Karimnagar

News May 29, 2024

ఉప్పల్‌ స్టేడియంలో టీ20 మ్యాచ్‌.. కరీంనగర్ ఓటమి

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ మైదానంలో బుధవారం మెదక్‌ జట్టుతో జరిగిన టీ-20 ఫైనల్ మ్యాచ్‌లో కరీంనగర్ జట్టు ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న మెదక్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 రన్స్ మాత్రమే చేసింది. దీంతో 23 పరుగుల తేడాతో మెదక్ జట్టు ఫైనల్‌లో విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది.

News May 29, 2024

అంగన్వాడీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ 

image

తిమ్మాపూర్ మండలం LMD కాలనీలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో సీడీపీవోలు, ఏసీడీపీవోలు, సూపర్వైజర్లు, ఎంపిక చేసిన అంగన్వాడీ టీచర్లు, పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. బాధ్యాతయుతంగా విధులు నిర్వర్తించాలని, చిన్నారుల యోగా క్షేమాలు తెలుసుకోవాలన్నారు.

News May 29, 2024

KNR: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన KNRలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల ప్రకారం.. కొత్తపల్లి మం. లక్ష్మీపూర్‌కు చెందిన భానుప్రకాశ్(16), KNR హనుమాన్ నగర్‌కు చెందిన మిట్టు బైకుపై వెళ్తున్నారు. మంకమ్మతోటలోని కొత్త లేబర్ అడ్డ వద్ద కుక్క అడ్డు రావడంతో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టారు. భాను ప్రకాశ్ తలకు తీవ్ర గాయమై మృతి చెందగా.. మిట్టుకు తీవ్ర గాయాలయ్యాయి.

News May 29, 2024

KNR: దారుణం.. కిడ్నాప్ చేసి హత్య

image

రౌడీ షీటర్‌ను హత్యచేసిన ఘటన KNR జిల్లా మానకొండూర్ మం.లో జరిగింది. పచ్చునూర్‌కు చెందిన ప్రశాంత్ రెడ్డి(23)పై పలు కేసులు ఉండటంతో రౌడీషీట్ ఓపెన్ చేశారు. అదే గ్రామానికి చెందిన మరో రౌడీ షీటర్ రమేశ్ మరికొందరితో కలిసి ఉటూర్‌లో ప్రశాంత్‌ను చితకబాదారు. తప్పించుకోవడానికి ప్రయత్నించి బావిలో దూకడంతో రాళ్లతో కొట్టి, అనంతరం కిడ్నాప్ చేసి హత్య చేశారు. మానేరు నదిలో అతడి మృతదేహం లభించినట్లు పోలీసుల తెలిపారు.

News May 29, 2024

గోదావరిఖని: పుట్టినరోజు.. ఆదర్శవంతమైన నిర్ణయం

image

గోదావరిఖని గంగానగర్‌కు చెందిన అపరాధి ప్రశాంత్ కుమార్ మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. తన మరణానంతరం నేత్ర, అవయవ దానం చేస్తున్నట్లు సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులకు అంగీకార పత్రాన్ని అందించారు. ఈ మేరకు ఫౌండేషన్ ప్రతినిధులు ఆయనకు డోనర్‌ కార్డును అందించి అభినందించారు. లింగమూర్తి, వాసు, సురేష్ కుమార్, అవినాష్, రాజు, పవన్, శేఖర్, సతీశ్ ఉన్నారు.

News May 29, 2024

కొండగట్టులో పెద్ద జయంతి ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

image

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం సాయంత్రం సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని, తర్వాత పెద్ద జయంతి ఏర్పాట్లను ఆలయ ఈఓతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రత ఏర్పాట్లపై పలు సూచనలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవిచందర్, సీఐ నీలం రవి ఉన్నారు.

News May 28, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం చెరువులో యువకుడి గల్లంతు. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ముస్తాబాద్ మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య. @ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ను సజావుగా నిర్వహించాలన్న జగిత్యాల కలెక్టర్. @ కరీంనగర్ నుండి హనుమకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్ డ్రైవర్ పై దాడి. @ మల్యాల మండలంలో చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఎన్టీఆర్ జయంతి.

News May 28, 2024

ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా బాధాకరం: మానకొండూరు ఎమ్మెల్యే

image

ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా బాధాకరమని మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం సిగ్గు చేటని కరీంనగర్‌లో జరిగిన సమావేశంలో తెలిపారు. మాజీ ఐజీ రాధాకిషన్ రావు వారి వాంగ్మూలంలో తన పేరు చెప్పడం చాలా బాధాకరమని పేర్కొన్నారు.

News May 28, 2024

రేపటి నుంచి కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు

image

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 29 నుంచి 1 వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. మూడు రోజుల పాటు ఆలయంలో నిర్వహించనున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, దీక్షాపరులు లక్షల సంఖ్యలో తరలిరానున్నందున ఆర్జిత సేవలు రద్దు చేశారు. కాగా, జయంతికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్  శ్రీనివాస్ శర్మ తెలిపారు.

News May 28, 2024

వరద భయం.. బిక్కుమంటూ ధర్మపురి పట్టణ ప్రజలు

image

ధర్మపురిలో ఏటా గోదావరి వరదల వల్ల తీర ప్రాంత ప్రజలు సర్వం కోల్పోతున్నారు. నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం ప్రాజెక్ట్ కారణంగా అధిక వర్షాలతో వరద పోటెత్తి.. ఆ ప్రభావం ధర్మపురి పట్టణంపై పడుతోంది. ధర్మపురిలో తెనుగువాడ, కుమ్మరివాడ, భ్రాహ్మణసంఘం, తెలుగు కళాశాల, రామాలయం. మంగళిగడ్డ, బోయవాడ, ఒడ్డెర కాలనీలను ముంపు ప్రాంతాలుగా గుర్తించి, వరద నివారణకై కరకట్ట నిర్మాణానికి రూ.4 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశారు.