India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మాజీ సీఎం కేసీఆర్ ఛలోక్తులు విసిరారు. కరీంనగర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ మాట్లాడే భాష ఏ భాషనో కూడా మనకు అర్థం కాదని అన్నారు. పార్లమెంటులో ఎప్పుడైనా బండి సంజయ్ మాట్లాడారా? అని ప్రశ్నించారు. మళ్లీ అలాంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపడం అవసరమా? అని కరీంనగర్ ప్రజలను ప్రశ్నిస్తున్నామన్నారు.
పాకిస్తాన్ను బూచిగా చూపి పదేళ్లుగా బీజేపీ రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ చిన్న దేశం.. ఒక్క జాఫట్ కొడితే 25 ఏళ్లు వాడు మన తెరువు రాడు అని అన్నారు. పాకిస్తాన్, పుల్వామా, మత రాజకీయం తప్పితే బీజేపీ చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు.
కారు బోల్తా పడి కాంగ్రెస్ నాయకురాలు మృతి చెందిన ఘటన BHPL జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం నిమ్మగూడెం వద్ద కారు బోల్తా పడి మహాముత్తారం మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు జాడి కీర్తిబాయి మృతి చెందింది. ఆమె భర్త రాజయ్యకు తీవ్ర గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం సిరిసిల్లలో పర్యటించనున్నట్లు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య తెలిపారు. సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రోడ్ షోలో పాల్గొంటారని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలకిషన్ అనే వ్యక్తి గురువారం ఉదయం చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మెట్ పల్లి పట్టణంలో బీజేపీ నాయకులు గురువారం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుసుకొని పలువురి కాళ్లు మొక్కుతూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొయ్యల లక్ష్మణ్, బొడ్ల ఆనంద్, సంకేత విజయ్ తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి గడువు 3 రోజులు మాత్రమే మిగిలింది. పోలింగ్కు 48 గంటల ముందే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతో ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 11న సాయంత్రం 5 గంటలతో ప్రచార పర్వానికి తెరపడనుంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను కలిసేలా తమ ప్రచారం తీరును మార్చుకుంటున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 4 రోజులు మోస్తరు వర్ష సూచన ఉందని జగిత్యాల పరిశోధన స్థానం ఏడీఆర్ డా.జి.శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించి ధాన్యం తడవకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా బుధవారం జగిత్యాల జిల్లా కథలాపూర్లో 42.3 డిగ్రీల సెల్సియస్, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 40.8, KNR జిల్లా జమ్మికుంటలో 40.7, సిరిసిల్ల జిల్లా నామాపూర్లో 40.0 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
పెద్దపల్లి లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఐదింటిలో సింగరేణి కార్మికులే అధికంగా ఉన్నారు. ఇప్పుడున్న నేతల భవిష్యత్ సింగరేణి కార్మికుల చేతుల్లోనే ఉంది. 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 28,829 మంది కార్మికులు, 15 వేల మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలతో కలిపితే
దాదాపు 1.80 లక్షల ఓట్లు ఉంటాయి. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థుల భవిష్యత్ కార్మికుల ఓట్ల పైనే ఉందని విశ్లేకుల అంచనా. దీనిపై మీ కామెంట్.
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న సాయంత్రం 6 గంటల నుంచి 13 రాత్రి ఎన్నికలు ముగిసే వరకు మద్యం దుకాణాలు, బార్లను వ్యాపారులు మూసి వేయాలని జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు సూచించారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు. నిబంధనలు అతిక్రమించి వ్యాపారం సాగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.