Karimnagar

News May 9, 2024

పెద్దపల్లి: సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్!

image

వేసవిలో ఎన్నికల నిర్వహణ అభ్యర్థులతో పాటు అధికారులకు సవాల్‌గా మారింది. మావోయిస్టు ప్రాంతమైన పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో మంథని, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ జరగనుంది. 2019లో ఇక్కడ 65.43 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2014లో ఇది 71.70 శాతంగా ఉంది. పోలింగ్ శాతం పెరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

News May 9, 2024

కరీంనగర్: 1,466 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు!

image

ఉమ్మడి జిల్లా పరిధిలోని KNR, PDPL, NZB లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 5,852 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇందులో 1,466 సమస్యాత్మక కేంద్రాలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. ఈ కేంద్రాల పరిధిలో గతంలో జరిగిన అలజడులు, నమోదైన కేసుల విషయంలో ఇటీవల కలెక్టర్లు, ఎస్పీలు సమీక్షించారు.

News May 8, 2024

కమలాపూర్: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ దేశరాజ్‌పల్లి గ్రామాల మధ్యలో బ్రిడ్జి సమీపంలోని పంట పొలాల వద్ద ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు. వారం రోజుల నుంచి ఆ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు గీతా కార్మికులు తెలిపారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించినట్లు పేర్కొన్నారు.

News May 8, 2024

జగిత్యాల: సివిల్ సప్లై కమిషనర్‌ను కలిసిన ఎస్పీ

image

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన కోసం బుధవారం జగిత్యాల జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌ను బుధవారం జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. గతంలో డిఎస్ చౌహన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేశారు.

News May 8, 2024

KNR: పురుగు మందు తాగిన మహిళ

image

మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామంలో సిరొంచ తాలూకా, పోచంపల్లికి చెందిన రామక్క అనే మహిళ కాళేశ్వరం గోదావరి వద్ద పురుగు మందు తాగి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో.. గోదావరి నుంచి తీరం వరకు ఎస్సై భవాని సేన ఎడ్ల బండి ద్వారా తీసుకువచ్చి అనంతరం మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు.

News May 8, 2024

బండి సంజయ్ గెలుపు ముందే నిర్ణయమైంది: మోదీ

image

కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ఇక్కడ ఎవరికీ తెలియని అభ్యర్థిని బరిలోకి దింపిందని వేములవాడ సభలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభావం ఏమాత్రం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఎలాంటి దర్యాప్తు చేయలేదని చెప్పారు. పీవీ నరసింహరావుకి భారతరత్న ప్రకటించి బీజేపీ గౌరవించిందని తెలిపారు.

News May 8, 2024

కరీంనగర్: తారాస్థాయికి ప్రచారం!

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఇంకా 3 రోజులే సమయం ఉండటంతో ప్రజలతో మమేకమవడం అభ్యర్థులకు కష్టంగా మారింది. KNR, PDPL లోక్‌సభ పరిధిలో 33.93 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా, సర్వే ఏజెన్సీలపై ఆధారపడుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో అభ్యర్థుల వాయిస్‌లతో ఓటర్లకు సందేశాలు పంపిస్తున్నారు. ‘హలో.. మీ ఓటు ఎవరికీ?’ అని ఫోన్ చేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు.

News May 8, 2024

కరీంనగర్: ఆన్‌లైన్ బెట్టింగ్.. తీస్తుంది ప్రాణం!

image

ఒకప్పుడు పట్టణాల్లో ఉండే ఆన్లైన్ జూదం ఆటలు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యంతో ఇప్పుడు గ్రామాల్లోకి చేరాయి. క్రికెట్ బెట్టింగ్, పేకాట, ఇతర ఆటల వల్ల యువకుల <<13198225>>ప్రాణాలను బలిగొంటూ<<>> కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి సాఫ్ట్వేర్ ఉద్యోగి రెండు రోజుల క్రితం ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News May 7, 2024

గోమాస శ్రీనివాస్‌ని పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలి: రాజస్థాన్ సీఎం

image

దేశ గౌరవాన్ని అత్యున్నత స్థానంలో నిలిపిన ప్రధాని మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని రాజస్థాన్ సీఎం బజన్ లాల్ శర్మ కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ లోక్ సభ ఎన్నికలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కి మద్దతుగా మంథని నియోజకవర్గంలో నిర్వహించిన జనసభకి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గోమాస శ్రీనివాస్‌ని పెద్దపల్లి ఎంపీగా, మోదీని మరోసారి దేశ ప్రధానిగా గెలిపించాలని కోరారు.

News May 7, 2024

వామ్మో.. 14 యూనిట్లకు రూ.60,701 కరెంటు బిల్లు!

image

మండుటెండలకు చెమటలు పట్టుడు ఏమో కాని ఈ కరెంట్ బిల్లు చూస్తే మాత్రం ముచ్చెమటలు పడతాయి. జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులోని ఓ షాప్ యజమానికి కరెంట్ బిల్లు చూడగానే షాక్ తగిలింది. తన షాపునకు ప్రతి నెల రూ.200 బిల్లు రాగా, ఇప్పుడు కేవలం 14 యూనిట్లకు ఏకంగా రూ.60,701 బిల్లు వచ్చిందని వాపోయారు. అధికారులు స్పందించాలని కోరారు.

error: Content is protected !!