Karimnagar

News May 30, 2024

మహాముత్తారంలో జిల్లా కలెక్టర్ సమావేశం

image

అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా మహాముత్తారంలోని రైతు వేదికలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News May 30, 2024

కరీంనగర్: బడి బస్సు భద్రమేనా?

image

వచ్చే నెల జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నెల రోజులుగా షెడ్డులో ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2,389 ప్రైవేటు పాఠశాలలు బస్సులు ఉన్నాయి. వీటి ఫిట్‌నెస్ గడువు ఈ నెల 15తో ముగిసింది. ఈ వార్షిక సంవత్సరం బస్సులు రోడ్డెక్కాలంటే ఆర్టీఏ కార్యాలయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంది. 

News May 30, 2024

సిరిసిల్ల: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

image

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొనరావుపేట మండల కేంద్రానికి చెందిన కోలకాని నవీన్ (21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

News May 30, 2024

కరీంనగర్: పరీక్ష ఫీజు చెల్లింపునకు రేపే తుది గడువు

image

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ద్వితీయ సంవత్సరం నాలుగో సెమిస్టర్, తృతీయ సంవత్సరం ఆరో సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించుటకు ఈ నెల 31 వరకు అవకాశం ఉందని ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ అధికారి డా. ఆడెపు శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు శుక్రవారంలోగా చెల్లించాలని తెలిపారు.

News May 30, 2024

నేటి నుంచి హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు

image

కొండగట్టు అంజన్న ఆలయం హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి శనివారం వరకు నిర్వహించే ఉత్సవాలకు దీక్షాపరులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. 2 లక్షలకుపైగా దీక్షాపరులు తరలివచ్చి మాల విరమణ చేస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు. తలనీలాలు సమర్పించేందుకు వీలుగా 1500 మంది క్షురకులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News May 30, 2024

గోదావరిఖని సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడి మృతి

image

గోదావరిఖని సింగరేణి 11వ గనిలో గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో LHD ఆపరేటర్ దుర్మరణం చెందారు. స్థానికుల వివరాలు.. రామగిరి మండలం పన్నూరుకు చెందిన ఇజ్జగిరి ప్రతాప్ గనిలో విధులు నిర్వహిస్తుండగా LHD యంత్రం ప్రమాదవశాత్తూ అతడిపై నుంచి వెళ్లిది. దీంతో అతడి పొట్టభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు ప్రతాప్‌ను ఆసుపత్రికి తరలించేలోగా అప్పటికే మృతి చెందాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 30, 2024

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు: జగిత్యాల కలెక్టర్

image

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా హెచ్చరించారు. జగిత్యాల కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వానాకాలం పంటల సాగుకు విత్తనాల కొరత లేకుండా చూస్తామన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదు తప్పక పొందాలని సూచించారు.

News May 29, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సుల్తానాబాద్ మండలంలో వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలి మృతి. @ చార్ధామ్ యాత్రకు వెళ్లి మృతి చెందిన హుజూరాబాద్ మండల వాసి. @ భక్తులతో కిటకిటలాడిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం. @ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న జగిత్యాల కలెక్టర్.

News May 29, 2024

కొండగట్టులో పెద్ద జయంతి ఉత్సవాలకు అంకురార్పణ

image

ప్రసిద్ధి కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో పెద్ద జయంతి ఉత్సవాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆగమ శాస్త్రోక్తంగా ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. యాగశాల శుద్ధి, పుణ్యాహవాచనం, అఖండ దీపస్థాపన తదితర కార్యక్రమాలు చేపట్టారు. కాగా గురువారం ఉదయం 9 గంటల నుంచి జయంతి కార్యక్రమాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి.

News May 29, 2024

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. బుధవారం జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ లో 45.1°C, పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లిలో 45.4°C, కమాన్ పూర్ లో 45.2°C, ముత్తారంలో 44.9°C, కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో 44.4°C, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో 43.7°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.