India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను భద్రంగా తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఆదివారం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాలకు సంబంధించి, మానకొండూర్కు సంబంధించి కరీంనగర్లోని పాలిటెక్నిక్ కళాశాలలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బాధ్యతయుతంగా పనిచేయాలని అధికారులకు చెప్పారు.
నవమాసాలు మోసి అమ్మ జన్మనిచ్చి నిన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్క ఓటుతో ఉత్తమ నాయకుడిని ఎన్నుకొని బాధ్యత నెరవేర్చుకోలేమా..? తల్లి ప్రేమ వెలకట్టలేనిది, బాధ్యతగా జీవితమంతా వెంటే ఉంటోంది. మన ఓటుకూ వెలకట్టకపోతే వచ్చే ఐదేళ్లు మంచి పాలన అందుతోంది. అమ్మను ఆదర్శంగా తీసుకుందాం. ప్రేమలోనూ, బాధ్యతలోనూ. మన KNR జిల్లాలో 33,93,580 మంది ఓటర్లున్నారు. – నేడు మాతృ దినోత్సవం. రేపే మన బాధ్యతను నెరవేర్చుకుందాం.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రెండు నెలలుగా ప్రచార సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు నిర్వహించిన పార్టీలు ఎన్నికల నియమావళిని అనుసరించి నిలిపివేశాయి. కాగా పోలింగ్కు ముందు రోజు నాటికే ఓటర్లకు మద్యం, డబ్బులు పంపిణీ చేసేందుకు కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
గత నెల రోజుల నుంచి జరుగుతున్న లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్య పార్టీల ఎంపీ అభ్యర్థులతో పాటు ఆ పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు. ఇక మిగిలింది ప్రజల నిర్ణయమే. కాగా.. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బోయినపల్లి వినోద్ కుమార్-BRS, వెలిచాల రాజేందర్ రావు-కాంగ్రెస్, బండి సంజయ్-BJP బరిలో ఉన్నారు. మరి గెలుపెవరిదో చూడాలి.
గత నెల రోజుల నుంచి జరుగుతున్న లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్య పార్టీల ఎంపీ అభ్యర్థులతో పాటు ఆ పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు. ఇక మిగిలింది ప్రజల నిర్ణయమే. కాగా.. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి కొప్పుల ఈశ్వర్-BRS, గడ్డం వంశీ కృష్ణ-కాంగ్రెస్, గోమాస శ్రీనివాస్-BJP బరిలో ఉన్నారు. మరి గెలుపెవరిదో చూడాలి.
జీవనోపాధి కోసం ఎడారి దేశం వెళ్లిన యువకుడు మృతిచెందిన ఘటన భీమారం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మోత్కురావుపేట గ్రామానికి చెందిన గణేశ్(26) గత కొన్ని నెలల క్రితం అల్-ఎయిన్ (UAE)వెళ్ళాడు. అక్కడ ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో పడి మృతి చెందాడు. రెండురోజుల క్రితం స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గణేశ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. కమిషనరేట్కు చెందిన 2వేల మంది, 400 మంది కేంద్ర బలగాలు, 100 మంది ప్రత్యేక పోలీసుల బందోబస్తులో ఉన్నట్లు చెప్పారు. ఎన్నికలు జరిగే సమయంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా, ఓటర్లను తప్ప ఇతరులను లోనికి అనుమతించవద్దన్నారు.
కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,194 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. వీటిలో ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. 17,97,000 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషుల కంటే మహిళలు 40,000 మంది అధికంగా ఉన్నారని వివరించారు. 42 వేల మంది దివ్యాంగులు ఉన్నారని, వయోవృద్ధులు 13200 మంది ఉన్నారని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా పోలింగ్ అధికారుల థర్డ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల విద్యాధికారి (FAC ) బన్నాజీని సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్జేడి కే.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఇల్లంతకుంట మండల ఎంపీపీ నుంచి బన్నాజీ సన్మానం పొందారు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ RJDకి తెలియజేసారు. ఎన్నికల నియమనిబంధనలు బన్నాజీ ఉల్లంఘించడంతో సస్పెండ్ చేసినట్టు RJD తెలిపారు.
Sorry, no posts matched your criteria.