India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ గోదావరిఖనిలో అనుమతి లేని ప్రైవేట్ పాఠశాల సీజ్. @ ధర్మారం మండలంలో ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఆటో ఢీ.. ఇద్దరు మృతి. @ కోరుట్ల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ను తనకి చేసిన ఎస్పీ. @ రాయికల్ మండలంలో అత్యాచారానికి పాల్పడిన నిందితుడి అరెస్ట్. @ చొప్పదండి ఎమ్మెల్యేను పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. @ మెట్పల్లి మండలం మేడిపల్లిలో 2 ఇళ్లలో చోరీ.
ల్యాండ్ యుటిలైజేషన్ సర్వేను సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో భూ సర్వేపై పంచాయతీ కార్యదర్శులు, ఎంఈవోలు, ఐకేపీ సీసీతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సర్వేకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తదితరులున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వాల్ పెయింటింగ్స్, తాగునీరు, టాయిలెట్, వసతులు కల్పించాలన్నారు. జులై మొదటి వారం నాటికి అంగన్వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్య బోధనపై శిక్షణ పూర్తి చేయాలన్నారు.
కరీంనగర్ జిల్లా కోతి రాంపూర్(పోచంపల్లి)లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచ్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ రూమ్ను కలెక్టర్ పమేలా సత్పతి, సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు. మంగళవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాతృభాషను మరవొద్దని, ఇంగ్లిష్తో పాటు ఇతర భాషలు నేర్చుకోవాలని సూచించారు.
ముస్తాబాద్ మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకోగా ప్రియుడు మృతి చెందాడు. గూడెం గ్రామానికి చెందిన పెంట చందు(23) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించరు అనే భయంతో సోమవారం వీరిద్దరూ కలిసి కరీంనగర్లోని ఉజ్వల పార్కులో పురుగు మందు తాగారు. చందు మృతిచెందగా యువతి ఎల్లారెడ్డిపేలలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో సోమవారం ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. పదేళ్లలో తెలంగాణలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహాయసహకారాలు అందించాలని కోరారు. స్పందించిన మంత్రి రాష్ట్ర అభివృద్ధికి పార్టీలకతీతంగా అండగా ఉంటామని చెప్పారని తెలిపారు. ముఖ్యంగా జాతీయ రహదారుల మంజూరులో తెలంగాణకు అగ్రస్థానం లభించేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సీజనల్ వ్యాధుల నియంత్రణపై జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. డెంగీ, మలేరియా, విష జ్వరాలు ప్రబలకుండా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు.
@ తంగళ్ళపల్లి మండలంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య. @ ఎండపల్లి మండలంలో ఆర్టీసీ బస్సు, బైకు డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసిన మంత్రి శ్రీధర్ బాబు. @ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. @ సిరిసిల్లలో పాన్ షాప్ లలో తనిఖీలు. @ జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం. @ సిరిసిల్ల ప్రజావాణిలో 202 ఫిర్యాదులు.
కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. విజయశాంతి ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటూ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని Xలో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి ‘థ్యాంక్యూ సో మచ్ బండి సంజయ్ గారు’ అంటూ రిప్లై ఇచ్చారు.
ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి ప్రథమ స్థానంలో నిలిచింది. పెద్దపల్లి జిల్లాలో 1,086 (55.95 %) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జగిత్యాల 1,197 (50.6%), సిరిసిల్ల 453 (35.75%), కరీంనగర్ 1,501 (35.05%) మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
Sorry, no posts matched your criteria.