Karimnagar

News May 18, 2024

Elections: పెద్దపల్లి ఎవరికో?

image

పెద్దపల్లిలో ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఒక్కో పార్టీని ఆదరిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో BRS అభ్యర్థి MPగా గెలుపొందగా.. 2023లో లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో BRS శ్రేణులు కాంగ్రెస్‌‌లో భారీగా చేరాయి. సిట్టింగ్‌ MP వెంకటేశ్‌ నేత BJPలో చేరారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు చర్చ జరుగుతోంది. మీ కామెంట్?

News May 18, 2024

జగిత్యాల: చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు

image

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 10లోపు పాఠశాలలో కనీస సదుపాయాలు పూర్తి చేయాలని, 20 రోజుల వ్యవధిలో మంజూరు చేసిన పనులు పూర్తి చేయాలన్నారు. ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని సూచించారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, అడిషనల్ కలెక్టర్లు దివాకర, రాంబాబు తదితరులున్నారు.

News May 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*కోరుట్లలో లైసెన్స్ లేకుండా మందులు విక్రయించిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష.
*ప్రభుత్వ పాఠశాలలలో మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలన్న జగిత్యాల కలెక్టర్.
*కోరుట్లలో ఆర్థిక ఇబ్బందులతో స్వర్ణకారుడు ఆత్మహత్య.
*వేములవాడ అర్బన్ మండలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన.
*పెద్దపల్లి మండలంలో పర్యటించిన డిపిఓ.
*కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షం.

News May 17, 2024

లక్ష్మీనరసింహస్వామి ఆదాయం ఎంతంటే..?

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,59,135 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ.79,758 ప్రసాదం అమ్మకం ద్వారా రూ.65,245 అన్నదానం రూ.14,132 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News May 17, 2024

KNR: పార్లమెంటు ఫలితాలపైనే స్థానిక ఆశలు!

image

పార్లమెంటు ఎన్నికల ఫలితాల పైనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల భవితవ్యం ఆధారపడి ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇందుకోసం ఏ పార్టీ మద్దతు ఉంటే తమకు లాభం ఉంటుందనే విషయమై ఇప్పటికే అంచనాకు వచ్చి మొన్నటి ఎన్నికల్లో కొందరు పార్టీ మారారు. ఈ ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీల మార్పు కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తుంది.

News May 17, 2024

సింగరేణి ఉద్యోగాల దరఖాస్తుకు సాంకేతిక సమస్య

image

సింగరేణిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ లో అప్లై చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించగా రెండు రోజులుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. గురువారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించి ఆన్లైన్ సేవలు ముందుకు తీసుకురావాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

News May 17, 2024

KNR: PG పరీక్ష ఫలితాలు విడుదల

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో గత మార్చ్ నెలలో నిర్వహించిన పీజీ ఫలితాలు వెలువడినట్టు పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. MBA, MCA, MSC, ఒకటవ, మూడవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.satavahana.ac.inలో అందుబాటులో ఉంచామని, ఫలితాలను చూసుకోవాలని ఆయన సూచించారు.

News May 17, 2024

జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి మర్డర్

image

జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. బుగ్గారం మం. గోపులాపూర్‌కు చెందిన బెస్త శ్రీనివాస్ (35), అతని తమ్ముడు మహేష్‌పై రాడ్లు, పైప్‌లతో గురువారం అర్ధరాత్రి 5గురు ముసుగు వేసుకుని వచ్చి రాడ్లు, పైప్‌లతో దాడి చేయగా బెస్త శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహేష్‌కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. భూ తగాదాల నేపథ్యంలోనే గొడవలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.

News May 17, 2024

KNR: నగరవాసుల కంటే గ్రామీణ ఓటర్లే గ్రేట్

image

లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంలో నగరవాసుల కంటే గ్రామీణ ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. పెద్దపల్లి పరిధిలోని 7 నియోజకవర్గాల్లో రామగుండం, మంచిర్యాలలో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైంది. మొత్తం 15,86,430 మంది ఓటర్లు ఉండగా వీరిలో 10,83,453 మంది ఓటు వేశారు. గ్రామీణ ప్రాంతాలైన సోనాపూర్‌లో 92.02, ఇసన్వాయిలో 83.91, తలమాల 86.42, కప్పరావుపేట పోలింగ్ కేంద్రంలో 84.19 శాతం అధిక పోలింగ్ నమోదైంది.

News May 17, 2024

KNR: RTCకి రూ.10.94 కోట్ల ఆదాయం

image

లోక్‌కసభ ఎన్నికలు RTCకి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. కరీంగనర్ రీజియన్‌లో 11 డిపోలు ఉండగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మే 10 నుంచి 14 వరకు వివిధ ప్రాంతాలకు 4350 బస్సులు నడిపింది. వీటిలో 510 అదనపు బస్సులున్నాయి. 5రోజుల్లో 19.42 లక్షల మంది RTC బస్సుల్లో ప్రయాణించగా రూ.10.94 కోట్ల ఆదాయం సమకూరింది. జగిత్యాల డిపో రూ.1.65 కోట్లు, గోదావరిఖని డిపో రూ.1.59 కోట్లతో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.