Karimnagar

News June 5, 2024

పవన్ కళ్యాణ్‌కు కలిసొచ్చిన కొండగట్టు సెంటిమెంట్!

image

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ సక్సెస్ అవ్వడంతో కొండగట్టు అంజన్న సెంటిమెంట్ కలిసొచ్చిందని ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకొని ‘వారాహి’ వాహనానికి పూజలు చేయించారు. దీంతో ఆంజనేయస్వామి ఆశీస్సులు పవన్‌పై మెండుగా ఉన్నాయని, అంజన్న సెంటిమెంట్ కలిసొచ్చిందని అభిమానులు అంటున్నారు.

News June 5, 2024

పెద్దపల్లి: తండ్రీకొడుకుల చేతిలో ఓడిన గోమాసె శ్రీనివాస్

image

పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి BJP అభ్యర్థిగా పోటి చేసిన గోమాసె శ్రీనివాస్ 2 సార్లు ఒకే కుటుంబానికి చెందిన వారి చేతిలో ఓటమిపాలయ్యారు. 2009లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై ఓడిపోయిన ఆయన తాజాగా ఆయన కుమారుడు వంశీకృష్ణపై ఓటమి పాలయ్యారు. 2009లో TRS తరఫున పోటీ చేసిన శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై 49,017 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా ఇప్పడు 1,31,364 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

News June 5, 2024

చరిత్ర సృష్టించిన బండి సంజయ్

image

దేశంలో మోదీ చరిష్మా, రాష్ట్రంలో బండి ఖలేజాతో కరీంనగర్ లోక్‌సభ స్థానంలో బండి సంజయ్ భారీ మెజారిటీతో వరుస విజయాన్ని నమోదు చేశారు. ఈ నియోజకవర్గంలో 1991 తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ అభ్యర్థి రెండో సారి గెలవలేదు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన బండి సంజయ్ తిరిగి 2024 ఎన్నికల్లోనూ రెండో సారి పోటీ చేసి విజయాన్ని అందుకోవడం విశేషం. దీంతో మాజీ MP రత్నాకర్ రావు రికార్డు సమం చేశారు.

News June 5, 2024

జగిత్యాల: లారీ ఢీకొని యువకుడి మృతి

image

లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బోయినపల్లి మండలం మర్లపేట గ్రామానికి చెందిన సాయికృష్ణ తన బైకుపై అత్తగారిల్లు గొల్లపల్లికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండల కేంద్రంలోకి రాగానే కారును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ ఢీకొంది. దీంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు.

News June 5, 2024

కరీంనగర్: బండికి 44.55 శాతం ఓట్లు

image

కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో బండి సంజయ్‌ 44.55 శాతం ఓట్లను పొందారు. మొత్తంగా 13,13,331 మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. ఇందులో 5,85,116 మంది బీజేపీకి ఓటేశారు. 2019 ఎన్నికలతో పోలిస్తే సంజయ్‌కు ఓటు శాతం పెరిగింది. అప్పటి ఎన్నికల్లో 11.47 లక్షల ఓట్లకుగానూ 4,98,276 ఓట్లను పొంది 43.42 శాతం మద్దతును పొందారు. మొత్తంగా 2,25,209 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుపై విజయం సాధించారు.

News June 5, 2024

పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో మంత్రి మార్క్!

image

పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో మంత్రి శ్రీధర్ బాబు మరోసారి తన మార్కు చూపించారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరుపొందిన మంత్రి తన రాజకీయ చతురను ప్రదర్శించి పార్టీ అభ్యర్థి వంశీకృష్ణకు విజయం చేకూర్చారు. తొలుత అభ్యర్థి ఎంపికపై పార్టీలో భిన్న స్వరాలు వినిపించిన మంత్రి అన్నింటిని చక్కదిద్దారు. నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నాయకులను సమన్వయం చేసి పార్టీ గెలుపునకు కృషి చేశారు.

News June 5, 2024

KNR: నోటాకు ఎన్ని ఓట్లంటే?

image

లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ పరిధిలోని స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. పెద్దపల్లిలో అత్యధికంగా 5,711 ఓట్లు పోలవగా.. కరీంనగర్‌లో అత్యల్పంగా 5,438 ఓట్లు పోలయ్యాయి. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చక నోటాకు వేలల్లో ఓట్లు వేశారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి నోటాకు ఓట్లు పెరిగాయి. దీనిపై మీ కామెంట్?

News June 4, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కరీంనగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం.
@ పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం.
@ నిజామాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం.
@ కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలో ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్.
@ ఎండపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.
@ వీణవంక మండలంలో ఎల్లమ్మ ఆలయంలో చోరీ.
@ మల్హర్ మండలంలో తాటి చెట్టు పై పడిన పిడుగు.

News June 4, 2024

కరీంనగర్‌లో బండి, పెద్దపల్లిలో గడ్డం వంశీ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటితో ఉత్కంఠ వీడింది. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో మొత్తం 28 మంది పోటీ చేయగా.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 2,12,017+ ఓట్లతో గెలుపొందారు. ఇక పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి మొత్తం 42 మంది పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ 131,581+ ఓట్లతో గెలిచారు. దీంతో నేటితో జిల్లాలోని ఎంపీ స్థానాలపై ఉత్కంఠకు తెర పడింది.

News June 4, 2024

జగిత్యాల: ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్న అరవింద్

image

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ లక్షకు పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అతనిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.