India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 9 గంటల వరకు ఇలా ఉన్నాయి.
చొప్పదండి-10.90%, హుస్నాబాద్-11.84, హుజూరాబాద్-9.45%, కరీంనగర్-10.23%, మానకొండూర్-10.06%, సిరిసిల్ల-7.23%, వేములవాడ-12.10శాతంగా ఉన్నాయి.
కరీంనగర్లోని ముకరంపురలో గల ఉర్దూ ఉన్నత పాఠశాలలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఆయన సతీమణి డాక్టర్ బోయినపల్లి మాధవితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారితో పాటు కుమారులు ప్రతీక్, ప్రణయ్ కోడలు హర్షిణి ఓటు వేశారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.
పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచిర్యాలలోని మార్కెట్ రోడ్లో ఉన్న పాఠశాలలో తన తల్లి సరోజ వివేకానందతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. కాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది.
లోక్సభ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి. ⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలింపు
⏵శాంతి భద్రతల ఆటంకం
⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం
⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ
⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం
⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు
⏵అసత్య వార్తలు వ్యాప్తి
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సిరిసిల్ల & వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ సిబ్బంది, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంలను, వివి ప్యాట్లను ప్లాట్లను సరిచూసుకున్నారు. మాక్ పోలింగ్ అనంతరం పోలింగ్ ప్రారంభం కానుంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 33 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. KNR ఎంపీ స్థానంలో 2019లో 69.52 శాతం పోలింగ్ నమోదవగా పెద్దపల్లిలో 65.59 శాతం నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.
➤KNR: MP ఎన్నికలు.. భారీ బందోబస్తు
➤అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
➤ధర్మపురి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు
➤UAEలో KNR జిల్లా యువకుడి మృతి
➤రామగుండం: ఎన్నికల విధులకు NCC క్యాడెట్లు
➤ఇష్టానుసారంగా పోస్టులు పెడితే చర్యలు: CP
➤శంకరపట్నంలో వడదెబ్బతో మహిళ మృతి
కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.