయన్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పృహ తప్పి పడిపోయారు. వారికి గాయాలు కావడంతో గ్రామస్థులు 108 ద్వారా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జమ్మికుంట పట్టణంలోని మారుతి నగర్కు చెందిన జీడి కావ్య (28) ఆత్మహత్య చేసుకున్నట్లు CI రవి తెలిపారు. CI వివరాలు.. వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన జీడి రాజుతో 12 ఏళ్ల క్రితం కావ్య వివాహం జరిగింది. కొన్ని రోజులుగా భార్య కావ్యను అనుమానంతో భర్త రాజు వేధించాడు. దీంతో బుధవారం రాత్రి ఇంట్లో కావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కావ్య తల్లి ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన HYD శివారులో జరిగింది. నార్సింగి SI ప్రభాకర్ వివరాలు.. భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన మోహన్ గండిపేటలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో డ్రైవర్గా పనిచేస్తూ పీరంచెరువు భవాని కాలనీలో నివాసముంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు సందీప్ (21) ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం రాత్రి సందీప్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Sorry, no posts matched your criteria.