India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
☞సిరిసిల్లలో స్కానింగ్ సెంటర్లను డిప్యూటీ డిఎంహెచ్ఓ తనిఖీ
☞ చొప్పదండి ఎమ్మెల్యేను పరామర్శించిన సీఎం
☞మేడిపల్లి: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
☞గంభీర్రావుపేట: నకిలీ గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్
☞పెద్దపల్లి తాహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ
☞మెట్ పల్లి సీఐగా నిరంజన్ రెడ్డి
మాజీ మంత్రి హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి రాజీనామా పత్రం సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తన రాజీనామాతో సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంట బీమా చెల్లిస్తుందని, వరికి 500 బోనస్ చెల్లిస్తామన్నారు. విప్ అడ్లూరి లక్ష్మణ్, తదితరులున్నారు.
ఉరి వేసుకుని యువకుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో జరిగింది. ధర్మపురి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడి ధనుంజయ్ (22) హైదరాబాదులో నివాసం ఉంటున్నాడు. ఈనెల 18న వైజాగ్కు ఓ వివాహానికి వెళ్లి ఓ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేయడం హర్షనీయమని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈరోజు కథలపూర్ మండలం తాండ్రియాల్ గ్రామంలో రైతులతో కలసి ఆది శ్రీనివాస్ మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా రాయికల్ లో ఏసీబీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఎస్ఐ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన ఎస్ఐ అక్కడి నుంచి పారిపోయారు. పట్టుకున్న ట్రాక్టర్ను విడిపించే విషయంలో ఎస్ఐ బాధితుల నుంచి రూ.25 వేలు డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు ఎస్ఐపై కేసు నమోదు చేశారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే, రూపాదేవి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుకునే రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారికి ఇద్దరు పిల్లలు యోజిత్ (11), రుషికశ్రీ(8). కాగా ఆమె ఉపాధ్యాయురాలు. రెండు నెలల క్రితమే వారు హైదరాబాద్కు రాగా ఈ ఘటన జరిగింది.
శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన ఆరుగురు విద్యార్థులు డిబార్ అయినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలు తెలిపారు. విద్యార్థులు సక్రమంగా పరీక్షలు హాజరుకావాలని ఆయన సూచించారు.
సుల్తానాబాద్ పట్టణంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామంలో బాలికకు తాత వరుసైన పోచాలు(60) ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భయపడిన బాలిక తల్లిదండ్రులకు తెలుపగా బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం హుజూరాబాద్కు వచ్చిన సందర్భంలో అంబేడ్కర్ చౌరస్తాలో జేబు దొంగలు హల్ చల్ సృష్టించారు. BJP నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్ వచ్చిన సంబరాల్లో మునిగి తేలగా జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 10, 15 మంది జేబుల్లో ఉన్న డబ్బులను గుట్టు చప్పుడు కాకుండా దొంగలించారు. దీంతో బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రజలతో మమేకమై పోలీసులు విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ (IG) సూచించారు. గోదావరిఖని పట్టణ చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్, లా & ఆర్డర్ పోలీసులను కలిసి వారికి సూచనలు ఇచ్చారు. విజువల్ పోలీసింగ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉంటూనే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.