India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ పార్లమెంట్ స్థానం బీజేపీదే అని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, BRS నుంచి వినోద్ కుమార్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో బీజేపీదే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?
జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద సోనియా గాంధీ గుడి ముస్తాబవుతోంది. ఆదివారం తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా ఊరురా సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో సోనియాగాంధీ గుడి వద్ద సంబరాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీశ్ రెడ్డి తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. శనివారం జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలం కోల్వైలో 45.5°C, ధర్మపురి మండలం జైనలో 45.3°C, కోరుట్ల మండలం ఐలపూర్ లో 45.0°C, రాయికల్ మండలం ఆల్లిపూర్లో 44.7°C, కోరుట్లలో 44.3°C, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట్ లో 44.6°C, కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండలం ఈదులగట్టుపల్లిలో 43.6°C, పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో 42.7°C ఉష్ణోగ్రత నమోదైంది.
రామగుండం NTPC అన్నపూర్ణ కాలనీకి చెందిన ఈదునూరి కిశోర్ వడదెబ్బతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ఫౌండేషన్ ప్రతినిధులు శ్రవణ్ కుమార్, లింగమూర్తి, సానా రామకృష్ణా రెడ్డి, రమేశ్, బీష్మాచారి, వాసు, చంద్రశేఖర్, శశికళ, శారద, లక్ష్మీనారాయణ ఉన్నారు.
కొండగట్టు అంజన్న క్షేత్రంలో జరుగుతున్న పెద్ద జయంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ముందుగా స్థానిక హరిత హోటల్లో నేసిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే స్వామివారికి సమర్పించారు. అనంతరం యాగశాలలోని వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని తిలకించారు. అర్చకులు ఆశీర్వదిoచి, తీర్థ ప్రసాదం అందజేశారు. ఇక్కడ ఎంపీపీ రవళి, ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, సతీశ్ రెడ్డి, అనిల్ ఉన్నారు.
లోక్సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో అందరి చూపు ఎగ్జిట్ పోల్స్పై పడింది. KNR, PDPL పరిధిలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. కాగా ఎవరికే వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ద్వారా గెలుపు ఓటములపై ఓ అంచనాకు రానున్నారు. దీని ద్వారా తీవ్ర ఉత్కంఠకు కొంత తెరపడనుంది. ఓటరు నాడీ తెలియాలంటే ఈనెల 4 వరకు వేచిచూడాల్సిందే.!
జిల్లాలో శుక్రవారం వడదెబ్బతో నలుగురు మృతి చెందారు. వివరాలిలా.. వీణవంక మండలానికి రామక్క(72) వడ దెబ్బతో శుక్రవారం సాయంత్రం మృతి చెందగా, ధర్మారం(M) బొట్లవనపర్తికి చెందిన అమృతవ్వ(65) నిన్న మధ్యాహ్నం బయటకి వెళ్లింది. ఈక్రమంలో ఎండ తీవ్రత తట్టుకోలేక అస్వస్థతకు గురైంది. గమనించిన వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. చొప్పదండిలో ఓ లారీ డ్రైవర్, ఎన్టీపీసీకి చెందిన కిషోర్(36) మృతి చెందాడు.
కరీంనగర్ లోక్సభ స్థానం ఓట్ల లెక్కింపునకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో మొత్తం 116 టేబుళ్లు, 153 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. 8AM నుంచి SRR కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫలితాలు బయటకు కనిపించేలా LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామివారి పెద్ద జయంతి నేపథ్యంలో దేవాదాయశాఖ అధికారులు ఆలయ ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులు, మాలాధారులు వేలాదిగా ఆలయానికి తరలిరానుండటంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. కలెక్టర్ యాస్మిన్బాష ఏర్పాట్లను పర్యవేక్షించారు.
@ కొండగట్టులో వైభవంగా కొనసాగుతున్న పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు. @ జగిత్యాల జిల్లాలో అత్యాచారానికి పాల్పడిన ఇరువురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. @ వేములవాడలో ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ కోనరావుపేట మండలంలో గుండె పోటుతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి. @ కొండగట్టులో పర్యటించిన జగిత్యాల కలెక్టర్. @ జగిత్యాలలో ఎండవేడికి మంటలు చెలరేగి 20 బైకులు దగ్ధం.
Sorry, no posts matched your criteria.