Karimnagar

News May 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మల్లాపూర్ మండలంలో గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి. @ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం. @ సిరిసిల్లలో నేల కూలిన వందేళ్ల నాటి మహా వృక్షం. @ తిమ్మాపూర్ మండలంలో కారు అదుపుతప్పి ఒకరి మృతి. @ కోరుట్ల మండలం పైడిమడుగులో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. @ ఎల్లారెడ్డిపేట మండలంలో అధిక వేడి తాళలేక కోళ్ల ఫారం లో మూడు వేల కోళ్లు మృతి. @ జగిత్యాలలో ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్.

News May 25, 2024

KNR: గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి

image

జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మల్లాపూర్ మండలంలో ఓ లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ ఖాదర్ ఓ ఫర్టిలైజర్ దుకాణంలో ఎరువులను కొనడానికి లారీని తీసుకొని వచ్చాడు. కాగా అదే సమయంలో ఒక్కసారిగా పిడుగులతో కూడిన వర్షం కురవడంతో ఆ శబ్దానికి భయానికి గురైన ఖాదర్ గుండెపోటుతో మృతి చెందాడు.

News May 25, 2024

KNR: రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి సూసైడ్

image

చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కదురు లక్ష్మీరాజం అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి శనివారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

సిరిసిల్ల: మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

image

తండ్రి శంకర్ మరణ వార్త విని గుండెపోటుతో కుప్పకూలిన సిరిసిల్ల పట్టణానికి చెందిన అనూహ్య ను తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ చాకచక్యంతో స్పందించి సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలు రక్షించాడు. అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, పలువురు అభినందించారు.

News May 25, 2024

కరీంనగర్: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

తిమ్మాపూర్ మండలం అలుగునూర్‌లో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. కరీంనగర్ పట్టణం నంగునూరుకు చెందిన నరసయ్య శుక్రవారం రాత్రి కారులో వెళ్తుండగా మార్గమధ్యంలో అలుగునూర్ వద్ద కారు అదుపు తప్పి రహదారి పక్కన గల గోడకు ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌కు గాయాలవ్వగా నరసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

తంగళ్లపల్లి: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

image

తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్లో శుక్రవారం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చల్ల నర్సయ్య(53) ముగ్గురు కుమార్తెల వివాహాల కోసం రూ.8 లక్షలు అప్పు చేశాడు. అప్పు భారం పెరగడంతో ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో శుక్రవారం ఇంటి ఎదుట ఉన్న రేకుల షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News May 25, 2024

దేశం సుభిక్షంగా ఉందంటే మోడీదీ వల్లే: ఈటల

image

దేశం సుభిక్షంగా ఉందంటే ప్రధాని మోదీ వల్లేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వరంగల్ జిల్లాలో పర్యటించిన ఈటల మాట్లాడుతూ.. ఒకప్పుడు దేశం బాంబు పేలుళ్లతో వణికిపోయిందని, నేడు మోదీ నాయకత్వంలో దేశంలో ప్రజలు సుభిక్షంగా ఎలాంటి భయం లేకుండా జీవిస్తున్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

News May 24, 2024

KNR: గడ్డి మందు తాగి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

KNR జిల్లా వీణవంక మండలంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. కొండపాకకు చెందిన సాయి కీర్తన(17) ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసుకుంది. పరీక్షల అనంతరం ఇంటికి వచ్చిన కీర్తనకు కడుపునొప్పి రావడంతో భరించలేక ఈనెల 17న ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో వాంతులు చేసుకోడం గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేడు మృతి చెందగా తండ్రి రాజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 24, 2024

KNR: దుబాయ్‌లో మృతి.. స్వగ్రామం చేరిన DEAD BODY

image

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని మోత్కురావుపేట గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి ఇటీవల దుబాయ్‌లో మ్యాన్ హోల్‌లో పడి మృతి చెందాడు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో అతని మృతదేహం శుక్రవారం గ్రామానికి చేరుకుంది. మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు.

News May 24, 2024

వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల కోలాహలం

image

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు..స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అందరిని చల్లగా చూడు రాజన్న తండ్రి అంటూ భక్తజనం స్వామివారిని వేడుకున్నారు. సమ్మర్ హాలిడేస్స్ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా వస్తున్నారు.