Karimnagar

News April 25, 2024

రాజారాం గ్రామంలో యువకుడి మృతదేహం కలకలం

image

యువకుడిని తీవ్రంగా కొట్టి హత్య చేసి నిప్పు పెట్టిన ఘటనా మల్యాల మండలం రాజారాంలో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం రాజారాం శివారులో సగం కాలిన యువకుడి మృతదేహం ఉన్నట్లు గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో భార్య జమున మృతదేహాన్ని గుర్తించి తన భర్త మహిపాల్‌దేనని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News April 25, 2024

ఎల్లారెడ్డిపేట: మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి పై కేసు నమోదు

image

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అమాయక ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడటంతో అతనిపై కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గ్రామానికి చెందిన దీకొండ సునీల్ అనే వ్యక్తి యూనిక్ ఎస్ఎంసిఎస్ అనే సంస్థ పేరుతో 800 మంది వద్ద డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు. బాధితులు ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని తెలిపారు.

News April 25, 2024

కొండగట్టు కాషాయమయం.. భారీగా చేరుకున్న భక్తజనం

image

కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి కొండగట్టుకు దీక్షాపరులు, సాధారణ భక్తులు భారీగా చేరుకుంటున్నారు. మంగళవారం రాత్రి కొండపై ఇసుక వేస్తే రాలనంత రద్దీ నెలకొంది. రద్దీని కంట్రోల్ చేయడం కష్టమైంది. స్వామివారి దర్శనం, మాలవిరమణ, కళ్యాణకట్ట వద్ద గంటల సమయం పడుతోంది. ఇప్పటికి రెండు లక్షల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా.

News April 25, 2024

ఓదెల: మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం!

image

ఓదెల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని యువతిపై అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు మంగళవారం అత్యాచారం చేసినట్లు సమాచారం. యువతి కుటుంబ సభ్యులు పనికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈమేరకు పోత్కపల్లి పోలీసులు వృద్ధుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం

News April 25, 2024

ఉమ్మడి KNR జిల్లాలో 68,400 మంది ఇంటర్ విద్యార్థులు

image

నేడు వెలువడనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షల ఫలితాల కోసం ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా సుమారు 68,400 మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరంలో 33,756 మంది, ద్వితీయ సంవత్సరంలో 34,660 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. కొందరు గైర్హాజరయ్యారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 127 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి.

News April 25, 2024

KNR: 30 నుంచి బీఫార్మసీ పరీక్షలు

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే బీఫార్మసీ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 30న, తృతీయ, నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 1 నుంచి ప్రారంభమవుతున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వి శ్రీరంగ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల కాల పట్టికను యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

News April 25, 2024

జగిత్యాల జిల్లా స్పెషల్.. ముగ్గురు ఎంపీలు

image

జగిత్యాల జిల్లా మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉంది. మొత్తం 20 మండలాలు, 5 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో, చొప్పదండి సెగ్మెంట్‌లోని మల్యాల, కొడిమ్యాల, వేములవాడ సెగ్మెంట్‌లోని కథలాపూర్, మేడిపల్లి మండలాలు కరీంనగర్ ఎంపీ పరిధిలోకి వస్తాయి. ఇక ధర్మపురి నియోజకవర్గం పెద్దపల్లి లోక్ సభ స్థానం పరిధిలో ఉంది.

News April 25, 2024

KNR: రూ.10 కాయిన్స్‌తో నామినేషన్ వేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి

image

కరీంనగర్ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు పేరాల మానస రెడ్డి డిపాజిట్ రూపంలో పది రూపాయల కాయిన్స్‌తో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇంటి నుంచి గంపలో తీసుకొచ్చిన రూ.25 వేల నాణేలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేసింది. తన అఫిడవిట్ సమర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి సమర్పించారు.

News April 25, 2024

KNR: మానసిక సమస్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్

image

విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎవరైనా మానసిక ఆందోళనలు లేదా మానసిక ఒత్తిడికి గురి అయినప్పుడు మానసిక వైద్యుడిని సంప్రదించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత సూచించారు. చిరాకు పడడం, ఆసక్తిని కోల్పోవడం, నిద్రలేమి వంటి సమస్యలతో మానసిక ఒత్తిడికి గురి అయినట్లు భావిస్తే టెలి మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 ఫోన్ చేసి మానసిక వైద్యుడు సలహాలను సూచనలను ఉచితంగా పొందవచ్చునని తెలిపారు.

News April 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు.
*పెద్దపల్లి జిల్లాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి.
*వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించిన ఎండోమెంట్ కమిషనర్.
*కొండగట్టులో ఘనంగా చిన్న హనుమాన్ జయంతి.
*జగిత్యాల రూరల్ మండలంలో యువకుడి దారుణ హత్య.
*కరీంనగర్ పార్లమెంటుకు నేడు 12 మంది అభ్యర్థుల నామినేషన్.
*కొండగట్టులో బస్సు ఎక్కుతూ జారి బస్సు కిందపడి ఒకరి మృతి.