Karimnagar

News May 27, 2024

KNR: బావమరిది కోసం మోకాళ్లపై నడిచి మొక్కు తీర్చుకున్న బావ

image

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తన బావమరిది రజినీకాంత్ కోలుకుంటే మోకాళ్ల మీద ఐనవోలు మల్లికార్జున స్వామి వారి దర్శనానికి నడుచుకుంటూ వస్తానని కమలాపూర్ మండలం అంబాలకు చెందిన నాగరాజు మొక్కుకున్నారు. ఈ మేరకు రజినీకాంత్ ఆరోగ్యం మెరుగుపడటంతో నాగరాజు మొక్కు తీర్చుకునేందుకు మోకాళ్లపై 70 కి.మీ నడుచుకుంటూ ఐనవోలు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నాగరాజును అభినందిస్తున్నారు.

News May 27, 2024

బీర్పూర్: ధాన్యం కోతలు.. రైతుల వెతలు

image

సమాచారం ఇవ్వకుండానే తరుగు పేరుతో కోతలు విధిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీర్పూర్ మండలంలోని తుంగూర్ కొనుగోలు కేంద్రంలో సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించారు. నాణ్యత లేదంటూ మిల్లర్లు మూడు రోజుల పాటు ధాన్యం తీసుకోకుండా నిలిపివేశారు. విషయాన్ని రైతులకు ముందు సమాచారం ఇవ్వాల్సిన నిర్వాహకులు సంచికి 3కిలోల కోత విధించారని తెలిపారు. ఈవిషయంలో రైతులకు, నిర్వాహకులకు వాగ్వాదం చోటుచేసుకుంది.

News May 27, 2024

గల్ఫ్ దేశంలో జగిత్యాల వాసి కష్టాలు.. సెల్ఫీ వీడియో

image

గల్ఫ్ దేశానికి వెళ్లిన తనను ఓ ముఠా మోసం చేసిందంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. జగిత్యాలకు చెందిన రాజేశ్(39) 6నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఓ ముఠా జాబ్ ఇప్పిస్తానని చెప్పి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించింది. ఇండియాకు వెళ్లిరావాలని వారు చెప్పడంతో స్వదేశానికి బయల్దేరగా అబుదాబి ఎయిర్పోర్టులో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రమేయం లేకుండా లోన్లు తీశారని, ప్రభుత్వం కాపాడాలని బాధితుడు కోరారు.

News May 27, 2024

పెద్దపల్లి: బాలికపై లైంగిక వేధింపులు.. ఉరేసుకొని ఆత్మహత్య

image

యువకుడి లైంగిక వేధింపులు భరించలేక బాలిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పాలకుర్తి మండలం జీడీనగర్ గ్రామపరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. PDPL మండలం గుర్రాంపల్లికి చెందిన బాలిక(16) కొంతకాలంగా బీసీ కాలనీలో నివాసముంటోంది. బొంపెల్లికి చెందిన శ్యాం అనే వ్యక్తి కొంతకాలంగా బాలికను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో వేధింపులు తాళలేక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

News May 27, 2024

KNR: ఉపాధ్యాయుల కొరత.. ఉత్తీర్ణతపై ప్రభావం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరత నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలు ఎక్కువ ఉండటంతో గతేడాది ఉత్తీర్ణతపై ప్రభావం పడింది. ఉమ్మడి జిల్లాలో 2,560 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 1,55,935 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 9,952 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. జగిత్యాల 334, KNR 245, PDPL 93, సిరిసిల్లలో 151 చొప్పున సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయుల కొరత ఉంది.

News May 27, 2024

KNR: విధుల్లో నిర్లక్ష్యం.. విద్యుత్ ఉద్యోగుల సస్పెండ్

image

సుల్తానాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యుత్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ DE తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి LC ఇవ్వని కారణంగా విద్యుత్ ఘాతంతో ఓ తాత్కాలిక కార్మికుడికి గాయాలు కావడానికి కారణం కావడంతో సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిలో లైన్ ఇన్‌స్పెక్టర్ నరసయ్యతోపాటు వాయిద్య దుకాణాలు, మీసేవ కేంద్రాలకు విద్యుత్ మీటర్ జారీలో ఆలస్యం చేసిన లైన్‌మెన్ దీన్ దయాల్ ఉన్నారు.

News May 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో వైభవంగా కొండ స్వామి రథోత్సవం. @ జగిత్యాల జిల్లాలో 25 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న సిరిసిల్ల ఎస్పి. @ మేడిపల్లి మండలంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

News May 26, 2024

KNR: ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం జైనలో 46.5°C నమోదు అయ్యింది. జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో 46.1°C, నేరెళ్లలో 45.6°C, కోరుట్ల మండలం ఐలపూర్‌లో 45.6°C, పెద్దపల్లి జిల్లాలోని కమాన్‌పూర్‌లో 45.7°C, జూలపల్లిలో 45.1°C, పాలకుర్తి మండలం తక్కల్లపల్లిలో 44.9°C, ముత్తారంలో 44.9°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News May 26, 2024

VMWD: లంకె బిందెల ఆశ చూపి రూ.30 లక్షలు దోచారు!

image

ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని చెప్పి ఓమహిళ నుంచి రూ.30లక్షలు కాజేసిన ముగ్గురు నిందితులను శనివారం VMWD పోలీసులు అరెస్ట్ చేశారు.CI వీరప్రసాద్ వివరాల ప్రకారం.. హన్మక్కపల్లికి చెందిన అంజవ్వకు ఎల్లయ్య, మహిపాల్, అబ్రహం అనే ముగ్గురు వ్యక్తులు అంజవ్వ తల్లి గారి ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని వాటిని తీయడానికి డబ్బు ఖర్చు అవుతుందని ఆమె నుంచి రూ.30 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సీఐ కేసు నమోదు చేశారు.

News May 26, 2024

KNR: ఈ నెల 28 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్

image

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జగిత్యాల రోడ్డులోని కరీంనగర్ వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాలలో జరుగుతాయని తెలిపారు.