India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట- సిర్పూర్ కాగజ్నగర్ మధ్య రామగుండం నుంచి నడిచే 14 ప్యాసింజర్, సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను నెలరోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాలతో ఈరోజు నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కొన్నింటిని దారి మళ్లించామని, మరికొన్నింటిని ఆలస్యంగా నడిపిస్తామని వివరించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజురోజుకి మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 2022లో 68, 2023లో 58, 2024లో 27 పోక్సో కేసులు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్లలో 2022లో 62, 2023లో 42, 2024లో 18, జగిత్యాల జిల్లాలో 2022లో 59, 2023లో 84, 2024లో 48, పెద్దపల్లి జిల్లాలో 2022లో 29, 2023లో 20, 2024లో 01 పోక్సో కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.10,182.7 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం కలెక్టరేట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ అవసరాల కోసం రూ. 3673.92 కోట్లు, ఎంఎస్ఎంఈ కింద రూ.2997.06 కోట్లు, విద్యా రుణాలు రూ. 44.55 కోట్లు, గృహ రుణాలు రూ.192.00 కోట్లు, ఇతర రంగాలకు గానూ రూ. 3275.17 కోట్ల రుణాలను అందించాలని బ్యాంకర్లు ఆదేశించారు.
@ ధరణి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ రుద్రంగి మండలంలో బస్సు, బైకు ఢీ.. యువకుడి మృతి. @ తంగళ్ళపల్లి మండలంలో బస్సు, డీసీఎం ఢీ.. పలువురికి గాయాలు. @ మెట్పల్లి మండలంలో 9 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ పెద్దపల్లి జిల్లాలో బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన కీచకుడు. @ బీర్పూర్ మండలంలో అసంపూర్తిగా కాలిన మృతదేహం లభ్యం.
పెండింగ్ ధరణి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రతి మండలంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భవనం లేదా భూమి కేటాయించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని రోళ్ల వాగు సమీపంలో శుక్రవారం సగం కాలిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం లభించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అయితే మృతదేహం సగానికి పైగా కాలిపోయి ఉండగా గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి కాల్చి ఉంటారా లేదా ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో గురువారం రాత్రి <<13437328>>హత్యాచారానికి <<>>గురైన బాలికను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. వివిధ పార్టీల నాయకులు పలువురు మహిళలు రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టారు. హత్యాచారం చేసిన నిందితుడిని తమకు అప్పజెప్పాలని, రైస్ మిల్లు యాజమాన్యం దిగిరావాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఓ తల్లి పిల్లలను చెరువులోకి విసిరేసి తానూ దూకిన ఘటన అమీన్పూర్లో జరిగింది. పోలీసుల ప్రకారం.. KNR జిల్లా తిమ్మాపూర్ మం. నుస్తులాపూర్కు చెందిన శ్వేత, విద్యాధర్ రెడ్డి ఐటీ ఉద్యోగాలు చేస్తూ చందానగర్లో ఉంటున్నారు. పిల్లల్ని చూసుకునే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీంతో విరక్తి చెందిన శ్వేత పిల్లల్ని చెరువులోకి విసిరేసి తానూ దూకింది. ఈ ఘటనలో బాబు మృతి చెందగా తల్లి కూతుళ్లను పోలీసులు కాపాడారు.
ఇసుక ట్రాక్టర్ ఢీకొని భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల ప్రకారం.. విలాసాగర్కు చెందిన రాజయ్య(48), దామెరకుంటకు చెందిన బాపు(45) బైకుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో రుద్రారానికి చెందిన శ్రీనివాస్ కూతురిని తీసుకొని బైకుపై వస్తుండగా.. దుబ్బపల్లి సమీపంలో వీరి బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అదే సమయంలో అతి వేంగా వచ్చిన ట్రాక్టర్ రోడ్డపై పడి ఉన్న రాజయ్య, బాపు పైనుంచి పోవడంతో మృతి చెందారు.
పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ఆరేళ్ల బాలికపై బుధవారం రాత్రి వ్యక్తి అత్యాచారం చేసి హత్యచేశాడు. స్థానికుల ప్రకారం.. ఓ రైస్మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను రైస్మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు. సమీప పొదల్లోకి తీసుకెళ్లి హత్యాచారం చేశాడు. బాలికలేదని తల్లి గుర్తించి తోటి కార్మికులతో కలిసి వెతకడంతో విషయం బయటపడింది. నిందితుడిని రైస్ మిల్లు కార్మికులు పోలీసులకు అప్పగించారు.
Sorry, no posts matched your criteria.