India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులు ఎప్పుడు మంజూరు చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా1947 రేషన్ షాపులు ఉండగా 9,80,261 ఆహారభద్రత కార్డులు ఉండగా 28,24,897 మంది కుటుంబ సభ్యులు రాయితీతో కూడిన లబ్ధి పొందుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బండి సంజయ్కు ఎంపీ ఎన్నికలు కలిసొస్తాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్ 2019లో ఎంపీగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోగా 89,016 ఓట్లు పోలయ్యాయి. అయితే ఈసారి కూడా ఎంపీగా గెలుస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో త్రిముఖ పోటీ ఉండగా బండి సంజయ్ గెలుస్తారో లేదో వేచి చూడాలి.
నకిలీ, కల్తీ విత్తనాలు స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతామని ఆదివారం రామగుండం సీపీ శ్రీనివాస్ హెచ్చరించారు . వ్యవసాయ, ప్రభుత్వ శాఖల సిబ్బందితో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని సీపీ తేల్చిచెప్పారు.
@ చందుర్తి మండలంలో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ తంగళ్ళపల్లి మండలంలో కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రుల అరెస్ట్. @ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల ఎస్పీ. @ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్ పల్లి మండలంలో వైభవంగా ప్రారంభమైన కొండస్వామి బ్రహ్మోత్సవాలు. @ కొడిమ్యాల మండలంలో లారీ, పాల వ్యాన్ డీ.. ఒకరి మృతి.
జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. సరిగ్గా మరో 15 రోజుల్లో మన ఎంపీ ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ, ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు పలుపార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారు. – మరి మీ MP ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..
కన్నకూతురిని హత్యచేసిన తల్లిదండ్రుల్ని రిమాండ్కు తరలించామని SP అఖిల్ మహాజన్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన చెప్యాల ఎల్లవ్వ- నర్సయ్య దంపతులకు కూతురు ప్రియాంక ఉంది. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఆమె ప్రవర్తన తీరుపై కోపగించుకున్న తల్లిదండ్రులు ఈనెల 14న ఆమెను హత్యచేశారు. ఆదివారం నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే మృతురాలికి పెళ్లై, 13 నెలల బాలుడు ఉండటం గమనార్హం.
తల్లి మందలించిందని ఓ యువతి గడ్డి మందు తాగి మృతి చెందింది. స్థానికుల వివరాలు.. కమాన్పూర్ మం. బురకాయ పల్లె గ్రామానికి చెందిన బొడ్డుపల్లె సింధు(19)ను ఈ నెల 14న ఇంట్లో చెప్పిన పని చేయడం లేదని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో డబ్బులు దండుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిన ఓ యువతిపై LMD పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. తిమ్మాపూర్కు చెందిన నాగరాజు యోగ నిమిత్తం ఈశా ఫౌండేషన్కు వెళ్లగా అక్కడ వైజాగ్కు చెందిన సంధ్య ప్రియాంకతో పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నుంచి రూ. 16లక్షలు యువతి తన బంధువుల ఖాతాలోకి బదిలీ చేయించుకుంది. యువకుడు ఫినాయిల్ తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (ఎప్సెట్) ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు మెరిశారు. కరీంనగర్కు చెందిన మునీశ్వరి-చంద్రశేఖర్ రెడ్డిల కూతురు వి.హాసిని 144 ర్యాంకు, రజిని-శ్రీనివాస్ల కుమారుడు ఎన్. హేమంత్ 157వ ర్యాంకు, గంగాధరకు చెందిన ధనలక్ష్మి-పవన్ల కూతురు బొడ్ల ఆశ్రిత 220 ర్యాంకు సాధించారు. ఉన్నత విద్య అభ్యసించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈవీఎంను భద్రపర్చిన స్ట్రాంగ్రూం లను రాష్ట్ర ఎన్నికల డిప్యూటీ ప్రధాన అధికారి మురళీ మోహన్ రావు పరిశీలించారు. శనివారం రామగిరిలోని సెంటినరీకాలనీలో ఉన్న జేఎన్టీయూ మంథని కళాశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి తనిఖీ చేశారు. రామగుండం, మంథని, ధర్మపురి, పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన స్ట్రాంగ్ రూంలకు వేసిన సీల్లను పరిశీలించి సంబంధిత రిజిస్టర్లో సంతకం చేశారు.
Sorry, no posts matched your criteria.