Karimnagar

News April 27, 2024

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. కేటీఆర్ ట్వీట్

image

BRS ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘రెపరెపలాడే గులాబీ పతాకం.. తెలంగాణ ఎగరేసిన జయ కేతనం. మనమే తెలంగాణ దళం. మనమే తెలంగాణ గళం. జెండా మోసి.. జంగ్ చేసిన లక్షలాది కార్యకర్తలే బలం..బలగం. కంటికి రెప్పలా పార్టీని కాపాడుకున్న మీ పట్టుదలకు.. మీ శ్రమకు.. మీ కృషికి.. సదా సలాం..! BRS కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.

News April 27, 2024

మే 1న జగిత్యాల జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి 

image

 సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల జిల్లాకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల తరఫున నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొంటారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కోరుట్లలో మే 1న ఉదయం 11 గంటలకు, ధర్మపురిలో మే 3న ఉదయం 11 గంటలకు బహిరంగ సభలు ఉంటాయని పేర్కొన్నారు.

News April 27, 2024

కరీంనగర్: కొడుకును హత్య చేసిన తండ్రి

image

కొడుకును ఓ తండ్రి హత్యచేశాడు. KNR జిల్లా కొత్తపల్లి PS పరిధిలో జరిగింది. చింతకుంట గ్రామానికి చెందిన శివ సాయి(21) HYDలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల క్రితం ఇంట్లో శుభకార్యానికి వచ్చిన సాయిని కన్నతండ్రి శ్రీనివాస్(50) శుక్రవారం ఉదయం కళ్ళల్లో కారం చల్లి, రోకలి బండతో తలపై కొట్టి హత్యచేశాడు. అనంతరం నిందితుడు కొత్తపల్లి PSలో లొంగిపోయాడు. కేసు నమోదైంది. వివరాలు తెలియాల్సి ఉంది.

News April 27, 2024

కరీంనగర్: 20 మంది నామినేషన్ల తిరస్కరణ

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన 20 మంది నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మొత్తం 53 మంది అభ్యర్థులు నామినేషన్లను సమర్పించినట్లు చెప్పారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 33 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా.. 20 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు వివరించారు.

News April 27, 2024

JGL: MP ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ పూర్తి: కలెక్టర్

image

లోకసభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ పూర్తిచేసినట్లు జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా శుక్రవారం తెలిపారు. కలెక్టరేట్‌లో ఎన్నికల వ్యయ పరిశీలకుల సమక్షంలో పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ నిర్వహించారు. జిల్లాపరిధిలోని 930 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బందిని కేటాయించామన్నారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు నింజే, అడిషనల్ కలెక్టర్లు దివాకర, రాంబాబు తదితరులున్నారు.

News April 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మంథని మండలంలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు. @ మల్హర్ మండలంలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు. @ బోయిన్పల్లి మండలంలో ఈతకు వెళ్లి బాలుడు మృతి. @ బిఆర్ఎస్ శవ రాజకీయాలు చేస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. @ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న రామగుండం పోలీస్ కమిషనర్. @ మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాలలో ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి.

News April 26, 2024

ముస్తాబాద్: రోడ్డు ప్రమాదంలో మాజీ కార్యదర్శి మృతి

image

రోడ్డు ప్రమాదంలో మాజీ కార్యదర్శి మృతిచెందిన ఘటన ముస్తాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి అబ్రవేణి సాయిలు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 26, 2024

నేరెళ్లలో దగఢ్.. దగఢ్

image

ఎండాకాలం నేపథ్యంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో జగిత్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధర్మపురి మండలం నేరెళ్లలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకే 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నేరెళ్ల రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని కోరుతున్నారు.

News April 26, 2024

చట్ట వ్యతిరేఖ చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదు: సీపీ

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతూ నేరాల నియంత్రణకై పటిష్టమైన చర్యలు చేపడతామని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, పిడిఎస్ రైస్, ఇసుక అక్రమ రవాణా, నకిలీ విత్తనాల అక్రమ రవాణా, పేకాట, కోడి పందాలు ఆడేవారిపై, గుడుంబా తయారీపై నిఘా పెట్టామని పేర్కొన్నారు.

News April 26, 2024

KNR: ఇంటర్ ఫలితాల్లో కవలల అదరహో

image

ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కవలలు( అక్కా చెల్లెళ్లు) ప్రతిభ చూపారు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లోని తెలంగాణ గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. ఎంపీసీ చదువుతున్న శార్వాణి 470 మార్కులకు 465 మార్కులు సాధించగా.. బైపీసీ చదువుతున్న ప్రజ్ఞాని 440 మార్కులకు 436 మార్కులు సాధించారు. దీంతో వీరిని కళాశాల ప్రిన్సిపల్ దేవేందర్ అభినందించారు.