India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రతి ఉద్యోగి ఆర్థిక ప్రణాళిక కలిగి ఉండాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటుచేసిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఉద్యోగి కాంపౌండింగ్ అంశంపై అవగాహన కలిగి ఉండాలని, భవిష్యత్తు కోసం ఆదా చేసే సొమ్ము మార్కెట్లో పెట్టుబడిగా పెడితే మంచి రిటర్న్ వస్తాయని తెలిపారు.
మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఉమ్మడి KNR వ్యాప్తంగా దిగుబడి తగ్గడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ధరలు పెరుగుతున్నాయి. KNRతో పాటు GDK, హుస్నాబాద్, హజూరాబాద్, జమ్మికుంట, జగిత్యాల తదితర ప్రాంతాలకు KNR హోల్సేల్ మార్కెట్ నుంచి సరఫరా అవుతుంటాయి. దీంతో ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మునగ కిలోకు రూ.60 ఉన్న ధర రూ.120కి చేరింది. కిలో రూ.20-30 ఉన్న టమాట.. ప్రస్తుతం రూ.60కి చేరింది.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన సురేష్ షెట్కర్ గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందిన సురేష్ షెట్కర్ని శాలువాతో సన్మానించారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో గలం విప్పాలని తెలిపారు. తెలంగాణ పక్షాన పార్లమెంటులో ప్రశ్నించే గొంతుకగా నిలుస్తారని ఆశిస్తున్నానన్నారు.
@ జగిత్యాల, సిరిసిల్ల కలెక్టరేట్ల ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా.
@ వీర్నపల్లి మండలంలో కుక్కల దాడిలో రెండు దుప్పిలు మృతి.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో మైనర్లు నడిపిన వాహనాలను సీజ్ చేసిన పోలీసులు.
@ జగిత్యాల జిల్లాలో బడిబాటలో పాల్గొన్న కలెక్టర్.
@ మిషన్ భగీరథ సర్వేను పరిశీలించిన సిరిసిల్ల కలెక్టర్.
@ మెట్పల్లి ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే.
కరీంనగర్ పట్టణంలోని పలుచోట్ల టౌన్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో గురువారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్లో డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపిన దాదాపు 40 మంది మైనర్లు పట్టుబడ్డారన్నారు. పట్టుబడిన వాహనాలను KNR ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన లేని మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలువ్వొద్దన్నారు.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.86,680 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.41,082, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.35,350, అన్నదానం రూ.13,248 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ కిషన్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి పుష్పగుచ్చం అందజేశారు. అరవింద్ కేంద్రమంత్రికి శుభాకాంక్షలు తెలిపి, మోడీ నాయకత్వంలో బొగ్గు గనుల శాఖ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
వరంగల్ నుంచి నిజామాబాద్ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గురువారం నుంచి డీలక్స్ బస్సులు నడపనున్నట్లు కరీంనగర్ రీజియన్ ఆర్ఎం సుచరిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో డీలక్స్ బస్సులను అదనంగా నడుపుతున్నామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డులో విద్యార్థిని(17) ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్పర్తికి చెందిన యువతి వారం రోజుల కిందట పెద్దపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చింది. బుధవారం ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదని విచారణ అనంతరం తెలుపుతామని ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అటెంప్ట్ మర్డర్ కేసులో తమకు అన్యాయం జరుగుతుందంటూ మండలంలోని కప్పారావుపేట గ్రామానికి చెందిన గాజుల రాజేందర్ సోదరుడు గాజుల రాకేశ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశాడు. పెట్రోల్ పోసుకుని గంటకు పైగా ఆందోళన చేపట్టారు. నాలుగు రోజుల్లో నిందితులను కచ్చితంగా పట్టుకుంటామని ధర్మపురి సీఐ రామ నరసింహారెడ్డి, ఎస్సై ఉమాసాగర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Sorry, no posts matched your criteria.