Karimnagar

News October 13, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి TOP న్యూస్

image

@ ఓదెల మండలంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి.
@ రామాజీపేటలో దాడికి పాల్పడిన ఎనిమిది మందిపై కేసు.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ మెట్‌పల్లిలో ఘనంగా బతుకమ్మల నిమజ్జనం.
@ జగిత్యాలలోని టిఫిన్ సెంటర్‌లో ఇడ్లీలో జెర్రీ.
@ మంథనిలో తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తికి గాయాలు.
@ కాటారం మండలం విలాసాగర్‌లో సీసీ కెమెరాల ప్రారంభం.

News October 13, 2024

వేములవాడలో రేపు మంత్రి కొండా సురేఖ పర్యటన ఇలా..

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని రేపు (సోమవారం) రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకోనున్నారు. ఆలయంలో పూజల అనంతరం బద్ది పోచమ్మను దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించనున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన రాజ రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నారు.

News October 13, 2024

GREAT: జగిత్యాల: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అన్నాచెల్లెళ్లు

image

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు లక్కం మునిరాజ్, లక్కం రిషిత ఇటీవలే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జగిత్యాల పట్టణంలో MLC జీవన్ రెడ్డి వారిని శాలువాలతో సన్మానించి, మెమెంటో అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరారు.

News October 13, 2024

అక్కన్నపేట: విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి

image

దసరా పండుగ రోజు విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి అక్కన్నపేట మండలం పోతారం(జే) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శిఖ కీర్తన్య (8) అనే చిన్నారి దుర్గామాత నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన డీజే కరెంటు తీగ తాకి మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ భాస్కర్ ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News October 13, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు. @ జగిత్యాల లో కస్టమర్ పై టిఫిన్ సెంటర్ సిబ్బంది దాడి. @ హుస్నాబాద్ లో దసరా వేడుకలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. @ భీమారం మండలంలో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి. @ శంకరపట్నం మండలంలో బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.

News October 12, 2024

బీమారం : కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

భీమరం మండలం రాగోజీపేటలో దసరా పండగ పూట విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. దుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మహిషాసుర మర్ధిని కార్యక్రమంలో రావణాసురుడి బొమ్మకు నిప్పు పెట్టే ప్రయత్నంలో పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు తగిలి అరిసెల వెంకటేష్ ( 36) అక్కడే కుప్పకూలి పడిపోయాడు. గ్రామస్థులు వెంటనే జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్‌కి తీసుకెళ్లగా మృతిచెందాడని వైద్యులు తెలిపారు.

News October 12, 2024

KNR: పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు

image

దసరా సందర్భంగా కరీంనగర్ జిల్లాలో నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరిగింది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. వంట నూనెల నుంచి కూరగాయల వరకు ధరలు గత 20 రోజుల్లో 30% రెట్లు అధికం కావడంతో సామాన్యులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. గత 20 రోజుల క్రితం సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు ధర రూ.115 ఉండగా ప్రస్తుతం రూ. 145-150 వరకు, పామాయిల్ ధర రూ.90ఉండగా రూ. 125వరకు ఉన్నాయి.

News October 12, 2024

కరీంనగర్: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?

image

దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.

News October 12, 2024

విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక: మంత్రి పొన్నం

image

రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ విజయదశమి జరుపుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరు ఆ దుర్గాభవాని అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆయుఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, సిరి సంపదలతో అన్ని పనుల్లో విజయం సాధించాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ పెద్దల ఆశీర్వాదం తీసుకొని భవిష్యత్తులో విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు.

News October 11, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కరీంనగర్ లో రెస్టారెంట్లలో తనిఖీలు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కథలాపూర్ మండలంలో సైబర్ మోసం. @ వీర్నపల్లి మండలంలో ఆర్టీసీ బస్సు, స్కూటర్ డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ వేములవాడ: అనారోగ్యంతో ప్రధానోపాధ్యాయురాలు మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న దుర్గ నవరాత్రి ఉత్సవాలు. @ దసరా పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్న జగిత్యాల ఎస్పీ.