India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 11 గంటల వరకు ఇలా ఉన్నాయి.
చొప్పదండి-29.09%, హుస్నాబాద్-30.35%, హుజూరాబాద్-22.89%, కరీంనగరర్-20.78%, మానకొండూర్-24.96%, సిరిసిల్ల-27.80%, వేములవాడ-30.17శాతంగా ఉన్నాయి.
కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా ఉన్న పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందిని ఎన్నిక ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద సమస్యలు ఉన్నట్లయితే దృష్టికి తీసుకురావాలన్నారు. ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే అందుబాటులో ఉండే సమీప అధికారులకు తెలియజేయాలన్నారు.
ఎన్నికల్లో సాధారణంగా అభ్యర్థుల గెలుపోటములను యువ ఓటర్లు నిర్దేశించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 29.78లక్షల మంది ఓటర్లలో 23.50శాతం యువతే ఉన్నారు. 2014 KNR లోక్సభ స్థానంలో 72.23%, పెద్దపల్లిలో 71.68శాతంగా ఉంది. KNRలో 16,50,893 మంది ఓటర్లకు 11,46,467(69.45) మంది ఓటేశారు. పెద్దపల్లిలో 14,78,062 మందికి 9,67,801 మంది(65.48%) ఓటేశారు. అంటే రెండు చోట్లా 80%లోపే పోలింగ్ నమోదయింది.
కరీంనగర్లోని జ్యోతి నగర్లో గల సాధన హై స్కూల్లో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆయన సతీమణి అపర్ణతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారితో పాటు తల్లి, కుమారుడు ఓటు వేశారు. అంతకముందు మహాశక్తి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం జ్యోతినగర్లోని తన నివాసానికి వెళ్లి హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారిని దర్శించుకున్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 9 గంటల వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-12.12%, చెన్నూర్-9.49, ధర్మపురి-8.70%, మంచిర్యాల-10.49%, మంథని-102.%, పెద్దపల్లి-8.42%, రామగుండం-7.64శాతంగా ఉన్నాయి.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 9 గంటల వరకు ఇలా ఉన్నాయి.
చొప్పదండి-10.90%, హుస్నాబాద్-11.84, హుజూరాబాద్-9.45%, కరీంనగర్-10.23%, మానకొండూర్-10.06%, సిరిసిల్ల-7.23%, వేములవాడ-12.10శాతంగా ఉన్నాయి.
కరీంనగర్లోని ముకరంపురలో గల ఉర్దూ ఉన్నత పాఠశాలలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఆయన సతీమణి డాక్టర్ బోయినపల్లి మాధవితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారితో పాటు కుమారులు ప్రతీక్, ప్రణయ్ కోడలు హర్షిణి ఓటు వేశారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.
పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచిర్యాలలోని మార్కెట్ రోడ్లో ఉన్న పాఠశాలలో తన తల్లి సరోజ వివేకానందతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. కాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది.
లోక్సభ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి. ⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలింపు
⏵శాంతి భద్రతల ఆటంకం
⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం
⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ
⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం
⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు
⏵అసత్య వార్తలు వ్యాప్తి
Sorry, no posts matched your criteria.