India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి, స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వేములవాడ రాజన్న స్వామివారికి పేరుంది.
కొడుకుని తండ్రి <<13131085>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం ప్రకారం.. చింతకుంటకు చెందిన శ్రీనివాస్ కొడుకు శివసాయి(21) HYDలో ఉద్యోగం చేస్తున్నాడు. శివసాయి ఇంటికి రావడంతో, ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టొద్దని తండ్రీకొడుకుల మధ్య వాదన చోటుచేసుకుంది. ఈక్రమంలో భూమి అమ్మాలంటూ తండ్రిపై ఒత్తిడి తేవడంతో శుక్రవారం కొడుకు నిద్రిస్తున్న సమయంలో కారం చల్లి, రోకలి బండతో మోది హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు.
ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించాడు. ఇటీవల బదిలీపై తాడువాయి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం వేకువ జామున మూడు గంటల ప్రాంతంలో కారులో కామారెడ్డికి వెళ్తుండగా, కారు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు.
లంచం తీసుకుంటూ ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్ పట్టుబడ్డిన విషయం తెలిసిందే. దీంతో కరీంనగర్లోని గంగాధర ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ సురేశ్బాబు నివాసంలో శనివారం అనిశా అధికారులు సోదాలు జరిపారు. రూ.12.30 లక్షల నగదు, 350 గ్రాముల బంగారు ఆభరణాలు గుర్తించారు. ఇంకా ఏమైనా ఆస్తులకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీశారు.
జగిత్యాల జిల్లా యువకుడు, శ్రీలంక యువతి మధ్య చిగురించిన ప్రేమ మూడుముళ్ల బంధంగా మారింది. మేడిపల్లికి చెందిన అశోక్ పదేళ్ల కిందట జోర్దాన్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో స్టోర్ మేనేజర్ గా పనిచేస్తున్న సమయంలో శ్రీలంకకు చెందిన సమాన్వితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో హిందూ సంప్రదాయబద్ధంగా ఏకమయ్యారు.
నిర్దేశిత వైద్య సేవలు ప్రజలకు సకాలంలో అందించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వైద్యశాఖ పనితీరుపై శనివారం ఆయన రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అధిక ప్రసవాలు జరిగే విధంగా వైద్య సిబ్బంది ప్రణాళికబద్ధంగా పనిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
@ కమాన్పూర్ మండలంలో షార్ట్ సర్క్యూట్ తో గుడిసె దగ్ధం. @ వేములవాడ రాజన్నను దర్శించుకున్న పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి. @ కరీంనగర్ పార్లమెంటు లో 20 మంది నామినేషన్ల తిరస్కరణ. @ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్ కెమెరాల నిషేధం: పోలీస్ కమిషనర్. @ మే 1న కోరుట్ల బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. @ కోరుట్లలో సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన జగిత్యాల ఎస్పీ.
భార్య కాపురానికి రావడంలేదని భర్త సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని గూడురుకు చెందిన చెక్కపల్లి నర్సింహులు (45) తాగుడుకు బానిసయ్యాడు. దీంతో అతని భార్య పిల్లలతో ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్రమనస్తాపం చెందిన నర్సింహులు ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, BRSనేతల తీరుపై కరీంనగర్ MPబండి సంజయ్ విరుచుకుపడ్డారు. 6గ్యారంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇరుపార్టీల నేతలు డ్రామాలాడుతూ మీడియాలో బ్రేకింగ్ల కోసం యత్నిస్తున్నారని మండిపడ్డారు. 100రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు.
వచ్చే 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడగాలులు వీస్తాయని, ఉ. 11 నుంచి సా.4 వరకు బయటకు రావొద్దని సూచించింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినట్లు తెలిపింది.
Sorry, no posts matched your criteria.