India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీసు ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన రామగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే సదానందంను సస్పెండ్ చేస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినా, విధులలో నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని సీపీ హెచ్చరించారు.
సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు చెరువులో శనివారం మత్స్యకారులు చేపలు పట్టారు. ఈ క్రమంలో మత్స్యకారుల వలకు 20 కిలోల భారీ చేప చిక్కింది. దీంతో మత్స్యకారులు చేపను చెరువు గట్టు పైకి తీసుకువచ్చారు. తమ గ్రామ చెరువులో భారీ చేప చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.
కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్కు స్థానిక అభిమాని స్వామివారి ఇత్తడి విగ్రహం బహుకరించారు. స్థానిక కొబ్బరికాయల వ్యాపారి అయిన సుదగోని చిరంజీవి పవన్కళ్యాణ్కు అభిమాని. ఈ సందర్భంగా రూ.11 వేలు వెచ్చించి 9 కేజీల ఇత్తడితో అంజన్న ప్రతిమను తయారుచేయించి పవన్కు అందజేశారు. గతంలో కూడా కొండగట్టు వచ్చిన సందర్భంలో పీకేకి వివిధ వస్తువులు అందజేసినట్లు చేసినట్లు తెలిపారు.
@ కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. @ పవన్ కళ్యాణ్ పర్యటనలో దొంగల చేతివాటం. @ జగిత్యాల జిల్లాలో చోరీకి పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్. @ మల్యాల మండలంలో ఉరివేసుకొని వృద్ధుడి ఆత్మహత్య. @ వేములవాడ మున్సిపాలిటీలో 101 రూపాయలకే అంతిమ సంస్కారాలు. @ హత్య కేసులో మెట్పల్లి మండల వాసికి జీవిత ఖైదు. @ కలెక్టరేట్ నైట్ వాచ్ మెన్ ను సన్మానించిన సిరిసిల్ల కలెక్టర్.
వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో శనివారం జరిగిన పాలకవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలో మరణించిన వారి దహన సంస్కారాలను మూలవాగు ప్రాంతంలోని వైకుంఠధామంలో 101 రూపాయలకే నిర్వహించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన పాలకవర్గం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. వైకుంఠ రథం, కట్టెలు, డీజిల్, నీటిసరఫరాను రూ.101కే అందించనున్నట్లు తెలిపారు.
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కొండగట్టు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పవన్ను చూసేందుకు భారీగా అభిమానులు, పార్టీ శ్రేణులు, నాయకులు కార్యాకర్తలు తరలివచ్చారు.
పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామ పంచాయతీ పరిధిలోని గట్టు సింగారం గుట్టపై గుర్తు తెలియని వ్యక్తి అస్థిపంజరాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి రవి బసంత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ స్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఎవరిది అనేది తెలియాల్సి ఉంది.
బాపట్ల జిల్లా చిలుకపాడుకు చెందిన దాసరి అంజి కరీంనగర్ జిల్లాకు చెందిన బాలికను అత్యాచారం చేశాడు. కేసును విచారించిన KNR పోక్సో కోర్టు జడ్జి వెంకటేశ్ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధించారు. అంజి పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి 2013లో అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు 2016లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరం రుజువవ్వడంతో శుక్రవారం కోర్టు తీర్పునిచ్చింది.
కరీంనగర్ను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, (మున్సిపల్ కమీషనర్) ప్రఫుల్ దేశాయ్ పిలుపునిచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల వల్ల ప్రజలు సీజనల్ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నదని జిల్లా ప్రజలందరు అప్రమత్తతతో, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. మన ఇంటి చుట్టు, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం మనందరి బాధ్యత అని సూచించారు.
ఇటీవల నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 483 మంది విద్యార్థులు ఉండగా 432 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 51 మంది హాజరు కాలేదని చెప్పారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో 432 మంది విద్యార్థుల్లో 418 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. జిల్లాలో 96.76 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు.
Sorry, no posts matched your criteria.