Karimnagar

News June 4, 2024

కరీంనగర్: ప్రారంభమైన ఈవీఎంల కౌంటింగ్

image

కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. అనంతరం ఈవీఎంల కౌంటింగ్‌ను ఎన్నికల కౌంటింగ్ అధికారులు ప్రారంభించారు. ఈవీఏం మెషిన్లను ఓపెన్ చేసి వివిధ పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్లను నమోదు చేస్తూ కౌంటింగ్ ఏజెంట్లకు చూపుతున్నారు.

News June 4, 2024

కరీంనగర్: ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్, ఈటిపీబిఎస్ ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపును కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి పర్యవేక్షిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాగానే ఈవీఎంల లెక్కింపును చేపట్టమన్నారు.

News June 4, 2024

కరీంనగర్: ఎక్కడ చూసిన ఫలితాలపై చర్చే!

image

కరీంనగర్‌లో ఎవరు గెలుస్తారు…? పెద్దపల్లిలో ఎవరు గెలుస్తారు..? రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటూ పార్లమెంట్‌ ఫలితాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే ఫలితాలు తేలిపోనుండటంతో అందరిలో పార్లమెంట్‌ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఎక్కడ నలుగురు కలిసినా ఓట్ల లెక్కింపు, ఫలితాలపైనే చర్చించుకుంటున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు తుది ఫలితాలు వెలువడే అవకాశాలుంటాయి.

News June 4, 2024

KNR: నేటితో ఉత్కంఠకు తెర

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరి కొన్ని గంటల్లో తేలనుంది. సుమారు 21 రోజుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. కరీంనగర్‌లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను SRR కళాశాలలో లెక్కించనున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన 4 అసెంబ్లీ సెగ్మెంట్లను మంథని JNTU కళాశాలలో లెక్కించనుండగా.. మిగతా 3 అసెంబ్లీ సెగ్మెంట్లవి మంచిర్యాలలోని ఐజా కళాశాలలో లెక్కిస్తారు.

News June 4, 2024

కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వివరాలు

image

కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వివరాలు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్‌ను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్‌ను రామగిరి మండలం పన్నూరులోని జేఎన్టీయూ కళాశాలలో నిర్వహిస్తున్నారు. అలాగే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌ను డిచ్‌పల్లిలోని సీఎంసీ కళాశాలలో ఏర్పాటు చేశారు.

News June 3, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. @ గోదావరిఖనిలో రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ అధికారులు. @ వీర్నపల్లి మండలంలో ఉరి వేసుకుని యువతీ ఆత్మహత్య. @ సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి. @ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కోరుట్లలో కత్తిపోట్ల కలకలం.

News June 3, 2024

వీర్నపల్లి: ఉరేసుకుని యువతి ఆత్మహత్య

image

ఉరేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లాల్‌సింగ్ తండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూక్య సరస్వతి (18) అనే యువతి వ్యక్తిగత సమస్యలు తీర్చుకోలేకపోతున్నానని మనస్తాపం చెందింది. ఈ క్రమంలో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News June 3, 2024

కొండగట్టు అంజన్నకు టికెట్ల ఆదాయం రూ.1,51,38,490

image

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి పెద్ద జయంతి సందర్భంగా వివిధ టికెట్ల ద్వారా రూ.1,51,38,490 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. దీక్ష విరమణ టికెట్ల ద్వారా రూ.31,09,700, శీఘ్ర దర్శనం ద్వారా రూ.21,77,500, కేశఖండనం ద్వారా రూ.9,76,150, లడ్డు ప్రసాదం ద్వారా రూ.76,42,000, పులిహోర ప్రసాదం ద్వారా రూ.12,33,140 ఆదాయం సమకూరినట్లు వివరించారు. ఈ ఏడాది ఆదాయం పెరిగినట్లు పేర్కొన్నారు.

News June 3, 2024

RTV సర్వే: కరీంనగర్ బీజేపీ, పెద్దపల్లి కాంగ్రెస్!

image

కరీంనగర్ స్థానం బీజేపీదేనని RTV సర్వే తేల్చి చెప్పింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్‌రావు, బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్ బరిలో ఉన్నారు. పెద్దపల్లి స్థానంలో కాంగ్రెస్ గెలుపొందనుందని ఈ సర్వే పేర్కొంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గడ్డం వంశీకృష్ణ, బీజేపీ తరఫున గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ నిల్చున్నారు.

News June 3, 2024

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లెక్కింపు వివరాలు

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపును 162 రౌండ్లలో లెక్కించనున్నారు. నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 2,194 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి కోసం గాను 116 టేబుళ్లను సిద్ధం చేశారు. మొత్తం ఇక్కడ 28 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు.