Karimnagar

News June 4, 2024

KNR: నేటితో ఉత్కంఠకు తెర

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరి కొన్ని గంటల్లో తేలనుంది. సుమారు 21 రోజుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. కరీంనగర్‌లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను SRR కళాశాలలో లెక్కించనున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన 4 అసెంబ్లీ సెగ్మెంట్లను మంథని JNTU కళాశాలలో లెక్కించనుండగా.. మిగతా 3 అసెంబ్లీ సెగ్మెంట్లవి మంచిర్యాలలోని ఐజా కళాశాలలో లెక్కిస్తారు.

News June 4, 2024

కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వివరాలు

image

కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వివరాలు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్‌ను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్‌ను రామగిరి మండలం పన్నూరులోని జేఎన్టీయూ కళాశాలలో నిర్వహిస్తున్నారు. అలాగే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌ను డిచ్‌పల్లిలోని సీఎంసీ కళాశాలలో ఏర్పాటు చేశారు.

News June 3, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. @ గోదావరిఖనిలో రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ అధికారులు. @ వీర్నపల్లి మండలంలో ఉరి వేసుకుని యువతీ ఆత్మహత్య. @ సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి. @ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కోరుట్లలో కత్తిపోట్ల కలకలం.

News June 3, 2024

వీర్నపల్లి: ఉరేసుకుని యువతి ఆత్మహత్య

image

ఉరేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లాల్‌సింగ్ తండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూక్య సరస్వతి (18) అనే యువతి వ్యక్తిగత సమస్యలు తీర్చుకోలేకపోతున్నానని మనస్తాపం చెందింది. ఈ క్రమంలో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News June 3, 2024

కొండగట్టు అంజన్నకు టికెట్ల ఆదాయం రూ.1,51,38,490

image

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి పెద్ద జయంతి సందర్భంగా వివిధ టికెట్ల ద్వారా రూ.1,51,38,490 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. దీక్ష విరమణ టికెట్ల ద్వారా రూ.31,09,700, శీఘ్ర దర్శనం ద్వారా రూ.21,77,500, కేశఖండనం ద్వారా రూ.9,76,150, లడ్డు ప్రసాదం ద్వారా రూ.76,42,000, పులిహోర ప్రసాదం ద్వారా రూ.12,33,140 ఆదాయం సమకూరినట్లు వివరించారు. ఈ ఏడాది ఆదాయం పెరిగినట్లు పేర్కొన్నారు.

News June 3, 2024

RTV సర్వే: కరీంనగర్ బీజేపీ, పెద్దపల్లి కాంగ్రెస్!

image

కరీంనగర్ స్థానం బీజేపీదేనని RTV సర్వే తేల్చి చెప్పింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్‌రావు, బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్ బరిలో ఉన్నారు. పెద్దపల్లి స్థానంలో కాంగ్రెస్ గెలుపొందనుందని ఈ సర్వే పేర్కొంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గడ్డం వంశీకృష్ణ, బీజేపీ తరఫున గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ నిల్చున్నారు.

News June 3, 2024

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లెక్కింపు వివరాలు

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపును 162 రౌండ్లలో లెక్కించనున్నారు. నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 2,194 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి కోసం గాను 116 టేబుళ్లను సిద్ధం చేశారు. మొత్తం ఇక్కడ 28 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు.

News June 3, 2024

కరీంనగర్: సీఎంను కలిసిన సివిల్ ర్యాంకర్

image

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సాయికిరణ్ ఇటీవల విడుదలైన సివిల్స్-2023 ఫలితాల్లో ఆల్ ఇండియా 27వ ర్యాంకర్ సాధించిన విషయం తెలిసిందే. సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కుటుంబ సభ్యులతో కలిసి సాయి కిరణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సివిల్స్ ర్యాంకర్‌ను సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు.

News June 3, 2024

పెద్దపల్లి: రైళ్ల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు!

image

కాజీపేట- బల్లార్షా స్టేషన్ల మధ్య రైళ్లు తరచూ రద్దవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కంటే ముందు అందుబాటులో ఉన్న కాజీపేట- అజ్ని కరోనా సమయంలో రద్దయింది. దాని స్థానంలో ఎక్స్ ప్రెస్ రైలును తీసుకొచ్చినప్పటి 7 నెలల క్రితం అది కూడా రద్దయింది. పెద్దపల్లి- విజయవాడ మధ్య నడిచే పుష్పుల్ డెమో రైలును సైతం రద్దు చేశారు. ఈ రైళ్లను పునరుద్ధరించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

News June 3, 2024

మన ఎంపీ వంశీకృష్ణనా.. కొప్పులనా.. శ్రీనివాసా?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో పెద్దపల్లి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, BJP నుంచి గోమాస శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా.. BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

error: Content is protected !!