India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలకు రైతులు తీవ్రంగా పంట నష్టపోతున్నారని, వారిని గట్టెక్కించేందుకు బీమా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా వ్యవసాయాధికారి బి.శ్రీనివాసం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఉచిత పంట బీమా పథకం అమలుకు సిద్ధమయిందన్నారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 2.03లక్షల మంది రైతులుండగా.. 3.45లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణమవుతుందన్నారు.
గుండెపోటుతో ఓ మహిళ RTC బస్సులోనే మృతి చెందిన ఘటన PDPL జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. ముత్తారం మండలానికి చెందిన మణెమ్మ(58) కోడలు లతతో కలిసి కాల్వ శ్రీరాంపూర్లోని బంధువుల ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో మణెమ్మ అస్వస్థతకు గురవగా గమనించిన కండక్టర్, డ్రైవర్ బస్సులోనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు గెండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.
పాఠశాలలు పున:ప్రారంభం నుంచి లంచ్ అండ్ లెర్న్ బుధవారం కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించడం జరుగుతుందని తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మధ్యాహ్న భోజనం నాణ్యత అంశంలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో సమావేశ మందిరంలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవుల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మూసి వేసిన బడులు నేటితో ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు పున: ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి సిద్ధం చేశారు. పాఠశాలల్లో చేపట్టవలసిన కార్యక్రమాలపై పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయనున్నారు.
@ మిషన్ భగీరథ సర్వే పనులను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్. @ సైదాపూర్ మండలంలో 10 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ మల్లాపూర్ మండలంలో విద్యుత్ షాక్తో రెండు గేదెలు మృతి. @ రాయికల్ మండలంలో అగ్ని ప్రమాదంలో వ్యక్తి మృతి. @ ధర్మపురిలో వైభవంగా సుదర్శన యాగం. @ మెట్ పల్లి పట్టణంలో ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాల జాతర. @ భక్తులతో కిటకిటలాడిన వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయం.
గత శాసనసభ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపిస్తే జైత్రయాత్ర లేదంటే శవయాత్ర అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. దానిపై హైకోర్టు మంగళవారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఈనెల 20న తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు విచారణ చేయనుంది.
లంచం తీసుకుంటూ పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్&ఇన్ఛార్జ్ సబ్ -రిజిస్ట్రార్ పై అనిశా అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. KNR జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పని చేస్తున్న సురేశ్ బాబు ఏప్రిల్లో రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. దీంతో మంకమ్మతోటలోని ఆయన నివాసంలో అనిశా అధికారులు సోదా చేయగా రూ.12,31,400 నగదుతో పాటు బంగారం, వెండి అభరనాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు స్వాధీనం చేసుకున్నారు.
వరి కొయ్యలు కాలుస్తుండగా వ్యక్తి మృతి చెందిన ఘటన రాయికల్ పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాలు.. పట్టణానికి చెందిన భీమయ్య(68) పొలంలో వరి కొయ్యలు తగలబెడుతుండగా ఆ ప్రాంతమంతా భారీగా పొగ అలుముకుంది. దీంతో ఊపిరాడక స్పృహ తప్పి ప్రమాదవశాత్తు మంటల్లో పడ్డారు. శరీరమంతా కాలిపోయి మృతి చెందినట్టు ఎస్సై అజయ్ మంగళవారం తెలిపారు. మృతుడి కొడుకు వినోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు పక్రియ ముగిసింది. జిల్లా యంత్రాంగం 321 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఇందులో ఐకేపీ 51 కేంద్రాల ద్వారా 45,125 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, ఫ్యాక్స్ 223 కేంద్రాల ద్వారా 1,87,031.68 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, DCMS ఆధ్వర్యంలో 43 కేంద్రాల ద్వారా 32,838.16 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, హాకా ఆధ్వర్యంలో 4 కేంద్రాల ద్వారా 2995.36 ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చి గుండెపోటుతో భక్తుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన బొట్ల వినయ్ కుమార్.. రాజన్న దర్శనం చేసుకున్నాడు. అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లే మార్గ మధ్యలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికుల సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.