India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఉండొద్దన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన న్యూట్రీషన్ కిట్ల పంపిణీ ప్రస్తుతం జరగడం లేదు. జగిత్యాల జిల్లాలో నాలుగు నెలలుగా గర్భిణులకు ఇవ్వాల్సిన కిట్లు అందడం లేదు. గత ఫిబ్రవరి వరకు సజావుగా సాగగా ప్రస్తుతం వాటి ఊసే లేకుండా పోయింది. గతంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లను ఎంసీహెచ్ కిట్లుగా పేరు మార్చిన ప్రభుత్వం వాటిని కూడా అందించకపోవడంతో నిరాశతో ఉన్నారు.
మెట్పల్లి పట్టణానికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బత్తిని నవదీప్ అనే యువకుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బాలికను నవదీప్ కొన్ని రోజులుగా వేధిస్తుండడంతో ఈనెల 12న బాలిక తల్లి ఫిర్యాదు చేయగా, అతనిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. దీంతో గురువారం అతనిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వివరించారు.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో బైకు, కంటైనర్ ఢీ.. యువకుడి మృతి.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం.
@ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్.
@ చందుర్తి మండలంలో ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
@ రేపు సిరిసిల్లలో పర్యటించనున్న కేటీఆర్.
@ జగిత్యాల జిల్లా జడ్జిని కలిసిన జగిత్యాల ఎస్పి.
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి గురువారం రూ.90,402 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో టికెట్ల ద్వారా రూ.43,864, ప్రసాదాల ద్వారా రూ.28,050, అన్నదానం కోసం రూ.18,488 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కొత్తూరులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. స్థానికుల ప్రకారం.. గ్రామంలోని పల్లె దవాఖాన వద్ద గత కొద్ది రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో ఆకులపై కుంకుమ, పసుపు, కోడిగుడ్డు, మిరపకాయలు, నిమ్మకాయలు పెట్టి వెళ్తున్నారు. దీనిని చూసిన స్థానికులు, పల్లె దవాఖానకు వెళ్లే పేషెంట్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ధర్మపురి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువ జామునే సుదూర ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చిన భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
పెద్దపల్లి జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలోనే కాకుండా మిగిలిన పని దినాల్లో కూడా తనను కలవొచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం నుంచి శనివారం వరకు పని దినాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు తాను అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజలు నేరుగా వారి సమస్యలను తెలుపవచ్చని కలెక్టర్ తెలిపారు.
భార్యభర్తల మధ్య ఏర్పడిన చిన్న వివాదంతో.. నవజాత <<13473222>>శిశువును <<>>తల్లి వదిలి వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు స్పందించి ఇరు కుటుంబాల వివరాలు సేకరించి.. శిశువును వదిలి వెళ్ళిన తల్లిని ఆసుపత్రికి రప్పించి కౌన్సిలింగ్ నిర్వహించారు. శిశువును తమ వద్ద ఉంచుకుంటామని తల్లి, తండ్రి కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో శిశువు తల్లి వద్దే ఉండేలా సీఐ విజయ్ మాట్లాడి సమస్యను పరిష్కరించారు.
ఆధార్, రేషన్ కార్డు అనుసంధానం గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 30 వరకు గడువు కాగా సెప్టెంబర్ 30 వరకు పొడగిస్తూ ఆహార, పౌరసరఫరాల శాఖ విభాగం ప్రకటన జారీ చేసింది. కరీంనగర్ జిల్లాలో 91% ఈకేవైసీ పూర్తవగా.. మరో 9% చేయాల్సి ఉంది. వీలైనంత త్వరగా పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
సిద్దిపేట జిల్లాకి మౌనిక, మహేశ్ పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఆ తల్లి పసిబిడ్డను వదిలివెళ్లడం KNRలో కలకలం సృష్టించింది. మౌనిక ప్రసవం కోసం KNR మాతా శిశు ఆసుపత్రిలో 16న చేరింది. 17న మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషాన్ని తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. కానీ మరుసటి రోజు మౌనిక తన తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. మహేశ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Sorry, no posts matched your criteria.