India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన BHPL జిల్లా కాటారం మండలం మేడిపల్లిలో జరిగింది. SI అభినవ్ వివరాల ప్రకారం.. మేడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బస్వాపూరకి చెందిన లింగయ్య(35) రెండున్నర ఎకరాలను రెండేళ్ల క్రితం కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లతో పంట దిగుబడి రాకనోవడంతో రూ.4 లక్షల అప్పయ్యాడు. మనస్తాపం చెందిన రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రైతు రుణమాఫీపై స్పష్టత లేకపోగా ఏటా తీసుకున్న రుణాన్ని చెల్లించి తిరిగి తీసుకుంటే వడ్డీ బాధ పోయేది. కరీంనగర్ జిల్లాలో 1.34లక్షల మంది రైతులు రుణమాఫీ దారులు ఉండగా అందులో దాదాపు 60వేల మంది వడ్డీ కడుతూ వస్తున్నారు. ఇక రూ.2లక్షల రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఆగస్టు 15లోపు ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన విధివిధానాలపై రైతన్నల్లో ఆందోళన నెలకొంది.
MHBD జిల్లాకు చెందిన శ్రీనివాస్ కుమారుడు జాన్వెస్లీ(7) మంగళవారం పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రిలోని సెప్టిక్ ట్యాంకులో పడిన విషయం తెలిసిందే. బాలుడు తీవ్ర ఆస్వస్థతకు గురికాగా మెరుగైన వైద్యం కోసం KNR ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బాలుడు బుధవారం మృతి చెందాడు. ట్యాంక్ మూత తెరిచి ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి డిమాండ్ చేశారు.
విద్య ద్వారానే నిజమైన అభివృద్ధి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్నివర్గాలకు ఉన్నత విద్య అందించడానికి రాజీవ్ గాంధీ వేసిన బాటలు రహదారులుగా మారాయని ఆయన పేర్కొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తే .. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థులకు ఫీజు రాయితీ ఇచ్చి డాక్టర్లను, ఇంజనీర్లను చేశారన్నారు.
@ శంకరపట్నం మండలంలో రెండు బైకులు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు. @ ఓదెల మండలంలో పట్టాలు దాటుతుండగా రైలు తగిలి యువకుడికి గాయాలు. @ ఇబ్రహీంపట్నం మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ కోరుట్ల పట్టణంలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన. @ జగిత్యాల జిల్లాలో 18 మంది ఎస్ఐల బదిలీ. @ ఈవీఎం గోదాములను పరిశీలించిన కరీంనగర్ కలెక్టర్. @ మెట్పల్లి పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే సంజయ్.
కరీంనగర్ శివార్లలోని ఎలగందులలో 18వ శతాబ్దానికి చెందిన మెట్లబావి ఉంది. దీనిని నాగన్నబావి అని ఇక్కడి స్థానికులు పిలుస్తుంటారు. దగ్గరికి వెళ్లి చూస్తే తప్ప, ఇక్కడ మెట్ల బావి ఉన్న సంగతి తెలియదు. ఎందుకంటే, నేలమట్టం నుంచి కిందకు 20 మీటర్ల లోతులో బావిని నిర్మించారు. వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఇలాంటి బావులను సంరక్షించి, మన ప్రాచీన వారసత్వ సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
గ్రూప్-1 మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి , జగిత్యాల జిల్లాలకు చెందిన ఔత్సాహికులు తమ దరఖాస్తులను వెబ్ సైట్ www.tgbcstudycircle.cgg.gov.inలో ఈ నెల 19 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 75 రోజుల పాటు నిర్వహించే శిక్షణ ఈనెల 22న మొదలవుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పంట రుణమాఫీపై అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా సహకార సంఘాల పరిధిలోని డీసీసీబీ, ఎస్బీఐ బ్యాంకుల్లో రూ.2 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతుల వివరాలను అధికారులు సేకరించారు. ఆయా బ్యాంకుల రికార్డుల ఆధారంగా రైతుల వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. ఎట్టకేలకు రుణమాఫీపై కదలిక రావడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
గుండెపోటుతో ఓ గల్ఫ్ కార్మికుడు మృతిచెందిన ఘటన తంగళ్లపల్లి మండలంలోని మల్లాపూర్లో జరిగింది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజేశ్ ఉపాధి నిమిత్తం గత పదేళ్లుగా గల్ఫ్లో ఉంటున్నాడు. 6 నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. శాఖాపూర్కు చెందిన డిగ్రీ విద్యార్థిని(19) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.