India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ చందుర్తి మండలంలో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ తంగళ్ళపల్లి మండలంలో కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రుల అరెస్ట్. @ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల ఎస్పీ. @ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్ పల్లి మండలంలో వైభవంగా ప్రారంభమైన కొండస్వామి బ్రహ్మోత్సవాలు. @ కొడిమ్యాల మండలంలో లారీ, పాల వ్యాన్ డీ.. ఒకరి మృతి.
జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. సరిగ్గా మరో 15 రోజుల్లో మన ఎంపీ ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ, ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు పలుపార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారు. – మరి మీ MP ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..
కన్నకూతురిని హత్యచేసిన తల్లిదండ్రుల్ని రిమాండ్కు తరలించామని SP అఖిల్ మహాజన్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన చెప్యాల ఎల్లవ్వ- నర్సయ్య దంపతులకు కూతురు ప్రియాంక ఉంది. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఆమె ప్రవర్తన తీరుపై కోపగించుకున్న తల్లిదండ్రులు ఈనెల 14న ఆమెను హత్యచేశారు. ఆదివారం నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే మృతురాలికి పెళ్లై, 13 నెలల బాలుడు ఉండటం గమనార్హం.
తల్లి మందలించిందని ఓ యువతి గడ్డి మందు తాగి మృతి చెందింది. స్థానికుల వివరాలు.. కమాన్పూర్ మం. బురకాయ పల్లె గ్రామానికి చెందిన బొడ్డుపల్లె సింధు(19)ను ఈ నెల 14న ఇంట్లో చెప్పిన పని చేయడం లేదని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో డబ్బులు దండుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిన ఓ యువతిపై LMD పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. తిమ్మాపూర్కు చెందిన నాగరాజు యోగ నిమిత్తం ఈశా ఫౌండేషన్కు వెళ్లగా అక్కడ వైజాగ్కు చెందిన సంధ్య ప్రియాంకతో పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నుంచి రూ. 16లక్షలు యువతి తన బంధువుల ఖాతాలోకి బదిలీ చేయించుకుంది. యువకుడు ఫినాయిల్ తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (ఎప్సెట్) ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు మెరిశారు. కరీంనగర్కు చెందిన మునీశ్వరి-చంద్రశేఖర్ రెడ్డిల కూతురు వి.హాసిని 144 ర్యాంకు, రజిని-శ్రీనివాస్ల కుమారుడు ఎన్. హేమంత్ 157వ ర్యాంకు, గంగాధరకు చెందిన ధనలక్ష్మి-పవన్ల కూతురు బొడ్ల ఆశ్రిత 220 ర్యాంకు సాధించారు. ఉన్నత విద్య అభ్యసించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈవీఎంను భద్రపర్చిన స్ట్రాంగ్రూం లను రాష్ట్ర ఎన్నికల డిప్యూటీ ప్రధాన అధికారి మురళీ మోహన్ రావు పరిశీలించారు. శనివారం రామగిరిలోని సెంటినరీకాలనీలో ఉన్న జేఎన్టీయూ మంథని కళాశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి తనిఖీ చేశారు. రామగుండం, మంథని, ధర్మపురి, పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన స్ట్రాంగ్ రూంలకు వేసిన సీల్లను పరిశీలించి సంబంధిత రిజిస్టర్లో సంతకం చేశారు.
@ కరీంనగర్ జిల్లాలో ముగ్గురు టీచర్ల సస్పెన్షన్. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ముస్తాబాద్ మండలంలో విద్యుత్ షాక్ తో బర్రె మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలన్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్. @ నిజామాబాద్ పార్లమెంటులో టఫ్ ఫైట్ ఉందన్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. @ గ్రూప్ 1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: సిరిసిల్ల కలెక్టర్
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మంగ, సైదాపూర్ మండలం నల్లోనితండా పాఠశాల ఉపాధ్యాయురాలు సునీతలను డీఈవో జనార్దన్రావు సస్పెండ్ చేశారు. ఆయా పాఠశాలల్లో అనధికారిక వ్యక్తులు నివాసం ఉంటున్నారనే సమాచారం తెలియజేయకపోవడంతో విధుల నుంచి తొలగించారు. అదేవిధంగా కరీంనగర్ పట్టణం ఫకీర్ నగర్ స్కూల్ టీచర్ మంజులను విధులకు గైర్హాజరు కారణంగా సస్పెండ్ చేశారు.
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు <<13261896>>హత్య<<>>కు గురయ్యారు. బుగ్గారం పోలీసుల వివరాలు.. గోపులాపూర్కు చెందిన శ్రీనివాస్ ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. దాని పక్కనే అదే గ్రామానికి చెందిన నవీన్ ఇల్లు ఉంది. రోడ్డు విషయంలో వీరికి గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శ్రీనివాస్(36)తో పాటు అతడి పెద్దనాన్న కొడుకైన మహేశ్(38)పై నవీన్ కొంతమంది యువకులతో కలిసి దాడి చేయగా.. ఇద్దరు మృతి చెందారు.
Sorry, no posts matched your criteria.