India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్పై జరిగిన దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులపై దాడులు సరికాదని రవాణా శాఖ మంత్రిగా ఉద్యోగులకు అండగా ఉంటానని అన్నారు. కమీషనర్ రమేశ్పై జరిగిన దాడి ఘటనపై పోలీసులతో మాట్లాడారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. భవిష్యత్తులో అధికారులపై దాడి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.
@ జగిత్యాల ఆర్డిఓ ఆఫీసును తనిఖీ చేసిన కలెక్టర్.
@ మెట్పల్లి మండలంలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడి మృతి.
@ వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుడి రూ.35 లక్షల విరాళం.
@ బోయిన్పల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
@ కమలాపూర్ మండలంలో స్కూల్ వ్యాన్, కారు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు.
@ కరీంనగర్లో గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి.
మంత్రి శ్రీధర్ బాబు, MLA అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు కేంద్ర సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కోరామన్నారు. దీంతో కేంద్ర మంత్రి సాగుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వులో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్(51) విధుల్లో ఉండగా గుండె పోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా.. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.65,357 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.32,200, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.24,750, అన్నదానం ద్వారా రూ.8,407 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
ఢిల్లీలోని రేవంత్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గురువారం వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సమావేశమయ్యారు. జీవన్ రెడ్డికి పార్టీ హై కమాండ్ తగిన ప్రాధాన్యత ఇస్తుందని, వేరే పార్టీలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
జగిత్యాల జిల్లాలో కూతురితో కలిసి తల్లి బావిలో దూకింది. స్థానికుల వివరాలు.. సారంగపూర్ మండలం అర్పల్లికి చెందిన బొండ్ల మౌనికకు ఆమె భర్తతో నిన్న రాత్రి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన మౌనిక కూతురితో కలిసి బావిలో దూకింది. గురువారం ఉదయం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహాలను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మౌనిక భర్తను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను పార్టీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించి సర్దిచెప్పింది. ఎమ్మెల్యేల చేరికలు పార్టీకి అవసరమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్మున్షీ, కేసీ వేణుగోపాల్ నచ్చజెప్పడంతో అలకవీడారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యమిస్తామన్న భరోసాతో ఆయన సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది.
TGPSC గ్రూప్-2 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవి కుమార్ తెలిపారు. www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మొదటి గ్రాండ్ టెస్ట్ జులై 08, 09, రెండో టెస్ట్ జులై 15, 16, మూడో టెస్ట్ జులై 22, 23, నాలుగో టెస్ట్ జులై 30, 31వ తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు.
భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ KNR జడ్జి శ్రీలేఖ బుధవారం తీర్పునిచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన సుమన్, అతడి భార్య మన్నవరాణి బతుకుదెరువుకు వచ్చి గంగాధర(M) గర్శకుర్తిలో ఉంటున్నారు. సుమన్ మద్యానికి బానిసై భార్యను వేధించాడు. దీంతో పిల్లలను భర్త వద్ద ఉంచవద్దని లేఖ రాసి 2019 ఏప్రిల్ 2న ఉరేసుకుంది. సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు జైలు శిక్ష విధించింది.
Sorry, no posts matched your criteria.