India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.2,82,459 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,26,500, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.1,04,100, అన్నదానం రూ.51,859 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
@ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష.
@ గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు.
@ శంకరపట్నం మండలంలో లారీ, బైకు ఢీ.. ఇద్దరి మృతి.
@ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ.
@ ధర్మారం మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య.
KNR జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్-వరంగల్ వెళ్తున్న లారీని.. వెనకాలే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనదారుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ ఆదివారం ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఖర్గేను శాలువాతో సన్మానించి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ప్రజలు గొప్ప అవకాశాన్ని ఇచ్చారని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కేంద్రం నుండి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో గళం విప్పాలని మల్లికార్జున ఖర్గే సూచించారు.
పెద్దపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేయడానికి MLA విజయరమణారావు రెడీ అయ్యారు. 9ఏళ్ల నుంచి ఇప్పటి వరకు 262 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 1,669 ఇండ్లను కడుతుండగా.. 1,463 ఇండ్లకు పునాదులు తీయలేదు. జిల్లాలోని 14 మండలాల్లో మంథని 92, కాల్వ శ్రీరాంపూర్లో 170 మాత్రమే పూర్తయ్యాయి. PDPL, సుల్తానాబాద్, RGM మండలాల్లో నిర్మాణాలు స్లోగా జరుగుతున్నాయి. ధర్మారం(U), మంథని(U)లో స్థలం లేక పనులు చేపట్టలేదు.
హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వివరాలిలా.. భూపాలపల్లికి చెందిన రమేశ్ జగిత్యాల జిల్లా ఎండపల్లి (M) గోడిశాలకి చెందిన మల్లేశ్ దగ్గర రూ.2 లక్షలు అప్పుతీసుకున్నాడు. గతంలో వీరికి అప్పు విషయంలో గోడవలు జరిగాయి. ఈక్రమంలో మల్లేశ్, కుమారుడు నాగరాజు, జితేందర్ ముగ్గురు గురువారం భూపాలపల్లిలోని రమేశ్ ఇంటికి వెళ్లి హత్య చేసి పారిపోయారు. కేటీకే 5వ గని వద్ద శనివారం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాళేశ్వరం దేవస్థానానికి పాలక మండలి నియామకానికి సన్నాహాలు మొదలయ్యాయి. BRS ప్రభుత్వంలో నియామకమైన పాలకమండలి గడువు మార్చి 13న ముగిసింది. రెండేళ్ల క్రితం ఈ క్షేత్రానికి పూర్తిస్థాయి ఈవో నియామకం జరగగా.. 2 నెలల క్రితం బదిలీ అయ్యారు. అయితే పాలకమండలి ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్బాబు దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారు. ఈసారి కాళేశ్వరం వాసులకే ఛైర్మన్ పదవి దక్కాలని ఆశిస్తున్నట్లు సమాచారం.
జగిత్యాల జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. జిల్లాలో 22 పరీక్ష కేంద్రాల్లో 7692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. పరీక్షా నిర్వహణకు 386 మంది ఇన్విజిలేటర్లు, 22 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 77 మంది బయోమెట్రిక్ ఆఫీసర్లు తదితరులను నియమించామన్నారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామోజీరావుకు ఘన నివాళులు.
@ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామన్న జగిత్యాల కలెక్టర్.
@ సైదాపూర్ మండలంలో అనుమానాస్పద స్థితిలో దినసరి కూలీ మృతి.
@ గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు.
@ తంగళ్ళపల్లి మండలంలో షెడ్డు కూలీ రెండు లేగ దూడలు మృతి.
@ కాటారం మాజీ జెడ్పిటిసి మృతి.
@ పెద్దపల్లిలో గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
మల్హర్ మండలంలోని గోపయ్యకుంట వాగులో చిరుతపులి సంచారం చేసిందని స్థానికులు కొయ్యూర్ ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో తాడిచెర్ల సెక్షన్ అధికారి లక్ష్మన్, కొయ్యూరు సెక్షన్ అధికారి ఇంతియాజ్, బిట్ అధికారులు చిరుత ఆనవాళ్ల కోసం జల్లెడ పట్టారు. వాగులో గుర్తించిన పాదముద్రలు తోడేలువని నిర్ధారించారు. ప్రజలు, పశువుల కాపర్లు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.
Sorry, no posts matched your criteria.