India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెట్పల్లిలో ఓ మహిళ <<13286254>>హత్య<<>>కు గురైన విషయం విదితమే. పోలీసుల కథనం ప్రకారం.. మెట్పల్లికి చెందిన సింగం మమత (38) తన భర్తకు విడాకులు ఇచ్చి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా కుమార్తెతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అబ్దుల్ అప్సర్తో మమతకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి మధ్య సోమవారం గొడవ జరిగింది. కోపంతో అప్సర్ మమతను గొంతునులిమి, కత్తితో పొడవడంతో చనిపోయినట్లు SI చిరంజీవి పేర్కొన్నారు.
మానేరు నదిలో డిసిల్ట్రేషన్ పేరిట చేపట్టిన ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై సౌత్ బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. కరీంనగర్లో ప్రవహిస్తున్న మానేరు నదిలో ఇసుక తవ్వకాలు జరపడం చట్ట విరుద్ధమని తెలిపింది. ఇరిగేషన్, మైనింగ్ విభాగాలకు రూ. 25 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానాను 3నెలలోగా గోదావరి రివర్ మేనేజెమెంట్ బోర్డు కు చెల్లించాలని,ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
శంకరపట్నం మండలం కరీంపేట్కు చెందిన విద్యార్థిని M.నవ్యశ్రీ ఈసెట్ ఫలితాల్లో సత్తా చాటింది. ECE విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించింది. కేశవపట్నం ఆదర్శ పాఠశాలలో 2020-21లో పదో తరగతి చదివి 10 GPA సాధించింది. WGL ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా పూర్తి చేసింది. ఈసెట్లో ECE విభాగంలో 200 మార్కులకు 146 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకు, ఇంటిగ్రెటేడ్లో 14వ ర్యాంకు సాధించింది.
తెలంగాణలోని 10 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం ఇన్ఛార్జి వీసీలను నియమించింది. వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ మంగళవారం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. కాగా లిస్టులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి శైలజా రామయ్యర్ ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ అయిన శైలజా రామయ్యర్ను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి వీసీగా ప్రభుత్వం నియమించింది.
కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీగా సురేంద్రమోహన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వీసీ పదవీ కాలం పూర్తి కావడంతో ఇన్ఛార్జిగా ఐఏఎస్ అధికారులను నియమించింది. కొత్త వీసీలు నియమితులు అయ్యే వరకు వీరే విధుల్లో కొనసాగనున్నారు. ఇప్పటికే కొత్త వీసీల కోసం యూనివర్సిటీలో సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధిహామీ పనుల్లో భాగంగా గుంతలు తవ్వుతుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు కూలాయి. ఈ క్రమంలో మారుపాక రాజవ్వ (46)పై పెళ్లలు పడగా ఆమె మృతిచెందారు. మరోముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వారికి తెలియకుండానే వారి ఖాతాలోని డబ్బులు మాయం చేశారు. ఈ ఘటన గంభీరావుపేటలో జరిగింది. గంభీరావుపేటకు చెందిన కోటయ్యగారి రాజేందర్రెడ్డి ఖాతా నుంచి ఈ నెల 15న రూ.45,000, 16 న దండ నరేశ్ ఖాతా నుంచి రూ.44,990, 17న లింగారెడ్డి రాజశేఖర్రెడ్డి ఖాతా నుంచి రూ.50 వేలు, 18న కోటయ్యగారి లత ఖాతా నుంచి రూ.1.85లక్షలు కట్ అయ్యాయి. తమకు తెలియకుండా డబ్బులు పోయాయని బ్యాంకును సంప్రదించగా.. సైబర్ నేరగాళ్ల పనేనని తెలింది.
KNR లోక్సభ నియోజకవర్గపరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 4 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా.. 3 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. ఓవరాల్గా కాంగ్రెస్ 1,03,729 మెజార్టీ సాధించగా.. బీఆర్ఎస్ 49,723 సాధించింది. KNR, HZB మినహా చాలా చోట్ల బీజేపీ 3 స్థానానికి పరిమితమైంది. ప్రస్తుత ఓటింగ్ తమకు కలుసొస్తుందనే కాంగ్రెస్ భావిస్తుంటే.. రాజకీయసమీకరణాలు మారాయని బీజేపీ, బీఆర్ఎస్ అంటున్నాయి.
-దీనిపై మీ కామెంట్
26 జనవరి 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చే జాతీయ స్థాయి పద్మ అవార్డుల కోసం నైపుణ్యం కలిగిన చేనేత అనుబంధ కార్మికుల నుంచి దరఖాస్తులు కోరుతూ చేనేత, జౌళి శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. చేనేత కార్మికులు వారి వివరాలను http//padmaawards.gov.inలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో నమోదు చేసిన దరఖాస్తులను మాత్రమే ధృవీకరిస్తారని, మే 25లోగా జౌళి శాఖలో దరఖాస్తులు సమర్పించాలని అన్నారు.
తంగళ్ళపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా ఫైన్ ఆర్ట్స్ డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె.రజిని తెలిపారు. 2024-25 విద్యా సం.నికి గాను BA హానర్స్ ఫ్యాషన్ డిజైన్, కొన్ని కోర్సులలో ప్రవేశాలకు ఉమ్మడి KNR జిల్లాలోని గిరిజన, గిరిజనేతర విద్యార్థినులు సంబంధిత పత్రాలతో ఈనెల 30లోపు కాలేజీలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.