India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గోదావరిలో స్నానం చేస్తూ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో చోటుచేసుకుంది. ఎస్సై భవానిసేన్ తెలిపిన వివరాలిలా.. వరంగల్కు చెందిన గరికపాటి అఖిల్ (19) ఆదివారం కాళేశ్వరం వచ్చారు. అందులో భాగంగా స్నానం చేయడానికి గోదావరిలోకి దిగాడు. ఈ క్రమంలో యువకుడు గల్లంతయ్యాడన్నారు. సమాచారమందుకున్న తమ సిబ్బంది నదీతీరానికి చేరుకుని గాలింపు చర్యలు సాగిస్తున్నట్లు తెలిపారు.
అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించలేని కార్మికుల విషయంలో పారదర్శకంగా అన్ ఫిట్ చేస్తామని సింగరేణి సంస్థ C&MD బలరాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మధ్య వర్తుల విషయంలో మోసాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సింగరేణి అభ్యర్థన మేరకు అవినీతి నిరోధక శాఖ ఈ విషయంలో పరిశీలిస్తున్నారన్నారు. అదేవిధంగా ఎవరైనా మోసం చేసినట్లు తెలిస్తే సింగరేణి విజిలెన్స్ 94911 44104 సమాచారం అందించాలన్నారు.
పలిమెల మండలంలోని సర్వాయిపేట గ్రామానికి చెందిన పురుషోత్తం (28) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుషోత్తం వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని ఖమ్మం మూడో టౌన్, RPF పోలీసులు రక్షించిన ఘటన శనివారం ఖమ్మంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జమ్మికుంటకు చెందిన అనిల్కు భార్యతో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందాడు. దీంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఖమ్మం మూడో టౌన్
ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు.
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఈనెల 18న జరగాల్సిన ఎంఈడీ మొదటి సెమిస్టర్ 19వ తేదీకి వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. శ్రీరంగ ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలు తెలిపారు. 18న యూజిసి నెట్ ఎగ్జామినేషన్ కారణంగా 19వ తేదీన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఆరేళ్ళ చిన్నారిని ఓ యువకుడు హత్యచారం చేసిన విషయం తెలిసిందే. బిహర్కు చెందిన నిందితుడు వినోద్ మాజేను పోలీసులు శనివారం జిల్లా కోర్టులో హాజరుపర్చారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి హేమంతం కుమార్ నిందితుడికి రిమాండ్ విధించారు. దీంతో అతడిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.
ఫాస్ట్ బౌలర్ల కోసం HYD క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాలెంట్ హంట్ చేపడుతోంది. ఈ నెల 22న HYD ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను HCA అధికారిక వెబ్సైట్ http://www.hycricket.inలో నమోదు చేసుకోవాలని అసోసియేషన్ వివరించింది.
@ కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు బదిలీ. @ జగిత్యాల అడిషనల్ కలెక్టర్ దివాకర బదిలీ. @ గొల్లపల్లి మండలంలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం. @ మెట్పల్లి మండలంలో గుండెపోటుతో పూజారి మృతి. @ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల ఎస్పీ. @ మల్యాల మండలంలో రెండిళ్లలో చోరీ. @ కథలాపూర్ మండలంలో 8 మంది పేకాట రాయుళ్ల పట్టివేత.
రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని కరీంనగర్ జిల్లా పాలనాధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత కలెక్టర్ పమెల సత్పతిని బదిలీ చేశారు.
శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన మమత పొరుగింటి వ్యక్తి రత్నాకర్ను 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. ఆ పెళ్లి మమత కుటుంబానికి ఇష్టం లేదు. మమత ఇంటి ఎదుట నుంచి రత్నాకర్ ఇంటికి వెళ్లాలి. దీంతో మమత తల్లిదండ్రులు రోడ్డుపై అడ్డంగా గోడ కట్టారు. దీనిపై ఎవరు చెప్పినా వారు వినకపోవడంతో మమత తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Sorry, no posts matched your criteria.