Karimnagar

News May 1, 2024

రామడుగు: వడదెబ్బతో ఐదేళ్ల బాలుడు మృతి

image

రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన కళ్లెం అంజయ్య పుష్ప దంపతుల కుమారుడు యశ్వంత్ (5) వడదెబ్బతో మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ప్రకారం రోజువారీ లాగే ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న యశ్వంత్ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడి మృతిచెందినట్లు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన అంజయ్య పుష్ప దంపతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

News May 1, 2024

జగిత్యాల: కత్తితో కోడల్ని చంపిన మామ

image

కుటుంబ కలహాలతో కత్తితో మామ కోడల్ని చంపిన ఘటన జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రేచపల్లి గ్రామానికి చెందిన మౌనిక(కోడలు)ను మామ రాజిరెడ్డి మటన్ కొట్టే కత్తితో గొంతు కోసి పారిపోయాడు. కాగా, నిందితుడికోసం పోలీసులు వెతుకుతున్నారు. మృతురాలి భర్త విదేశాలలో ఉన్నాడు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 1, 2024

కేసులు పెడితే భయపడేది లేదు: రేవంత్ రెడ్డి

image

కేంద్ర ప్రభుత్వం తనపై కేసులు పెడితే భయపడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోరుట్ల పట్టణ శివారులో జరిగిన జన జాతర సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తన వెనుక నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చిన, రిజర్వేషన్లు రద్దు చేసిన ఊరుకునేది లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.

News May 1, 2024

కోరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి

image

కోరుట్ల శివారులో నిర్వహిస్తున్న జన జాతర బహిరంగ సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు, సీనియర్ నాయకులు కృష్ణారావు, కొమిరెడ్డి కరంచంద్, తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం సభలో పాల్గొన్న సీఎం.. ముందుగా కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు.

News May 1, 2024

కరీంనగర్: ప్రచారానికి వడదెబ్బ!

image

లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వడదెబ్బ తగిలింది. KNR, పెద్దపల్లి నియోజకవర్గాల్లో రోజూ ఉదయం 6-10 గంటల వరకు, సాయంత్రం 6-10 రాత్రి గంటల వరకు వివిధ పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారు. సగటున రోజుకు 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉండటంతో మధ్యాహ్నం పార్టీ ఆఫీసులకు పరిమితమై కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ప్రచారానికి ఇంకా 11 రోజులే ఉండటంతో జనాల్లోకి మరింత ఎక్కువగా వెళ్లాలని యోచిస్తున్నారు.

News May 1, 2024

KNR: సీఎం సభకు వెళ్లి.. వడదెబ్బతో మహిళ మృతి

image

జమ్మికుంటలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభకు వెళ్లి వడదెబ్బతో మహిళ మృతి చెందిన ఘటన వీణవంక మండలం రెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ జనజాతర సభకు మంగళవారం వెళ్లారు. ఈ క్రమంలో ఆమె వడదెబ్బకు గురయ్యారు. దీంతో ఆమె మృతిచెందారు. వారి కుటుంబసభ్యులను హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ప్రణవ్ పరామర్శించారు. కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్నిరకాలుగా ఆదుకుంటామన్నారు.

News May 1, 2024

నేడు కోరుట్లకు సీఎం రేవంత్ రెడ్డి

image

కోరుట్ల పట్టణంలోని పశువైద్య కళాశాల సమీపంలో నేడు జరుగనున్న జన జాతర ఎన్నికల ప్రచార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి మద్దతుగా నిర్వహించే సభలో సీఎం పాల్గొంటారని ఎమ్మెల్సీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News May 1, 2024

సిరిసిల్ల: సెలవులు ముగిసేలోగా పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

సెలవులు ముగిసేలోగా మరమ్మతు పనులు పూర్తి చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. వేములవాడ మండలం వట్టెంల, ఫాదర్ నగర్ గ్రామాలలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చేపట్టనున్న మరమ్మతు పనుల మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మ ఆదర్శ పాఠశాల కింద తరగతి గదులు మరుగుదొడ్లు మరమ్మతుల పనులు చేయించాలని అధికారులకు ఆయన సూచించారు.

News May 1, 2024

సిరిసిల్ల: పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: నికోలస్

image

గ్రూప్ 1 పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి నికోలస్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నోడల్ అధికారులు, పోలీసు నోడల్ అధికారులతో హైదరాబాదు నుంచి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జూన్ 9న జరగనున్న గ్రూప్ 1 పరీక్షకు అన్నిమౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

News April 30, 2024

కరీంనగర్: ‘అంజన్నకు ఆస్తులు రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు’

image

సిద్దిపేట జిల్లా కోడూరు మండలంలోని అలిపూర్ గ్రామానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి తన ఆస్తులను కొండగట్టు ఆంజనేయస్వామికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. కని పెంచిన కొడుకులు సరిగ్గా చూసుకోవడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కాగా తన ఆస్తులను ఆంజనేయ స్వామి పేరిట పట్టా చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరాడు.