Karimnagar

News May 21, 2024

KNR: జూన్ మొదటి వారంలోగా పాఠ్యపుస్తకాలు!

image

వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు త్వరగా అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మొత్తం 3,12,930 పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి తెలిపింది. ఇప్పటివరకు 1,95,350 పాఠ్యపుస్తకాలు రాగా.. ఇంకా1,16,580 రావాల్సి ఉంది. పుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై వరుస నెంబర్లను ముద్రించారు. వీటి ఆధారంగా ఆయా పాఠశాలలకు పుస్తకాలు సరఫరా చేయనున్నారు.

News May 20, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి TOP NEWS

image

@ జగిత్యాల రూరల్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. @ సుల్తానాబాద్ మండలంలో విద్యుత్ షాక్ తగిలి 2 గేదెలు మృతి. @ కొడిమ్యాల మండలంలో కారు, బైకు డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ చిగురు మామిడి మండలంలో హైనా దాడిలో దూడ మృతి. @ దళారులను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దన్న వేములవాడ డీఎస్పీ. @ ధర్మపురిలో వైభవంగా కొనసాగుతున్న లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు.

News May 20, 2024

కరీంనగర్‌లో ఫ్లెక్సీ కలకలం.. ఏకంగా చెప్పుల దండేశారు

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్‌హౌస్ ఎదుట వెలిసిన ఓ ఫ్లెక్సీ కలకలం రేపింది. ‘ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూకే నాయకులారా ఖబడ్దార్..’ అని ఆ ఫ్లెక్సీపై రాసి ఉంది. దానికి చెప్పుల దండ వేసి ఉంది. ఈ ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఎవరు ఏర్పాటు చేశారనేది మాత్రం తెలియరాలేదు. తరచూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న నాయకులను టార్గెట్ చేసి దీన్ని ఏర్పాటు చేశారు.

News May 20, 2024

సిరిసిల్ల: 2 నెలల్లో 17 లక్షల పైచిలుకు బీర్లు తాగేశారు!

image

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సిరిసిల్ల జిల్లాలో రూ.85.22 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మార్చి 16న కోడ్ ప్రారంభం కాగా.. మే 17 వరకు (2నెలల్లో) 1,45,228 కేస్‌ల బీర్లు, 76,943 కేస్‌ల మద్యం అమ్మకాలు జరిగాయి. కేస్‌లో 12 సీసాలుంటాయి. ఎండల తీవ్రత దృష్ట్యా మద్యం కంటే చల్లని బీర్లకే మందుబాబులు మొగ్గు చూపారు. కోడ్ ఉన్నప్పటికీ JAN, FEB మాదిరిగానే విక్రయాలు సాగాయి.

News May 20, 2024

కరీంనగర్: ఫ్రీ బస్.. 5 నెలల్లో ఏకంగా 4.5 లక్షల మంది

image

కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ స్కీం కింద ఈ 5 నెలల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం చాలా పెరిగింది. దీంతో RTCకి మంచి ఆదాయం సమకూరుతోంది. కరీంనగర్ రీజియన్‌లో KNR-1, 2, హుస్నాబాద్, హుజూరాబాద్, కోరుట్ల, GDK, సిరిసిల్ల, వేములవాడ, మెట్‌పల్లి, జగిత్యాల డిపోలున్నాయి. వీటి పరిధిలో గతంలో రోజూ 2.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే.. ‘మహాలక్ష్మి’ వచ్చాక ఆ సంఖ్య 4.5 లక్షలకు చేరింది.

News May 20, 2024

KNR: యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన HYD దోమలగూడ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బెజ్జంకి మండలం తోటపల్లె గ్రామానికి చెందిన అజయ్(26) బోయిన్‌పల్లి అంజయ్యనగర్‌లో ఉంటూ శ్రీకర ఆసుపత్రిలో అనస్థీషియా టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాణిగంజ్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్తున్న అజయ్ బైక్‌ను సరకు రవాణా వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదైంది.

News May 20, 2024

కొండగట్టు: పెద్ద జయంతి స్పెషల్.. చేయాల్సిన పనులు ఇవి!

image

ఈనెల 29 నుంచి పెద్దహనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. వేడుకలకు ఆలయ పరిసరాల్లో చేయాల్సిన పనులు.
– కొండపైన పుష్కరిణిలో నీటిని తొలగించి కొత్త నీటిని నింపాలి.
– మెట్లపక్కన జల్లు స్నానాల కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
-ఘాటురోడ్, బొజ్జపోతన్న సమీపంలో రహదారులకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి.
-కాలినడకన వచ్చే భక్తుల కోసం వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలి
-పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లు వేయాల్సి ఉంటుంది.

News May 20, 2024

కరీంనగర్: కొత్త రేషన్ కార్డులపై ఆశలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులు ఎప్పుడు మంజూరు చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా1947 రేషన్ షాపులు ఉండగా 9,80,261 ఆహారభద్రత కార్డులు ఉండగా 28,24,897 మంది కుటుంబ సభ్యులు రాయితీతో కూడిన లబ్ధి పొందుతున్నారు.

News May 20, 2024

REWIND: బండి సంజయ్‌కు 89,016 ఓట్లు!

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బండి సంజయ్‌కు ఎంపీ ఎన్నికలు కలిసొస్తాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్ 2019లో ఎంపీగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోగా 89,016 ఓట్లు పోలయ్యాయి. అయితే ఈసారి కూడా ఎంపీగా గెలుస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో త్రిముఖ పోటీ ఉండగా బండి సంజయ్ గెలుస్తారో లేదో వేచి చూడాలి.

News May 20, 2024

రామగుండం: నకిలీ విత్తనాలు రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా: సీపీ

image

నకిలీ, కల్తీ విత్తనాలు స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతామని ఆదివారం రామగుండం సీపీ శ్రీనివాస్ హెచ్చరించారు . వ్యవసాయ, ప్రభుత్వ శాఖల సిబ్బందితో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని సీపీ తేల్చిచెప్పారు.