Karimnagar

News May 11, 2024

జగిత్యాల: BJP ఎంపీ ధర్మపురి అర్వింద్ పై కేసు

image

నిజామాబాద్ పార్లమెంట్ BJP అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హిందువులకు ప్రమాదకరంగా  మారాడన్నారు. జగిత్యాల ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అర్వింద్ మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. దీంతో ఎలక్షన్ ఇన్‌ఛార్జ్ విజయేందర్ ఫిర్యాదుతో కేసు చేశామన్నారు.

News May 11, 2024

ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి: కలెక్టర్

image

లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగించాలని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. గడువు ముగిసిన తర్వాత రాజకీయ అంశాలకు సంబంధించిన బల్క్ ఎస్ఎంఎస్‌లు పంపడం నిషేధమన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News May 11, 2024

మెజారిటీతో గెలిపించి కేసీఆర్‌కు బుద్ది చెప్పండి: బండి సంజయ్

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముస్లింలంతా ఒక్కటై బండి సంజయ్‌ను ఓడించాలంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. 20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను అవమానిస్తున్న కేసీఆర్‌ను ఓడించి హిందువుల సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్‌కు బుద్ది చెప్పండని అన్నారు.

News May 10, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*కమలాపూర్ మండలంలో విద్యుత్ వైర్లు తగిలి బొలెరో వాహనం దగ్ధం.
*సిరిసిల్లలో రోడ్ షోలో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్.
*కాంగ్రెస్ పార్టీకి ఉగ్రవాద సంస్థల మద్దతు: ఎంపీ అరవింద్.
*తంగళ్ళపల్లి మండలంలో మల్లన్న ఆలయంలో చోరీ.
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకుల విస్తృత ప్రచారం.
*కరీంనగర్లో రూ.88 వేల నగదు పట్టివేత.
*మెట్పల్లిలో ప్రచారం నిర్వహించిన ఎంపీ అరవింద్.

News May 10, 2024

కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు: సీపీ  

image

మే 11న సాయంత్రం 06 నుంచి మే 13న పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతా సహకరించాలని కోరారు.

News May 10, 2024

నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా: బండి సంజయ్

image

సిరిసిల్లలో నియోజకవర్గ పోలింగ్ ఏజెంట్ల సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశానికి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “హిందూ సమాజమంతా తన వెనుకుంది. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా.. కరీంనగర్‌లో వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్‌ను మూసేసి రాజకీయాల నుంచి తప్పుకునేందుకు నువ్వు సిద్ధమా?” అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని అన్నారు.

News May 10, 2024

సిరిసల్ల: బావిలో పడ్డ వ్యక్తి మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గడ్డి రమేష్(42) ఈనెల 8న మద్యం సేవించి ఇంటికి వస్తున్న క్రమంలో వ్యవసాయ బావిలో పడ్డాడు. భార్య స్వప్న వెతకగా ఆయన ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు బావిలో శవమై తేలాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేశారు.

News May 10, 2024

BREAKING.. హుజూరాబాద్ బస్టాండ్‌లో అమానవీయ ఘటన

image

హుజూరాబాద్ బస్టాండ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రోజుల వ్యవధి గల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదివెళ్లారు. కాగా, చనిపోయి చీమలు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, రెండ్రోజుల క్రితం వదిలివెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 10, 2024

మహాముత్తారం: అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

image

మహాముత్తారం మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జాడి కీర్తిబాయ్ గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె పార్థివ దేహానికి మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ శుక్రవారం నివాళులు అర్పించారు. అనంతరం కీర్తిబాయి అంతిమయాత్రలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొని పాడె మోశారు.

News May 10, 2024

మహాముత్తారం: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకురాలు మృతి

image

రోడ్డు ప్రమాదంలో మహాముత్తారం కాంగ్రెస్ మండల <<13216465>>అధ్యక్షురాలు <<>>మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఆమె కాంగ్రెస్‌ నాయకులతో కలిసి మహాముత్తారంలో కీర్తిబాయి(45) ప్రచారం నిర్వహించారు. అనంతరం పెగడపల్లిలో ప్రచారం నిర్వహించడానికి ఆమె భర్తతో కలిసి కారులో వెళ్తుండగా నిమ్మగూడెం వద్ద కారు అదుపుతప్పి మట్టి కుప్పను ఢీకొట్టింది. దీంతో కీర్తిబాయి అక్కడికక్కడే మృతిచెందారు.