India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం కరీంనగర్ రానున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కరీంనగర్ విచ్చేస్తున్న బండి సంజయ్ కుమార్కు ఘన స్వాగతం పలికేందుకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈనెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 23న ఢిల్లీ పయనమమవుతారు.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య(55) ప్రమాదవశాత్తు మాల్దీవుల్లో పని చేస్తూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. కుటుంబీకుల ప్రకారం.. జీవనోపాధి కోసం బొంబాయిలోని ఓ కంపెనీలో పనిచేస్తూ కంపెనీ చేపట్టిన బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా మాల్దీవులకు తీసుకెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తుండగా రెండు క్రేన్ల మధ్యలో ఇరుక్కుని మృతి చెందాడు.
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లిలోని డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ తెలిపారు. ఈనెల 19 నుంచి జూలై 03 వరకు వెబ్ సైట్ www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవలని సూచించారు. ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ముంపు ప్రాంతంలో 92.77 లక్షల టన్నుల ఇసుక పూడికను తీయనున్నారు. దీనికోసం తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ 14 బ్లాకులను గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ఇసుకను తవ్వి తరలించనున్నారు. ఈ మేరకు 14 బ్లాక్లో విడివిడిగా టెండర్లను ఆహ్వానించింది. ఇసుక పూడిక తీయడం ద్వారా బ్యారేజీలో నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని భావిస్తోంది.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ జాతీయ రహదారిపై మంగళవారం పెను ప్రమాదం తప్పింది. మొలంగూర్ మూల మలుపు వద్ద జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. ఆ రోడ్డు గుండా వెళ్తున్న గ్రానైట్ లారీ అదుపుతప్పడంతో గ్రానైట్ కింద పడింది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హూస్నాబాద్ మండలంలో దారుణం జరిగింది. కూచన్పల్లికి చెందిన నరసయ్య(55) ఇంట్లో నిద్రిస్తుండగా గొడ్డలితో దుండగులు నరికి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ కార్పొరేషన్తో పాటు జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇప్పటికే చెత్తా చెదారంతో నిండిపోగా వాటిని ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాల్సిన యజమానులు పట్టించుకోవడం లేదు. వర్షం పడితే ఆయా స్థలాల్లో మురుగునీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారే ప్రమాదం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో స్థల యజమానులు స్పందించి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాల్సిన అవసరం ఉంది.
పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శన వేళలను పునరుద్ధరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పుల వల్ల భక్తులు, అర్చకులు సిబ్బంది సౌకర్యార్థం మార్పులు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 4 గంటల వరకు విరామ సమయంగా నిర్ణయించారు. ఉదయం 6:30 గంటల నుంచి 1:30 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులు దర్శనాలు వివిధ పూజలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండల పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ వర్షాకాలంలో వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, విత్తనాల గురించి.. విద్యుత్ అంతరాయం తాగునీటి ఇబ్బందులపై సమస్యలు ఉంటే త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా బక్రీద్.
@ కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్లో పడి వ్యక్తి మృతి.
@ ముస్తాబాద్ మండలంలో దొంగల హల్ చల్.
@ ఇబ్రహీంపట్నం మండలంలో వ్యవసాయ బావిలో దూకి మహిళా ఆత్మహత్య.
@ మల్హర్ మండలంలో విద్యుత్ షాక్ తగిలి యువకుడి మృతి.
@ జగిత్యాల జిల్లా ఎస్పీగా అశోక్ కుమార్.
@ మెట్ పల్లి మండలంలో అనారోగ్యంతో ఆర్ఎంపి వైద్యుడు మృతి.
Sorry, no posts matched your criteria.