India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక <<13298191>>రైల్వే కోర్ కారిడార్ <<>>ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ మేరకు 207.80 కి.మీ మేర ఈ నడవా విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్ గేజ్ నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భూ సేకరణ చేపట్టాలని SCR అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో 142 కి.మీ. దూరం తగ్గనుంది.
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ను వచ్చే వానాకాలం సీజన్ నుంచే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సన్న రకం వరి సాగు పెరగనుంది. సాధారణ వరి సాగు విస్తీర్ణం కన్నా అదనంగా 15 నుంచి 20 శాతం పెరగవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ నీరు, సానుకూల వాతావరణం దృష్ట్యా ఖరీఫ్లో రైతులు సన్న రకం వరి సాగు వైపు మక్కువ చూపుతారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్షల కోసం 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరంలో 10,073 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,907 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రాగానే మహిళలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని అన్నారు. ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఎస్సై నాగరాజును సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజి రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా గోపాలపూర్కు చెందిన మానసకు ఎస్సై నాగరాజుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని మంగళవారం కొమురవెల్లి PS ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. దీంతో ఈ ఘటనపై సిద్దిపేట సీపీ విచారణ జరిపించారు. ఆరోపణలు నిజమవడంతో ఎస్సైని సస్పెండ్ చేశారు.
మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల హడావిడిలో మునిగి తేలిన నాయకులకు.. ఇక పంచాయితీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఫిబ్రవరి 2 నుంచి పల్లెలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. సైదాపూర్ మండలంలో మొత్తం 26 గ్రామపంచాయతీలు, 234 వార్డులు ఉండగా.. వీటికి సంబంధించిన వివరాలు అధికారులు సేకరిస్తున్నారు.
పాఠశాలలో ఎలాంటి లోపాలు లేకుండా విద్యార్థులకు అన్ని వసతులు, సౌకర్యాలతో కూడిన విద్యను అందించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యాశాఖ, ఆర్ ఆండ్ బి., ప్రత్యేకాధికారులతో అమ్మ ఆదర్శపాఠశాల అభివృద్ధి పనుల ప్రగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రధాన చౌరస్తా మూలమలుపు వద్ద బుధవారం ఉదయం బండల లోడ్తో వెళ్తున్న టిప్పర్ వెనుక టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి. ప్రమాద సమయంలో టిప్పర్ దగ్గర ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో కాసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి SI నాగరాజు తనకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్నాడని అతడి మొదటి భార్య మానస కొమురవెల్లి పీఎస్ ఎదుట తల్లి, బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. కరీంనగర్ జిల్లా గోపాలపురానికి చెందిన మానసకు ఎస్ఐ నాగరాజుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని మంగళవారం PS ఎదుట కూర్చుని నిరసన తెలిపారు.
భవిష్యత్తు 2029- 30 ఆర్థిక సంవత్సరం నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే విధంగా ప్రణాళికలు చేసుకోవాలని సింగరేణి డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గోదావరిఖనిలోని ఇల్లెందు క్లబ్లో రామగుండం, బెల్లంపల్లి రీజినల్ జనరల్ మేనేజర్లు, వివిధ విభాగాల అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న కాలంలో కొత్త గనుల ఏర్పాటు, గనుల విస్తరణపై చర్చించారు.
Sorry, no posts matched your criteria.