India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధిహామీ పనుల్లో భాగంగా గుంతలు తవ్వుతుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు కూలాయి. ఈ క్రమంలో మారుపాక రాజవ్వ (46)పై పెళ్లలు పడగా ఆమె మృతిచెందారు. మరోముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వారికి తెలియకుండానే వారి ఖాతాలోని డబ్బులు మాయం చేశారు. ఈ ఘటన గంభీరావుపేటలో జరిగింది. గంభీరావుపేటకు చెందిన కోటయ్యగారి రాజేందర్రెడ్డి ఖాతా నుంచి ఈ నెల 15న రూ.45,000, 16 న దండ నరేశ్ ఖాతా నుంచి రూ.44,990, 17న లింగారెడ్డి రాజశేఖర్రెడ్డి ఖాతా నుంచి రూ.50 వేలు, 18న కోటయ్యగారి లత ఖాతా నుంచి రూ.1.85లక్షలు కట్ అయ్యాయి. తమకు తెలియకుండా డబ్బులు పోయాయని బ్యాంకును సంప్రదించగా.. సైబర్ నేరగాళ్ల పనేనని తెలింది.
KNR లోక్సభ నియోజకవర్గపరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 4 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా.. 3 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. ఓవరాల్గా కాంగ్రెస్ 1,03,729 మెజార్టీ సాధించగా.. బీఆర్ఎస్ 49,723 సాధించింది. KNR, HZB మినహా చాలా చోట్ల బీజేపీ 3 స్థానానికి పరిమితమైంది. ప్రస్తుత ఓటింగ్ తమకు కలుసొస్తుందనే కాంగ్రెస్ భావిస్తుంటే.. రాజకీయసమీకరణాలు మారాయని బీజేపీ, బీఆర్ఎస్ అంటున్నాయి.
-దీనిపై మీ కామెంట్
26 జనవరి 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చే జాతీయ స్థాయి పద్మ అవార్డుల కోసం నైపుణ్యం కలిగిన చేనేత అనుబంధ కార్మికుల నుంచి దరఖాస్తులు కోరుతూ చేనేత, జౌళి శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. చేనేత కార్మికులు వారి వివరాలను http//padmaawards.gov.inలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో నమోదు చేసిన దరఖాస్తులను మాత్రమే ధృవీకరిస్తారని, మే 25లోగా జౌళి శాఖలో దరఖాస్తులు సమర్పించాలని అన్నారు.
తంగళ్ళపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా ఫైన్ ఆర్ట్స్ డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె.రజిని తెలిపారు. 2024-25 విద్యా సం.నికి గాను BA హానర్స్ ఫ్యాషన్ డిజైన్, కొన్ని కోర్సులలో ప్రవేశాలకు ఉమ్మడి KNR జిల్లాలోని గిరిజన, గిరిజనేతర విద్యార్థినులు సంబంధిత పత్రాలతో ఈనెల 30లోపు కాలేజీలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు త్వరగా అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మొత్తం 3,12,930 పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి తెలిపింది. ఇప్పటివరకు 1,95,350 పాఠ్యపుస్తకాలు రాగా.. ఇంకా1,16,580 రావాల్సి ఉంది. పుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై వరుస నెంబర్లను ముద్రించారు. వీటి ఆధారంగా ఆయా పాఠశాలలకు పుస్తకాలు సరఫరా చేయనున్నారు.
@ జగిత్యాల రూరల్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. @ సుల్తానాబాద్ మండలంలో విద్యుత్ షాక్ తగిలి 2 గేదెలు మృతి. @ కొడిమ్యాల మండలంలో కారు, బైకు డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ చిగురు మామిడి మండలంలో హైనా దాడిలో దూడ మృతి. @ దళారులను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దన్న వేములవాడ డీఎస్పీ. @ ధర్మపురిలో వైభవంగా కొనసాగుతున్న లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్హౌస్ ఎదుట వెలిసిన ఓ ఫ్లెక్సీ కలకలం రేపింది. ‘ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూకే నాయకులారా ఖబడ్దార్..’ అని ఆ ఫ్లెక్సీపై రాసి ఉంది. దానికి చెప్పుల దండ వేసి ఉంది. ఈ ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. ఎవరు ఏర్పాటు చేశారనేది మాత్రం తెలియరాలేదు. తరచూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న నాయకులను టార్గెట్ చేసి దీన్ని ఏర్పాటు చేశారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సిరిసిల్ల జిల్లాలో రూ.85.22 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మార్చి 16న కోడ్ ప్రారంభం కాగా.. మే 17 వరకు (2నెలల్లో) 1,45,228 కేస్ల బీర్లు, 76,943 కేస్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కేస్లో 12 సీసాలుంటాయి. ఎండల తీవ్రత దృష్ట్యా మద్యం కంటే చల్లని బీర్లకే మందుబాబులు మొగ్గు చూపారు. కోడ్ ఉన్నప్పటికీ JAN, FEB మాదిరిగానే విక్రయాలు సాగాయి.
కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ స్కీం కింద ఈ 5 నెలల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం చాలా పెరిగింది. దీంతో RTCకి మంచి ఆదాయం సమకూరుతోంది. కరీంనగర్ రీజియన్లో KNR-1, 2, హుస్నాబాద్, హుజూరాబాద్, కోరుట్ల, GDK, సిరిసిల్ల, వేములవాడ, మెట్పల్లి, జగిత్యాల డిపోలున్నాయి. వీటి పరిధిలో గతంలో రోజూ 2.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే.. ‘మహాలక్ష్మి’ వచ్చాక ఆ సంఖ్య 4.5 లక్షలకు చేరింది.
Sorry, no posts matched your criteria.