India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం వర్గానికి దాఖలైన నామినేషన్ల నుండి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేల సత్పతి సోమవారం తెలిపారు. రాజ్యాధికార పార్టీ అభ్యర్థి ఆరెల్లి సుమలతతో పాటు స్వతంత్ర అభ్యర్థులైన పిడిశెట్టి రాజు, పచ్చిమట్ల రవీందర్, ఎండి జిషన్, గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని అడవి రేగుంట గ్రామానికి చెందిన రాజారెడ్డిపై కొడుకు శేఖర్ సోమవారం పారతో తలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన రాజారెడ్డిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో ఇద్దరు రాజకీయ నాయకుల వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పెద్దపల్లి బరిలో మాజీ ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కరీంనగర్లో మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ రాజేందర్ రావు కాంగ్రెస్ నుంచే బరిలో ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు ఉమ్మడి జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు నిర్వహించిన తనిఖీలలో రూ.9.71 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ. 71లక్షలకు మాత్రమే ఆధారాలు చూపించి వెనక్కి తీసుకున్నారు. బంగారం, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నారు.
ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని యువకుడు బానోత్ అనిల్ (26) శనివారం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు అనిల్ ఆచూకీ కోసం వెతికే క్రమంలో ధర్మారం గ్రామశివారులోని ఊరకుంట చెరువులో అతడి మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగి చనిపోయినట్లు మృతుడి తల్లి బానోతు చిన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ టి.సత్యనారాయణ తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో ఈరోజు తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 3 గంటల వరకే సమయం ఉంది. దీంతో బరిలో ఎవరు ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారో వెల్లడి కానుంది. 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్లో 53 మంది, పెద్దపల్లికి 63 మంది, నిజామాబాద్లో 42 మంది నామపత్రాలు దాఖలు చేశారు. 114 మందిలో తుది పోటీలో ఎవరు ఉంటారో మరికొద్ది గంటల్లో తేలనుంది.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.1,81,459 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ98,542, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.62,880, అన్నదానం రూ.20,037, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్కు చెందిన మట్ట సురేశ్ రెడ్డి- దీప్తి దంపతులు నిర్మల్ జిల్లాలోని బంధువుల ఇంటికి ‘ఆడెల్లి పోచమ్మ’ బొనాల పండగకు వెళ్లారు. అది ముగించుకుని తిరుగు పయనమయ్యారు. డిచ్పల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇందులో దీప్తి మృతిచెందగా.. సురేశ్ గాయాలతో బయటపడ్డారు.
జగిత్యాల జిల్లాలో సూర్యుడు భగభగ మండుతున్నాడు. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని వెల్గటూర్ మండల కేంద్రంలో నేడు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వెల్గటూర్కు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీచేసింది. ఎండల నేపథ్యంలో ఉదయం 10 నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. అటు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎంపీ నామినేషన్ల ఉపసంహరణకు రేపటితో చివరి గడువు అని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్ణీత నమూనా 5లో కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలన్నారు. 3గంటల తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే దరఖాస్తులను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.