Karimnagar

News June 14, 2024

జగిత్యాల: సగం కాలిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం

image

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని రోళ్ల వాగు సమీపంలో శుక్రవారం సగం కాలిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం లభించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అయితే మృతదేహం సగానికి పైగా కాలిపోయి ఉండగా గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి కాల్చి ఉంటారా లేదా ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

News June 14, 2024

బాలికను హత్యాచారం చేసిన నిందితుడిని అప్పజెప్పాలని నిరసన

image

సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో గురువారం రాత్రి <<13437328>>హత్యాచారానికి <<>>గురైన బాలికను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. వివిధ పార్టీల నాయకులు పలువురు మహిళలు రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టారు. హత్యాచారం చేసిన నిందితుడిని తమకు అప్పజెప్పాలని, రైస్ మిల్లు యాజమాన్యం దిగిరావాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

News June 14, 2024

KNR: పిల్లలతో పాటు చెరువులో దూకిన తల్లి

image

ఓ తల్లి పిల్లలను చెరువులోకి విసిరేసి తానూ దూకిన ఘటన అమీన్పూర్‌లో జరిగింది. పోలీసుల ప్రకారం.. KNR జిల్లా తిమ్మాపూర్ మం. నుస్తులాపూర్‌కు చెందిన శ్వేత, విద్యాధర్ రెడ్డి ఐటీ ఉద్యోగాలు చేస్తూ చందానగర్లో ఉంటున్నారు. పిల్లల్ని చూసుకునే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీంతో విరక్తి చెందిన శ్వేత పిల్లల్ని చెరువులోకి విసిరేసి తానూ దూకింది. ఈ ఘటనలో బాబు మృతి చెందగా తల్లి కూతుళ్లను పోలీసులు కాపాడారు.

News June 14, 2024

KNR: ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి

image

ఇసుక ట్రాక్టర్ ఢీకొని భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల ప్రకారం.. విలాసాగర్‌కు చెందిన రాజయ్య(48), దామెరకుంటకు చెందిన బాపు(45) బైకుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో రుద్రారానికి చెందిన శ్రీనివాస్ కూతురిని తీసుకొని బైకుపై వస్తుండగా.. దుబ్బపల్లి సమీపంలో వీరి బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అదే సమయంలో అతి వేంగా వచ్చిన ట్రాక్టర్ రోడ్డపై పడి ఉన్న రాజయ్య, బాపు పైనుంచి పోవడంతో మృతి చెందారు.

News June 14, 2024

BREAKING.. పెద్దపల్లి: ఆరేళ్ల బాలికపై హత్యాచారం

image

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ఆరేళ్ల బాలికపై బుధవారం రాత్రి వ్యక్తి అత్యాచారం చేసి హత్యచేశాడు. స్థానికుల ప్రకారం.. ఓ రైస్‌మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను రైస్‌మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు. సమీప పొదల్లోకి తీసుకెళ్లి హత్యాచారం చేశాడు. బాలికలేదని తల్లి గుర్తించి తోటి కార్మికులతో కలిసి వెతకడంతో విషయం బయటపడింది. నిందితుడిని రైస్ మిల్లు కార్మికులు పోలీసులకు అప్పగించారు.

News June 14, 2024

PDPL: ప్రతి ఉద్యోగి ఆర్థిక ప్రణాళిక కలిగి ఉండాలి: కలెక్టర్

image

ప్రతి ఉద్యోగి ఆర్థిక ప్రణాళిక కలిగి ఉండాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ అన్నారు. గురువారం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటుచేసిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఉద్యోగి కాంపౌండింగ్‌ అంశంపై అవగాహన కలిగి ఉండాలని, భవిష్యత్తు కోసం ఆదా చేసే సొమ్ము మార్కెట్‌లో పెట్టుబడిగా పెడితే మంచి రిటర్న్ వస్తాయని తెలిపారు.

News June 14, 2024

KNR: పెరిగిన ధరలు.. మునగ రూ.120, టమాట రూ.60

image

మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఉమ్మడి KNR వ్యాప్తంగా దిగుబడి తగ్గడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ధరలు పెరుగుతున్నాయి. KNRతో పాటు GDK, హుస్నాబాద్, హజూరాబాద్, జమ్మికుంట, జగిత్యాల తదితర ప్రాంతాలకు KNR హోల్‌సేల్ మార్కెట్ నుంచి సరఫరా అవుతుంటాయి. దీంతో ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మునగ కిలోకు రూ.60 ఉన్న ధర రూ.120కి చేరింది. కిలో రూ.20-30 ఉన్న టమాట.. ప్రస్తుతం రూ.60కి చేరింది.

News June 14, 2024

ఎంపీ సురేష్ షెట్కర్‌ని సన్మానించిన మంత్రి పొన్నం

image

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన సురేష్ షెట్కర్ గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందిన సురేష్ షెట్కర్‌ని శాలువాతో సన్మానించారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో గలం విప్పాలని తెలిపారు. తెలంగాణ పక్షాన పార్లమెంటులో ప్రశ్నించే గొంతుకగా నిలుస్తారని ఆశిస్తున్నానన్నారు.

News June 13, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల, సిరిసిల్ల కలెక్టరేట్ల ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా.
@ వీర్నపల్లి మండలంలో కుక్కల దాడిలో రెండు దుప్పిలు మృతి.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో మైనర్లు నడిపిన వాహనాలను సీజ్ చేసిన పోలీసులు.
@ జగిత్యాల జిల్లాలో బడిబాటలో పాల్గొన్న కలెక్టర్.
@ మిషన్ భగీరథ సర్వేను పరిశీలించిన సిరిసిల్ల కలెక్టర్.
@ మెట్పల్లి ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే.

News June 13, 2024

KNR: ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్.. 40 మంది మైనర్లు పట్టివేత

image

కరీంనగర్ పట్టణంలోని పలుచోట్ల టౌన్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో గురువారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపిన దాదాపు 40 మంది మైనర్లు పట్టుబడ్డారన్నారు. పట్టుబడిన వాహనాలను KNR ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన లేని మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలువ్వొద్దన్నారు.

error: Content is protected !!