India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పదిరోజుల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీసేవా సేవలు నిలిచిపోయాయి. దీంతో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వారికి సకాలంలో సర్టిఫికెట్లు లభించక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర డేటా సెంటర్లో సాంకేతిక సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్తున్నారు.

కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పనుల కోసం ప్రభుత్వం రూ.137 కోట్లు విడుదల చేసింది. అలాగే కొత్తపల్లి నుంచి వేములవాడ మధ్యలో ట్రాక్ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణకు కరీంనగర్ జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ విడుదల చేయడం శుభపరిణామం. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2025 మార్చి నాటికి పూర్తి చేయా లని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ.. ఈ వేగంతో పనులు ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు.

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. రాయికల్ పట్టణానికి చెందిన మనీశ్(6) జ్వరంతో మృతి చెందాడు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించగా కోలుకున్నాడు. మళ్లీ రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో పరీక్షలు చేయించారు. డెంగ్యూగా నిర్ధారణ కావడంతో కుటుంబీకులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే ఫిట్స్ వచ్చి మృతి చెందాడు.

KNR జిల్లా వీణవంక మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. SI తిరుపతి ప్రకారం.. మండలంలోని ఐదో తరగతి చదువుతున్న ఓ పదకొండేళ్ల బాలికపై 30 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈనెల 16న కేసు నమోదు చేయగా.. శుక్రవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. బాలిక అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న వ్యక్తి గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేశాడు.

జగిత్యాల కలెక్టరేట్లో శుక్రవారం మహిళా శక్తి కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించడానికి, అన్ని జీవనోపాధి అంశాలలో వారిని బలోపేతం చేయడానికి మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. మహిళా శక్తి కింద వచ్చే ఐదేళ్లలో మైక్రో ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ద్వారా ప్రణాళికలు రూపొందించబడ్డాయన్నారు.

@ కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ గన్నేరువరం మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య.
@ ఇల్లంతకుంట మండలంలో విద్యార్థికి పాముకాటు.
@ జగిత్యాల రూరల్ మండలంలో గేదెను ఢీకొని ద్విచక్ర వాహన దారుడు మృతి.
@ 30 ఏళ్ల పైబడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించాలన్న జగిత్యాల కలెక్టర్.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.

కరీంనగర్ జిల్లాలో పంటల నమోదు ప్రక్రియ పూర్తయింది. ఈ సర్వేలో ఈ సీజన్లో రైతులు వరి పంట వైపే మొగ్గు చూపినట్లు వెళ్లడైంది. క్షేత్రస్థాయిలో విస్తీర్ణ అధికారుల నుంచి ఏవోలు, ఏడీఏలు, డీఏవో వరకు లక్ష్యాలు నిర్దేశించుకొని చేపట్టిన సర్వేతో సాగు విస్తీర్ణం నిర్ధారణ చేశారు. జిల్లాలో 3,34,606 ఎకరాల సాగు భూమిలో అధిక శాతం 2,73,400 ఎకరాల్లో వరిసాగు చేపట్టినట్లు తెలిపారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్వేయర్ల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూముల సర్వేకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పట్టించుకునేవారే కరువయ్యారు. సర్వేయర్ల నియామకం లేకపోవడంతో సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఎదురు చూస్తున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని 4 జిల్లాల్లో 14,287 సర్వే దరఖాస్తులు దరఖాస్తులు పెండింగ్ ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితులపైన స్టడీ చేయడానికి త్రిసభ్య కమిటీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య అధ్యక్షతన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్లతో కలిపి కమిటీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు రాష్ట్రంలోని పలు అసుపత్రులను సందర్శించి ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక అందించనుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేందుకు విద్యాశాఖ.. ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ యాప్ను అమలు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. కాగా, జిల్లాలోని 651 ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది 2,729 మంది పనిచేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.