India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2023సంవత్సరంలో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా బదిలీ అయిన జిల్లా పరిధిలోని ఉపాధ్యాయులు తక్షణమే ఈరోజు నూతన పాఠశాలల్లో రిపోర్ట్ చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి ఏ.రమేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని మండల విద్యాశాఖ అధికారులు, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.
బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వెంకటేశ్ తీర్పునిచ్చారు.
HZBకు చెందిన కరుపాక రాజు (19) ఓ బాలిక (7)పై పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలికకు ఆమె తల్లి స్నానం చేయిస్తుండగా విషయం బయటపడింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసునమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20ఏళ్ల జైలు విధించారు.
సైదాపూర్ ఠాణాలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ సెల్ నుంచి రూ.1.40 లక్షలను సైబర్ నేరస్థుడు కాజేశాడు. వివరాలిలా.. సట్ల ఆంజనేయులు సెల్కు మే 30న ఆధార్కార్డు నంబరుతో సహా ఓటీపీ వచ్చింది. తర్వాతి రోజు రాత్రి సిమ్ పనిచేయలేదు. కస్టమర్ కేర్కు ఫోను చేసి తెలుసుకోగా సిమ్ బ్లాక్ అయిందని తెలిసింది. కొత్త సిమ్ తీసుకోగా జూన్5న యాక్టివేషన్ అయ్యింది. అప్పటికే తన ఖాతా నుంచి రూ.1.40 లక్షలు డ్రా అయినట్లు తేలింది.
ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని పేర్కొన్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి పత్రిక, మీడియా, టెలివిజన్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి తెలుగు జాతికి రామోజీరావు గర్వకారణంగా నిలిచారని గుర్తు చేశారు. రామోజీ రావు జీవితం అత్యంత నిబద్ధత, క్రమశిక్షణ పట్టుదలతో బతికిన వ్యక్తి అని అన్నారు.
జగిత్యాల జిల్లాలో జనము, జీలుగ, పత్తి విత్తనాలు, యూరియా అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు. జగిత్యాల కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చనిపోయిన రైతు కుటుంబానికి త్వరగా రైతు బీమా అందజేయాలని అధికారులకు సూచించారు. రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ తో రైతులను శాస్త్రవేత్తలతో అనుసంధానించాలని సూచించారు.
@గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు.
@జగిత్యాల రూరల్ మండలంలో ఇంటిపై విరిగిపడ్డ తాటిచెట్టు.
@ఎల్లారెడ్డిపేట మండలంలో ఎస్సైపై తప్పుడు పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు.
@కరీంనగర్లో చేప మందు పంపిణీ.
@కథలాపూర్ మండలంలో 12 మంది పేకాటరాయుళ్ల పట్టివేత.
@తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ను కలిసిన పెద్దపల్లి ఎంపీ.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 12, 19, 24, 27వ తేదీల్లో సదరం శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శుక్రవారం తెలిపారు. వినికిడి మూగ(చెవుడు)12న, మానసిక రోగులు 19న, కంటి చూపు 24న, ఆర్దో 27న, మూగ, చెవుడు, మానసిక దివ్యాంగులకు సంబంధిత వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గ్రూప్-I ప్రిలిమినరి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ప్రపుల్ దేశాయ్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. జూన్ 9న జరిగే గ్రూప్-I ప్రిలిమినరి పరీక్ష నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్సిలు, పోలీస్ నోడల్ అధికారి, సీఎస్, డిపార్ట్మెంటల్ అధికారులు, ఐడెంటిఫికేషన్ అధికారాలు పాల్గొన్నారు.
అధికారులందరూ సమన్వయంతో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్ష నిర్వాహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో 4699 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఇందుకుగాను 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ గౌతమి తదితరులున్నారు.
వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ సాగుపై జిల్లాలోని ఏఓలు, ఏఈఓలతో కలెక్టరేట్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఏఓలు, ఏఈఓలు తమ పరిధిలోని రైతులకు అందుబాటులో ఉండాలని, సాగులో మెలకువలు అందించాలని సూచించారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన తరువాత కచ్చితంగా రసీదు తీసుకోవాలని పేర్కొన్నారు. విత్తనాల, ఎరువుల కొరత లేదన్నారు.
Sorry, no posts matched your criteria.