Karimnagar

News June 20, 2024

ధర్మపురి దేవస్థానంలో భక్తుల రద్దీ

image

ధర్మపురి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువ జామునే సుదూర ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చిన భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

News June 20, 2024

ప్రజావాణిలోనే కాదు మిగిలిన రోజుల్లోనూ కలవొచ్చు: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలోనే కాకుండా మిగిలిన పని దినాల్లో కూడా తనను కలవొచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం నుంచి శనివారం వరకు పని దినాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు తాను అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజలు నేరుగా వారి సమస్యలను తెలుపవచ్చని కలెక్టర్ తెలిపారు.

News June 20, 2024

KNR: తల్లి చెంతకు నవజాత శిశువు

image

భార్యభర్తల మధ్య ఏర్పడిన చిన్న వివాదంతో.. నవజాత <<13473222>>శిశువును <<>>తల్లి వదిలి వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు స్పందించి ఇరు కుటుంబాల వివరాలు సేకరించి.. శిశువును వదిలి వెళ్ళిన తల్లిని ఆసుపత్రికి రప్పించి కౌన్సిలింగ్ నిర్వహించారు. శిశువును తమ వద్ద ఉంచుకుంటామని తల్లి, తండ్రి కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో శిశువు తల్లి వద్దే ఉండేలా సీఐ విజయ్ మాట్లాడి సమస్యను పరిష్కరించారు.

News June 20, 2024

KNR: రేషన్ ఈకేవైసీ గడువు పెంపు

image

ఆధార్, రేషన్ కార్డు అనుసంధానం గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 30 వరకు గడువు కాగా సెప్టెంబర్ 30 వరకు పొడగిస్తూ ఆహార, పౌరసరఫరాల శాఖ విభాగం ప్రకటన జారీ చేసింది. కరీంనగర్ జిల్లాలో 91% ఈకేవైసీ పూర్తవగా.. మరో 9% చేయాల్సి ఉంది. వీలైనంత త్వరగా పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

News June 20, 2024

KNR: పుట్టిన బిడ్డను వదిలేసి తల్లి

image

సిద్దిపేట జిల్లాకి మౌనిక, మహేశ్ పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఆ తల్లి పసిబిడ్డను వదిలివెళ్లడం KNRలో కలకలం సృష్టించింది. మౌనిక ప్రసవం కోసం KNR మాతా శిశు ఆసుపత్రిలో 16న చేరింది. 17న మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషాన్ని తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. కానీ మరుసటి రోజు మౌనిక తన తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. మహేశ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News June 20, 2024

KNR: అమ్మాయిలపైనే కాళేశ్వరం SI కన్ను..!

image

ఓ మహిళా కానిస్టేబుల్ పై <<13467023>>కాళేశ్వరం <<>>SI బావానీసేన్ లైంగిక వేధింపుల కేసులో డిస్మిస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈయన కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం SIగా ఉన్నప్పుడు కానిస్టేబుల్ పుస్తకాలు కొనిస్తానని, కొచింగ్ ఇప్పిస్తానని చెప్పి యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేశారు. కాళేశ్వరం SIగా వచ్చిన తర్వాత ప్రధానంగా ఆయన దృష్టి కొందరి మహిళలపై పడింది.

News June 20, 2024

నన్ను నమ్మి ఓటు వేసినందుకు కృతజ్ఞతలు: ఈటల

image

కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం, మైత్రినగర్ వాసులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో MP ఈటల రాజేందర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అన్ని నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి సమయం దొరకలేదు. అందుకే ఇప్పుడు కడుపునిండా మాట్లాడి పోదామని వచ్చానని అన్నారు. మల్కాజిరిలో నన్ను నమ్మి ఓటు వేసి చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చారన్నారు.

News June 19, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి ఘన స్వాగతం.
@ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను దర్శించుకున్న బండి సంజయ్.
@ కమలాపూర్ మండలంలో కారు, బైకు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు.
@ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చొప్పదండి ఎమ్మెల్యే సత్యం.
@ రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడిని పరామర్శించిన మాజీ గవర్నర్.
@ మేడిపల్లి మండలంలో అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య.

News June 19, 2024

వేములవాడ రాజన్న సేవలో బండి సంజయ్

image

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బుధవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోడె మొక్కు చెల్లించుకోని సేవలో తరించారు. ఆలయానికి చేరుకున్న బండి సంజయ్‌కు బీజేపీ శ్రేణులు, అభిమానులు, నాయకులు అపూర్వ స్వాగతం పలికారు.
కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అడుగుపెట్టడంతో బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు.

News June 19, 2024

ముల్కనూర్‌లో గుప్తనిధుల తవ్వకాలు!

image

భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో మూడు రోజుల క్రితం గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ రైతు మామిడి తోటలోని రావులమ్మ గుడి కింద గుప్తనిధులు ఉన్నాయని కొంత మంది JCB సహాయంతో తవ్వకాలు జరిపారని తోట యజమాని పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

error: Content is protected !!