India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మోడల్ స్కూల్స్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్లో దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నెల 10 నుంచి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతిలో సాధించిన జీపీఏ ఆధారంగా ఉమ్మడి జిల్లాలోని 38 మోడల్ స్కూళ్లలో గ్రూపునకు 40 మంది విద్యార్థులు చొప్పున ప్రతి పాఠశాలలో 160 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు.
ఇంటర్ ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన శ్రీనిధి (18) ఇంటర్ ఫెయిల్ అయ్యానని మనోవేదన చెందింది. దీంతో ఈ నెల 8న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. గురువారం చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సింగరేణి సంస్థ రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనకు ఆధునిక మైనింగ్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు సంస్థ C&MD బలరాం పేర్కొన్నారు. ఈ మేరకు HYD సింగరేణి భవన్లో మైనింగ్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానంపై ఆస్ట్రేలియా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ డేనిస్ ఈటెన్తో ప్రత్యేక సమావేశమయ్యారు. సింగరేణిలో నూతన వ్యాపార విస్తరణ చర్యల పరిశీలనకు నవంబర్లో ఆస్ట్రేలియా బృందం పరిశీలిస్తుందన్నారు.
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ, ఎంఈడీ ప్రథమ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, బ్యాక్ లాగ్) జూన్ 5 నుంచి, ఎంఈడీ థర్డ్ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6 నుంచి ప్రారంభమవుతున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. అలాగే LLB, ఎల్ఎల్ఎం ప్రథమ సెమిస్టర్ పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో నేడు పాలిసెట్ పరీక్ష జరగనుంది. ఉ.11 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమై మ.1.30 గంటల వరకు కొనసాగుతుంది. 9 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. గంట ముందు నుంచే అనుమతి ఉంటుంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉండదు. విద్యార్థులు హెచ్బీ బ్లాక్ పెన్సిల్, ఎరేజర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పరీక్షకు జిల్లా నుంచి 3,766 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
@ సైదాపూర్ మండలంలో 26 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ మెట్పల్లి మండలంలో లారీ, కారు ఢీ.. కుమారుడి మృతి, తండ్రికి గాయాలు. @ ఓదెల మండలంలో చిరుత పులి సంచారం కలకలం. @ ఎల్లారెడ్డిపేట మండలంలో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య. @ కొడిమ్యాల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్. @ పెద్దపల్లి లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
ధాన్యం కొనుగోళ్లను 2, 3 రోజుల్లో పూర్తిచేయాలని అడిషనల్ కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. కొడిమ్యాల మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. అకాల వర్షాల వలన నష్టపోయిన పంట వివరాలను తెలుసుకున్నారు. రైస్ మిల్లు లను సందర్శించి వెంటనే ధాన్యాన్ని అన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.
పెద్దపల్లి ఆదర్శ్నగర్లో గల బంధంపల్లి చెరువును అనుకొని ఉన్న వ్యవసాయ కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనది. పెద్దపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 40 నుంచి 45 మధ్య ఉంటుందన్నారు. తెల్లని చొక్కా, నీలిరంగు లుంగీ పంచ కలిగి ఉందని తెలిపారు. వివరాలు తెలిసినవారు పెద్దపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
రానున్న ఏడాది కాలంలో సింగరేణికి సంబంధించి రెండు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను మూసివేసే పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాజెక్టులలో బొగ్గు నిక్షేపాలు పూర్తి కావడంతో మూసివేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. రామగుండం రీజియన్లోని OCP-1, శ్రీరాంపూర్ ప్రాంతంలోని రామకృష్ణాపూర్ ఓసీపీలో బొగ్గు నిక్షేపాలు పూర్తి కానున్నాయి. వచ్చే ఏడాది నాటికి దాదాపుగా వీటిని మూసివేసే అవకాశం ఉంది.
మూడో లైను పనుల కారణంగా ఈనెల 27 నుంచి జూన్ 30 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 07462/ 63 వరంగల్- సికింద్రాబాద్ పుష్ పుల్ రైలు, 17035/ 36 కాజీపేట- బల్లార్షా, 07766/ 65 కరీంనగర్- సిర్పూర్ టౌన్, 07894 కరీంనగర్ – బోధన్ రైలు వచ్చే నెల 30 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.