India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే, రూపాదేవి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుకునే రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారికి ఇద్దరు పిల్లలు యోజిత్ (11), రుషికశ్రీ(8). కాగా ఆమె ఉపాధ్యాయురాలు. రెండు నెలల క్రితమే వారు హైదరాబాద్కు రాగా ఈ ఘటన జరిగింది.
శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన ఆరుగురు విద్యార్థులు డిబార్ అయినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలు తెలిపారు. విద్యార్థులు సక్రమంగా పరీక్షలు హాజరుకావాలని ఆయన సూచించారు.
సుల్తానాబాద్ పట్టణంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామంలో బాలికకు తాత వరుసైన పోచాలు(60) ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భయపడిన బాలిక తల్లిదండ్రులకు తెలుపగా బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం హుజూరాబాద్కు వచ్చిన సందర్భంలో అంబేడ్కర్ చౌరస్తాలో జేబు దొంగలు హల్ చల్ సృష్టించారు. BJP నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్ వచ్చిన సంబరాల్లో మునిగి తేలగా జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 10, 15 మంది జేబుల్లో ఉన్న డబ్బులను గుట్టు చప్పుడు కాకుండా దొంగలించారు. దీంతో బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రజలతో మమేకమై పోలీసులు విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ (IG) సూచించారు. గోదావరిఖని పట్టణ చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్, లా & ఆర్డర్ పోలీసులను కలిసి వారికి సూచనలు ఇచ్చారు. విజువల్ పోలీసింగ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉంటూనే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని అన్నారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి. @ ఎలిగేడు మండలంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. @ ధర్మపురి మండలంలో వ్యవసాయ బావిలో పడి యువకుడి మృతి. @ కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్న జగిత్యాల ఎస్పీ.
హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్లో ఉమ్మడి కరీంనగర్కు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుదిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై క్యాబినెట్ మీటింగ్లో మంత్రులు చర్చించారు. ప్రభుత్వ విధివిధానాలు సంబంధించి ఏ విషయమైనా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటిస్తారని సీఎం అన్నారు.
రహదారులు, భవనాలశాఖ ఆధ్వర్యంలో ప్రగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం రహదారులు భవనశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పెండింగ్లో ఉన్న పనుల పురోగతిపై చర్చించారు. వర్షాకాలం నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా క్షేత్రస్థాయిలో ఎక్కడైనా మరమ్మతుల అవసరముంటే వెంటనే చేపట్టాలన్నారు.
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. కాగా రెండో రోజు గురువారం జరిగిన పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్వీ శ్రీరంగ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సక్రమంగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
ఈనెల 26 నుంచి బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ దూరవిద్య డిగ్రీ పరీక్షలు నిర్వహించనున్నట్లు గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జులై 3 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.