India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గోదావరిఖని డిపోకు రాఖీ పండుగ సందర్భంగా రూ.66 లక్షల ఆదాయం సమకూరినట్లు డిపో అధికారులు తెలిపారు. అధిక ఆదాయం సమకూర్చుకున్న గోదావరిఖని ఆర్టీసీ డిపో.. రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలతో పోలిస్తే ఈ డిపో పరిధిలో బస్సులు అత్యధికంగా 76,383 కిలోమీటర్లు తిరిగాయి. సోమవారం ఒక్కరోజే రూ.66,55,090 ఆదాయం ఆర్జించినట్లు తెలిపారు.

గోదావరిఖని గంగానగర్ సమీపంలో ఎస్టీపీల నిర్మాణానికి అక్కడ గుడిసెలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. దీంతో గుడిసెల వాసులు వారి సమస్య పరిష్కరించాలని రామగుండం MLA మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అరులైన పేదలందరికీ ఇతర చోట్ల పట్టాలు ఇస్తామని హమీ ఇచ్చారు. రామగుండం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాని ప్రజలు సహకరించాలని కోరారు.

కరీంనగర్ నూతన మున్సిపల్ కమిషనర్గా చాహత్ బాజ్పాయ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చాహత్ బాజ్పాయ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పమేల సత్పతిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదల నుంచి 2023 డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు వారికి ఆర్థిక సహాయం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఇటీవల ప్రభుత్వం తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు నిధులు మంజూరు చేస్తామని చెప్పడంతో పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ పథకానికి మొత్తంగా 7,09,923 దరఖాస్తులు రాగా.. మొదటి విడతలో 42 వేల ఇళ్లకు నిధులు రానున్నట్లు తెలుస్తోంది.

కరీంనగర్ <<13902837>>కార్పొరేషన్ కొత్త కమిషనర్<<>>గా చాహత్ బాజ్పాయ్ని నియమిస్తూ CS శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. 2019 IAS బ్యాచ్కు చెందిన చాహత్ బాజ్పాయ్ IIT కాన్పూరులో బీటెక్ పూర్తి చేశారు. ఈమె APతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ITDA ప్రాజెక్టు డైరెక్టర్గా, సబ్ కలెక్టర్గా, అదనపు కలెక్టర్గా పని చేశారు. కాగా రెండేళ్ల తర్వాత మళ్లీ IASకే కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు.

మూడేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా జిల్లాలో బీసీ సంక్షేమ శాఖలోనే రూ.131.35 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా BC, SC, ST, మైనార్టీ, EBC విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో బకాయిల భారం పెరిగింది.

కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 90కి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు ఆసుపత్రి లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దోమల వ్యాప్తి అధికంగా పెరిగింది. డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. దీంతో చాలా మంది జ్వరాల బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

కరీంనగర్ జిల్లాలోని రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. వానకాలం సాగు మొదలై 2 నెలలు కావొస్తున్నా రైతు భరోసా పథకం అమలు ఊసేలేదు. రైతులు పెట్టుబడుల కోసం అప్పులు చేస్తున్నారు. కాగా జిల్లాలో 3,45,070 ఎకరాల్లో పంటలు సాగు కాగా.. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయంగా ఇస్తే జిల్లా రైతులకు రూ.258.8 కోట్ల లబ్ధి చేకూరనుంది.

@ కోనరావుపేట మండలంలో ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన జగిత్యాల కలెక్టర్. @ మెట్ పల్లి మండలంలో వైభవంగా రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన. @ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ జమ్మికుంట మండలంలో బైకును ఢీ కొట్టిన కారు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి.

కరీంనగర్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా చాహత్ బాజ్పాయ్ని నియమిస్తూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన చాహత్ బాజ్పాయ్ ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్గా, ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా విధులు నిర్వర్తించారు.
Sorry, no posts matched your criteria.