Karimnagar

News June 1, 2024

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. శనివారం జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్ మండలం కోల్వైలో 45.5°C, ధర్మపురి మండలం జైనలో 45.3°C, కోరుట్ల మండలం ఐలపూర్ లో 45.0°C, రాయికల్ మండలం ఆల్లిపూర్‌లో 44.7°C, కోరుట్లలో 44.3°C, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట్ లో 44.6°C, కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండలం ఈదులగట్టుపల్లిలో 43.6°C, పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో 42.7°C ఉష్ణోగ్రత నమోదైంది.

News June 1, 2024

రామగుండం: తాను మరణిస్తూ.. చూపునిచ్చాడు!

image

రామగుండం NTPC అన్నపూర్ణ కాలనీకి చెందిన ఈదునూరి కిశోర్ వడదెబ్బతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ఫౌండేషన్ ప్రతినిధులు శ్రవణ్ కుమార్, లింగమూర్తి, సానా రామకృష్ణా రెడ్డి, రమేశ్, బీష్మాచారి, వాసు, చంద్రశేఖర్, శశికళ, శారద, లక్ష్మీనారాయణ ఉన్నారు.

News June 1, 2024

పెద్ద జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

image

కొండగట్టు అంజన్న క్షేత్రంలో జరుగుతున్న పెద్ద జయంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ముందుగా స్థానిక హరిత హోటల్‌లో నేసిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే స్వామివారికి సమర్పించారు. అనంతరం యాగశాలలోని వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని తిలకించారు. అర్చకులు ఆశీర్వదిoచి, తీర్థ ప్రసాదం అందజేశారు. ఇక్కడ ఎంపీపీ రవళి, ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, సతీశ్ రెడ్డి, అనిల్ ఉన్నారు.

News June 1, 2024

కరీంనగర్: ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. KNR, PDPL పరిధిలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. కాగా ఎవరికే వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ద్వారా గెలుపు ఓటములపై ఓ అంచనాకు రానున్నారు. దీని ద్వారా తీవ్ర ఉత్కంఠకు కొంత తెరపడనుంది. ఓటరు నాడీ తెలియాలంటే ఈనెల 4 వరకు వేచిచూడాల్సిందే.!

News June 1, 2024

కరీంనగర్: ఓకే రోజు నలుగురి మృతి

image

జిల్లాలో శుక్రవారం వడదెబ్బతో నలుగురు మృతి చెందారు. వివరాలిలా.. వీణవంక మండలానికి రామక్క(72) వడ దెబ్బతో శుక్రవారం సాయంత్రం మృతి చెందగా, ధర్మారం(M) బొట్లవనపర్తికి చెందిన అమృతవ్వ(65) నిన్న మధ్యాహ్నం బయటకి వెళ్లింది. ఈక్రమంలో ఎండ తీవ్రత తట్టుకోలేక అస్వస్థతకు గురైంది. గమనించిన వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. చొప్పదండిలో ఓ లారీ డ్రైవర్‌, ఎన్టీపీసీకి చెందిన కిషోర్‌(36) మృతి చెందాడు.

News June 1, 2024

కౌంటింగ్: కరీంనగర్‌‌లో 153 రౌండ్లు

image

కరీంనగర్‌ లోక్‌సభ స్థానం ఓట్ల లెక్కింపునకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్‌‌ నియోజకవర్గాల్లో మొత్తం 116 టేబుళ్లు, 153 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తవుతుంది. 8AM నుంచి SRR కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫలితాలు బయటకు కనిపించేలా LED స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

News June 1, 2024

కొండగట్టు: పెద్ద హనుమాన్ జయంతికి ఘనంగా ఏర్పాట్లు

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామివారి పెద్ద జయంతి నేపథ్యంలో దేవాదాయశాఖ అధికారులు ఆలయ ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులు, మాలాధారులు వేలాదిగా ఆలయానికి తరలిరానుండటంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. కలెక్టర్ యాస్మిన్‌బాష ఏర్పాట్లను పర్యవేక్షించారు.

News May 31, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కొండగట్టులో వైభవంగా కొనసాగుతున్న పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు. @ జగిత్యాల జిల్లాలో అత్యాచారానికి పాల్పడిన ఇరువురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. @ వేములవాడలో ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ కోనరావుపేట మండలంలో గుండె పోటుతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి. @ కొండగట్టులో పర్యటించిన జగిత్యాల కలెక్టర్. @ జగిత్యాలలో ఎండవేడికి మంటలు చెలరేగి 20 బైకులు దగ్ధం.

News May 31, 2024

KNR: ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. శుక్రవారం కమాన్‌పూర్‌లో 47.1°C, ముత్తారంలో 46.6°C, మంథనిలో 46.4°C, రామగుండంలో 46.2°C, ధర్మపురి మండలం నేరేళ్లలో 46.4°C, ఇబ్రహీంపట్నం మండలం గోధూర్‌లో 46.3°C, జమ్మికుంటలో 46.0°C, సిరిసిల్లలో 44.7°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News May 31, 2024

BREAKING: టెస్కాబ్ ఛైర్మన్ రాజీనామా

image

టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావు తన పదవికి రాజీనామా చేశారు. సహకార సంఘంలో కొంత మంది కాంగ్రెస్‌లో చేరిన కారణంగానే తాను ఈ పదవిలో కొనసాగలేనని చెప్పుకొచ్చారు. అయితే కొద్దిరోజుల క్రితం టెస్కాబ్ డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చారు. ఈ క్రమంలో అవిశాస్వ తీర్మానానికి ముందే రవీందర్‌రావు రాజీనామా చేయడం గమనార్హం.