India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
KNR లోక్సభ నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచిన BJP అభ్యర్థి బండి సంజయ్కి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సంజయ్ని ఆ పదవి నుంచి తప్పించినప్పుడు మంత్రి వర్గ విస్తరణ సమయంలో ఆయనకు అవకాశం ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి పెద్దపీట వేశారు. ఇప్పుడు ఆ హోదాతోనే ఆయనకు మంత్రి పదవి రావడం ఖాయమని చెబుతున్నారు.
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం రాత్రి మాస శివరాత్రి సందర్భంగా మహా లింగార్చన పూజా కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా జ్యోతులను లింగాకారంలో వెలిగించి విశేష పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.
@ మంథని మండలంలో పిడుగుపాటుకు గేదె మృతి.
@ రాయికల్ మండలంలో రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి.
@ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ మోరపల్లిలో బస్సు కిందపడి బాలుడి మృతి.
@ ఓదెల మండలంలో పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య.
@ గ్రూప్ 1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్న జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా మహా లింగార్చన.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం.
MP ఎన్నికల ఫలితాలు ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ నేతలకు మిశ్రమ స్పందనను మిగిల్చాయి. కరీంనగర్, పెద్దపల్లి కాంగ్రెస్ ఇన్చార్జిలుగా వ్యవహరించిన మంత్రులు అభ్యర్థుల గెలుపు కోసం శాయశక్తుల కృషి చేశారు. అయితే పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుపొందడంతో జిల్లాలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి విజయానికి చేసిన కృషి ఫలించలేదు.
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కారం. దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలన్నా.. ఆత్మగౌరవం నిలబడాలన్నా మోదీకే మా ఓటు అని ప్రజలు వేశారని అన్నారు. అసెంబ్లీలో 15 శాతం ఉన్న ఓటు బ్యాంక్ 35కి పెరిగింది’ అని అన్నారు.
మేడిగడ్డ బ్యారేజ్లో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు భూపరీక్షలు ప్రారంభించారు. బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించిన మట్టి, మెటీరియల్ నమూనాలను సేకరిస్తున్నారు. బ్యారేజ్ కుంగిన పిల్లర్ల వద్ద 25 ఫీట్ల మేర డ్రిల్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. భూభౌతిక, భూ సాంకేతిక పరీక్షలను నిపుణులు పర్యవేక్షిస్తున్నారు.
చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం జన్మదిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక లేఖను విడుదల చేశారు. మేడిపల్లి సత్యం ప్రజాసేవలో నిమగ్నమై నియోజకవర్గ అభివృద్ధి కృషి చేయాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
బస్సు కింద పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మోరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ బాలుడు(4) ఇంటి నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చాడు. ఈ క్రమంలో జగిత్యాల నుంచి కొత్తపేటకు వెళ్తున్న బస్సు కింద పడటంతో నుజ్జునుజ్జుయి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిన్న జరిగిన ఓట్లు లెక్కింపులో ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల్లో పార్టీల వారీగా ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. KNR లోక్సభ పరిధిలో బీజేపీకి 5,85,116, కాంగ్రెస్కు 3,59,907, బీఆర్ఎస్కు 2,82,163 ఓట్లు వచ్చాయి. పెద్దపల్లి లోక్సభ పరిధిలో కాంగ్రెస్కు 4,75,587, బీజేపీకి 3,44,223, బీఆర్ఎస్కు 1,93,356 ఓట్లు వచ్చాయి. KNRలో బీజేపీ, పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే.
లోక్సభ ఎన్నికల్లో BRS ఓటమిని జీర్ణించుకోలేక ఓ కార్యకర్త మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మొగిలిపేట గ్రామానికి చెందిన తుక్కన్న(80) BRS ఓడిపోయిందంటూ కనిపించిన వారి దగ్గరల్లా ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత గుండెపోటుతో మృతి చెందాడు. కాగా, మృతుడు TRS పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి పార్టీలోనే క్రియాశీల కార్యకర్తగా కొనసాగుతున్నారు.
Sorry, no posts matched your criteria.