India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. శుక్రవారం కమాన్పూర్లో 47.1°C, ముత్తారంలో 46.6°C, మంథనిలో 46.4°C, రామగుండంలో 46.2°C, ధర్మపురి మండలం నేరేళ్లలో 46.4°C, ఇబ్రహీంపట్నం మండలం గోధూర్లో 46.3°C, జమ్మికుంటలో 46.0°C, సిరిసిల్లలో 44.7°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.
టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్రావు తన పదవికి రాజీనామా చేశారు. సహకార సంఘంలో కొంత మంది కాంగ్రెస్లో చేరిన కారణంగానే తాను ఈ పదవిలో కొనసాగలేనని చెప్పుకొచ్చారు. అయితే కొద్దిరోజుల క్రితం టెస్కాబ్ డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చారు. ఈ క్రమంలో అవిశాస్వ తీర్మానానికి ముందే రవీందర్రావు రాజీనామా చేయడం గమనార్హం.
వివిధ రంగాల్లో చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ అవార్డులను జిల్లాలోని అర్హులైన పౌరుల నుంచి నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అర్హులు సర్టిఫికేట్లు, బయోడేటా తో సెప్టెంబర్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఒక జిరాక్స్ కాపీని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడా శాఖ కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు.
ఓ ప్రభుత్వ అధికారిని తల్లీకూతుళ్లు మోసం చేసిన ఘటన గోదావరిఖనిలో జరిగింది. శ్రీరాంపూర్కి చెందిన ఓ సింగరేణి అధికారికి అదే ప్రాంతానికి చెందిన శ్రీలత, భవానీ పరిచయమయ్యారు. అతడి వద్ద ఉన్న బంగారాన్ని కాజేయాలని శ్రీలత భర్త వెంకటేశ్వర్లుతో కలిసి పథకం వేశారు. అతడి వద్దకు భవానీని పంపించి వారిద్దరు కలిసి ఉండగా పట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి 9 తు. బంగారం, రూ.1.90లక్షల నగదు, రూ.20 లక్షల చెక్కు రాయించుకున్నారు.
కొండగట్టు అంజన్న క్షేత్రంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం భద్రచాలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం తరుపున ఈవో రమాదేవి, ఉప ప్రధన అర్చకుడు గోపాలకృష్ణాచార్యులు పట్టువస్త్రాలను తీసుకురాగా అంజన్న ఆలయ అధికారలు డప్పుచప్పులు మధ్య ఆలయం వరకు శోభా యాత్ర నిర్వహించారు. అనంతరం ఈవో చంద్రశేఖర్కు పట్టువస్త్రాలను అందజేశారు.
వయోవృద్ధులైన తల్లిదండ్రులను వేధిస్తే 3నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆర్డీవో శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ అల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన సీనియర్ సిటీజన్స్ పిలుపు, వయోధికుల రక్షణ చట్టం అవగాహన పుస్తకాలను మెట్పల్లి ఆర్డీవో కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ పూర్తిగా పిల్లలదేనని స్పష్టం చేశారు.
@ కొండగట్టులో వైభవంగా కొనసాగుతున్న హనుమాన్ జయంతి వేడుకలు.
@ శంకరపట్నం మండలంలో గుండెపోటుతో కండక్టర్ మృతి.
@వీర్నపల్లి మండలంలో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.
@ముస్తాబాద్ మండలంలో ఉరివేసుకొని వృద్ధుడి ఆత్మహత్య.
@ విత్తన దుకాణాలను తనిఖీ చేసిన పెద్దపల్లి కలెక్టర్.
@ నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సిరిసిల్ల కలెక్టర్.
@చందుర్తి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన సిరిసిల్ల ఎస్పీ.
‘జయ జయహే తెలంగాణ గీతం’పై BRS అనవసర రాద్ధాంతం చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమం పేరిట అధికారంలోకి వచ్చిన KCR పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి కనీసం రాష్ట్రానికి జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని మండిపడ్డారు. నేడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామంటే BRS నేతలకు నచ్చడం లేదని ఆరోపించారు.
వీర్నపల్లి మండలం బాబాయ్ నాయక్ తండాలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానికుల ప్రకారం.. మమత(21) అనే యువతి ఇంట్లో దూలానికి ఉరివేసుకొని మృతి చెందింది. ఓ తండాకు చెందిన సతీష్ అనే వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు అతని ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో రెండు తండాలలో ఉద్ధృత వాతావరణం చోటుచేసుకుంది. ప్రేమ విఫలం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. గురువారం పెద్దపల్లి జిల్లాలోని కమాన్ పూర్లో 46.7°C, ముత్తారంలో 46.4°C, పాలకుర్తి మండలం తక్కళ్లపల్లిలో 46.2°C, మంథనిలో 46.1°C, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనలో 45.8°C, కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో 45.4°C, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో 44.0°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.