Karimnagar

News June 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ తంగళ్ళపల్లి మండలంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య. @ ఎండపల్లి మండలంలో ఆర్టీసీ బస్సు, బైకు డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసిన మంత్రి శ్రీధర్ బాబు. @ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. @ సిరిసిల్లలో పాన్ షాప్ లలో తనిఖీలు. @ జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం. @ సిరిసిల్ల ప్రజావాణిలో 202 ఫిర్యాదులు.

News June 24, 2024

విజయశాంతికి బండి సంజయ్ బర్త్‌డే విషెస్

image

కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. విజయశాంతి ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటూ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని Xలో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి ‘థ్యాంక్యూ సో మచ్ బండి సంజయ్ గారు’ అంటూ రిప్లై ఇచ్చారు.

News June 24, 2024

ఇంటర్ ఫలితాలు.. ఉమ్మడి కరీంనగర్‌లో పెద్దపల్లి టాప్

image

ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి ప్రథమ స్థానంలో నిలిచింది. పెద్దపల్లి జిల్లాలో 1,086 (55.95 %) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జగిత్యాల 1,197 (50.6%), సిరిసిల్ల 453 (35.75%), కరీంనగర్ 1,501 (35.05%) మంది విద్యార్థులు పాస్ అయ్యారు.

News June 24, 2024

జీవన్‌రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

image

జగిత్యాల MLA సంజయ్ కుమార్‌ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ MLC జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నేతలు ఇంటికి వెళ్లారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని వారు కోరినట్లు సమాచారం. 40 ఏళ్లు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని.. పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని సన్నిహితులతో జీవన్‌రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.

News June 24, 2024

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జగిత్యాల టాప్

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ప్రథమ స్థానంలో నిలిచింది. జగిత్యాల జిల్లాలో 2,476 (65.57 %) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కరీంనగర్‌లో 5,922 (62.71%), సిరిసిల్ల 1,204 (59.28%), పెద్దపల్లి 1,527 (55.09%) మంది విద్యార్థులు పాస్ అయ్యారు.

News June 24, 2024

BREAKING: కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పతి

image

కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పతినే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆమెను బదిలీ చేసి సిరిసిల్ల కలెక్టర్‌గా ఉన్న అనురాగ్ జయంతిని బదిలీపై కరీంనగర్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా అనురాగ్ జయంతిని ఖైరతాబాద్ GHMC కార్యాలయంకు జోనల్ కమిషనర్‌గా బదిలీ చేసి పమేలా సత్పతిని కరీంనగర్ కలెక్టర్‌గా నియమించారు.

News June 24, 2024

కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే సంజయ్.. జీవన్ రెడ్డి ఆగ్రహం?

image

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఊహించనివిధంగా ఆయన పార్టీ మారడంతో బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా విస్తుపోతున్నాయి. ఈ విషయంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికీ సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేస్తునట్లు సమాచారం. దీంతో జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటున్నారట.

News June 23, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిజెపి ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ గంభీరావుపేట మండలంలో గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి. @ రాయికల్ మండలంలో మైనర్ బాలికపై వృద్ధుడి అత్యాచారం. @ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో లారీ డ్రైవర్ పై దాడి. @ చొప్పదండి ఎమ్మెల్యేను పరామర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. @ వేములవాడ రాజన్నను దర్శించుకున్న హైకోర్టు జస్టిస్.

News June 23, 2024

కరీంనగర్: అమాంతం పెరిగిన టమాటా ధర!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టమాట ధరలు అమాంతం పెరిగాయి. రెండు రోజులుగా మార్కెట్లో కిలో ధర రూ.100కి చేరుకోవడంతో ప్రజలు వాటిని కొనడానికి ఆసక్తి చూపడం లేదు. మార్కెట్లో డిమాండ్‌కు సరిపడా టమటా లేకపోవడంతో ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కిలో టమాటా రూ.20 నుంచి రూ.30 పలకగా.. ఒక్కసారిగా హోల్ సేల్‌లో రూ.80, రిటైల్ లో రూ.100కు ధర చేరడంతో ప్రజలు కొనలేకపోతున్నారు.

News June 23, 2024

సిరిసిల్ల: గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

image

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శనిగరం మహేశ్ కుమార్(45) ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల పదోన్నతుల్లో ఆయన ZPHS(B) గంభీరావుపేట గణితం స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాడు. మహేశ్ ఆకస్మిక మృతి పట్ల పలువురు ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు, మండల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.