India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో దేవీ నవరాత్రోత్సవాల (దసరా) సందర్భంగా గతేడాది వాహన పూజల ద్వారా 3 రోజులకు రూ.2,67,600 ఆదాయం వచ్చిందని ఆలయ కార్య నిర్వహణాధికారి తెలిపారు. ఈ ఏడాది మూడు రోజులకు రూ.3,37,900ల ఆదాయం సమకూరిందని, ఈ సంవత్సరం వాహన పూజల ద్వారా రూ.70,300లు అదనంగా సమకూరిందని తెలిపారు.

ఉజ్బెకిస్థాన్ దేశంలోని తాష్కెంట్ అల్ఫ్రాగానస్ యూనివర్సిటీలో శనివారం జరిగిన యునెస్కో ఆసియా పసిఫిక్ వ్యవస్థాపక విద్యాసదస్సులో హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డా.మల్లారెడ్డి భారతదేశం తరఫున పాల్గొని ప్రసంగించారు. 21వ శతాబ్దంలో యువత ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్లను అధిగమించే విద్యావిధానాల గురించి వివరించారు. కార్యక్రమంలో 40 దేశాల నుంచి 200 ప్రతినిధులు పాల్గొన్నారు.

@ ఓదెల మండలంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి.
@ రామాజీపేటలో దాడికి పాల్పడిన ఎనిమిది మందిపై కేసు.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ మెట్పల్లిలో ఘనంగా బతుకమ్మల నిమజ్జనం.
@ జగిత్యాలలోని టిఫిన్ సెంటర్లో ఇడ్లీలో జెర్రీ.
@ మంథనిలో తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తికి గాయాలు.
@ కాటారం మండలం విలాసాగర్లో సీసీ కెమెరాల ప్రారంభం.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని రేపు (సోమవారం) రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకోనున్నారు. ఆలయంలో పూజల అనంతరం బద్ది పోచమ్మను దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించనున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన రాజ రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నారు.

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు లక్కం మునిరాజ్, లక్కం రిషిత ఇటీవలే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జగిత్యాల పట్టణంలో MLC జీవన్ రెడ్డి వారిని శాలువాలతో సన్మానించి, మెమెంటో అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరారు.

దసరా పండుగ రోజు విద్యుత్ షాక్తో చిన్నారి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి అక్కన్నపేట మండలం పోతారం(జే) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శిఖ కీర్తన్య (8) అనే చిన్నారి దుర్గామాత నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన డీజే కరెంటు తీగ తాకి మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ భాస్కర్ ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు. @ జగిత్యాల లో కస్టమర్ పై టిఫిన్ సెంటర్ సిబ్బంది దాడి. @ హుస్నాబాద్ లో దసరా వేడుకలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. @ భీమారం మండలంలో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి. @ శంకరపట్నం మండలంలో బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.

భీమరం మండలం రాగోజీపేటలో దసరా పండగ పూట విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. దుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మహిషాసుర మర్ధిని కార్యక్రమంలో రావణాసురుడి బొమ్మకు నిప్పు పెట్టే ప్రయత్నంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి అరిసెల వెంకటేష్ ( 36) అక్కడే కుప్పకూలి పడిపోయాడు. గ్రామస్థులు వెంటనే జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లగా మృతిచెందాడని వైద్యులు తెలిపారు.

దసరా సందర్భంగా కరీంనగర్ జిల్లాలో నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరిగింది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. వంట నూనెల నుంచి కూరగాయల వరకు ధరలు గత 20 రోజుల్లో 30% రెట్లు అధికం కావడంతో సామాన్యులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. గత 20 రోజుల క్రితం సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు ధర రూ.115 ఉండగా ప్రస్తుతం రూ. 145-150 వరకు, పామాయిల్ ధర రూ.90ఉండగా రూ. 125వరకు ఉన్నాయి.

దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.