Karimnagar

News June 18, 2024

హూస్నాబాద్‌లో దారుణ హత్య

image

హూస్నాబాద్ మండలంలో దారుణం జరిగింది. కూచన్‌పల్లికి చెందిన నరసయ్య(55) ఇంట్లో నిద్రిస్తుండగా గొడ్డలితో దుండగులు నరికి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 18, 2024

కరీంనగర్: ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం!

image

కరీంనగర్‌ కార్పొరేషన్‌తో పాటు జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇప్పటికే చెత్తా చెదారంతో నిండిపోగా వాటిని ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాల్సిన యజమానులు పట్టించుకోవడం లేదు. వర్షం పడితే ఆయా స్థలాల్లో మురుగునీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారే ప్రమాదం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో స్థల యజమానులు స్పందించి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాల్సిన అవసరం ఉంది.

News June 18, 2024

నేటి నుంచి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శన వేళల్లో మార్పులు

image

పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శన వేళలను పునరుద్ధరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పుల వల్ల భక్తులు, అర్చకులు సిబ్బంది సౌకర్యార్థం మార్పులు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 4 గంటల వరకు విరామ సమయంగా నిర్ణయించారు. ఉదయం 6:30 గంటల నుంచి 1:30 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులు దర్శనాలు వివిధ పూజలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

News June 18, 2024

హుస్నాబాద్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం సమావేశం 

image

హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండల పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ వర్షాకాలంలో వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, విత్తనాల గురించి.. విద్యుత్ అంతరాయం తాగునీటి ఇబ్బందులపై సమస్యలు ఉంటే త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.   

News June 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా బక్రీద్.
@ కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్‌లో పడి వ్యక్తి మృతి.
@ ముస్తాబాద్ మండలంలో దొంగల హల్ చల్.
@ ఇబ్రహీంపట్నం మండలంలో వ్యవసాయ బావిలో దూకి మహిళా ఆత్మహత్య.
@ మల్హర్ మండలంలో విద్యుత్ షాక్ తగిలి యువకుడి మృతి.
@ జగిత్యాల జిల్లా ఎస్పీగా అశోక్ కుమార్.
@ మెట్ పల్లి మండలంలో అనారోగ్యంతో ఆర్ఎంపి వైద్యుడు మృతి.

News June 17, 2024

జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్!

image

జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియలో భాగంగా ఆయనను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. జగిత్యాల నూతన ఎస్పీగా ప్రస్తుత మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

News June 17, 2024

మల్హర్: విద్యుదాఘాతంతో యువకుడి మృతి

image

మండలంలోని రుద్రారంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. కొయ్యూరు పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన నిశాంత్(30) ఇంటి ఆవరణంలోని మోటార్ వైరును సరి చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు భూపాలపల్లిలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి గత నాలుగు నెలల క్రితమే వివాహమైంది.

News June 17, 2024

FLASH.. లోయర్ మానేర్ డ్యాంలో పడి ప్రభుత్వ ఉద్యోగి మృతి

image

కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్‌లో మునిగి రాంనగర్‌కు చెందిన విజయ్ అనే ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందాడు. ఎల్ఎండీ వద్ద కూతురు సాయినిత్య, కుమారుడు విక్రాంత్ ఫొటో దిగుతుండగా రిజర్వాయర్లో పడ్డారు. ఈ క్రమంలో వారిని కాపాడబోయిన విజయ్ నీటిలో మునిగి మృతి చెందాడు. కాగా, విజయ్ పిల్లలను జాలరి శంకర్ కాపాడారు. కాగా, మృతుడు అసిఫాబాద్ జిల్లాలో పే అండ్ అకౌంట్లో పని చేస్తున్నాడు. 

News June 17, 2024

ఈనెల 20న కరీంనగర్‌కి బండి సంజయ్

image

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ ఈనెల 20న కరీంనగర్‌కి రానున్నట్లు బిజెపి నేతలు తెలిపారు. 21, 22వ తేదీల్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గానికి ఒక ప్రముఖ దేవాలయం దర్శనం చేసుకుంటారని తెలిపారు. కేంద్ర మంత్రి హోదాలో మొదటి సారి కరీంనగర్‌కి రానున్న నేపథ్యంలో భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు బిజెపి నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

News June 17, 2024

రైలు ప్రమాదం దురదృష్టకరం: బండి సంజయ్

image

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం చాలా దురదృష్టకరమని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. బాధితులకు ఎక్స్‌గ్రేషియా పరిహారం అందిస్తామన్నారు.