Karimnagar

News April 25, 2024

కరీంనగర్: బి ఫారం అందుకున్న వెలిచాల రాజేందర్ రావు

image

కరీంనగర్ లోక్ సభ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావుని అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ బి ఫారం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ప్రణవ్ బాబు పాల్గొన్నారు.

News April 25, 2024

కరీంనగర్: పెళ్లైన మరుసటి రోజు రోడ్డు ప్రమాదం.. నవ వధువు మృతి

image

రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి చెందిన ఘటన కరీంనగర్‌‌లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన స్వాతికి ఆదివారం వివాహం జరిగింది. సోమవారం వేములవాడకు వెళ్తున్న క్రమంలో కరీంనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తలకి బలమైన గాయం కావడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 25, 2024

గోదావరిఖని: వేధింపులు భరించలేక యువకుని ఆత్మహత్య

image

వేధింపులకు గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన GDKలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. సీతానగర్‌కు చెందిన చందా ప్రసాద్ తన మిత్రుడు సతీశ్‌కు సింగరేణి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.3 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం లేక, డబ్బులు ఇవ్వకపోవడంతో సతీశ్ కుటుంబ సభ్యులు ప్రసాద్ పై వేధింపులకు గురి చేశారు. దీంతో మనస్తాపం చెందిన ప్రసాద్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 25, 2024

కొండగట్టు: చిన్న జయంతి ఆదాయం 1.54 కోట్లు

image

చిన్న జయంతి ఉత్సవాల సందర్బంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి రూ.1,54,13,395 ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. దీక్ష విరమణ ద్వారా రూ.36,60,600, కేశఖండనము టికెట్స్ ద్వారా రూ.12,01,550, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.16,52,300 లడ్డు విక్రయాల ద్వారా రూ.74,12,825, పులిహోర ద్వారా రూ.14,86,120 వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఆదాయం పెరిందన్నారు.

News April 25, 2024

జూన్ 6 తర్వాత పేదలకు ఇళ్లు: మంత్రి శ్రీధర్‌బాబు

image

ఇళ్లు లేని పేదలకు జూన్ 6 తర్వాత ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ కూలిపోతే బీఆర్ఎస్ నాయకత్వం బాధ్యతారహితంగా మాట్లాడుతూ.. కూలుతూనే ఉంటాయి.. నడుస్తూనే ఉంటాయని అనడం ఏంటని మండిపడ్డారు. కమీషన్లు తీసుకొని నిసిరకంగా నిర్మించిన కారణంగానే కూలుతున్నాయని ఆరోపించారు.

News April 25, 2024

రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన బండలింగాపూర్ వాసి

image

మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన కూకట్ల వేణుగోపాల్, స్రవంతిల కూతురు కూకట్ల వైష్ణవి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి సత్తా చాటింది. 440 మార్కులకు గానూ ఆమె 438 మార్కులు సాధించింది. అలాగే మెట్‌పల్లికి చెందిన ముక్క మృత్యుంజయ్, సంధ్యారాణిల కూతురు ముక్క హర్షిని ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి సత్తా చాటింది. వారిని పలువురు అభినందించారు.

News April 25, 2024

KNR: గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

image

సుల్తానాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 18న అల్పాహారం వికటించడంతో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అభివృద్ధి అధికారి నివేదిక అందించిన ప్రకారం ప్రిన్సిపాల్ అలసత్వం ఉందని ప్రాథమికంగా భావించిన కలెక్టర్ ప్రిన్సిపాల్ ఎస్. సత్య ప్రసాద్ రాజ్‌ను సస్పెండ్ చేశారు.

News April 25, 2024

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫైల్

image

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావును ఆ పార్టీ ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించింది. ఆయన తండ్రి జగపతిరావు కరీంనగర్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజేందర్‌ రావు గతంలో కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. కొంతకాలం ప్రజారాజ్యం, బీఆర్ఎస్‌లో ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారు. కాగా రాజేందర్ రావు ఇప్పటికే కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు.

News April 25, 2024

KNR: రేపే బండి సంజయ్ నామినేషన్

image

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రేపు ఉదయం 11.30 గంటలకు కరీంనగర్ ఎంపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లోని SRR కాలేజీ నుంచి గీతా భవన్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధం అయ్యాయి.

News April 25, 2024

KNR: ఈతకు వెళ్లి తండ్రీ కొడుకుల మృతి

image

KNR జిల్లా తిమ్మాపూర్ మండలంలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రి కొడుకులు మృతి చెందారు. స్థానికుల ప్రకారం.. వచ్చునూర్ శివారులోని లోయర్ మానేరు డ్యాంలో ఈతకు వెళ్లిన తండ్రి కొడుకులు నీటిలో మునిగి మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గుండ్లపల్లిలోని ఎస్ ఆర్ కే ప్రైవేట్ స్కూల్ యజమాని చాడ రవీందర్ రెడ్డి ఆయన కొడుకుగా అనుమానిస్తున్నారు.