India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. బుగ్గారం మం. గోపులాపూర్కు చెందిన బెస్త శ్రీనివాస్ (35), అతని తమ్ముడు మహేష్పై రాడ్లు, పైప్లతో గురువారం అర్ధరాత్రి 5గురు ముసుగు వేసుకుని వచ్చి రాడ్లు, పైప్లతో దాడి చేయగా బెస్త శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహేష్కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. భూ తగాదాల నేపథ్యంలోనే గొడవలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.
లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంలో నగరవాసుల కంటే గ్రామీణ ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. పెద్దపల్లి పరిధిలోని 7 నియోజకవర్గాల్లో రామగుండం, మంచిర్యాలలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. మొత్తం 15,86,430 మంది ఓటర్లు ఉండగా వీరిలో 10,83,453 మంది ఓటు వేశారు. గ్రామీణ ప్రాంతాలైన సోనాపూర్లో 92.02, ఇసన్వాయిలో 83.91, తలమాల 86.42, కప్పరావుపేట పోలింగ్ కేంద్రంలో 84.19 శాతం అధిక పోలింగ్ నమోదైంది.
లోక్కసభ ఎన్నికలు RTCకి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. కరీంగనర్ రీజియన్లో 11 డిపోలు ఉండగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మే 10 నుంచి 14 వరకు వివిధ ప్రాంతాలకు 4350 బస్సులు నడిపింది. వీటిలో 510 అదనపు బస్సులున్నాయి. 5రోజుల్లో 19.42 లక్షల మంది RTC బస్సుల్లో ప్రయాణించగా రూ.10.94 కోట్ల ఆదాయం సమకూరింది. జగిత్యాల డిపో రూ.1.65 కోట్లు, గోదావరిఖని డిపో రూ.1.59 కోట్లతో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.
అధికారులు స్ట్రాంగ్ రూంలను నిరంతరం పర్యవేక్షించాలని పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. గురువారం సెంటినరీ కాలనీ జేఎన్టీయూ కళాశాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూంలోకి అనుమతి లేకుండా ఎవరు లోపలికి వెళ్లే వీలు లేదని, సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుందన్నారు. అనంతరం స్ట్రాంగ్ రూంలకు వేసిన సీల్లను పరిశీలించి సంబంధిత రిజిస్టర్లో సంతకం చేశారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల కురిసిన వర్షం. @ ఈదురుగాలుల వర్షానికి నేల కూలిన చెట్లు. @ వెలగటూరు మండలంలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య. @ తిమ్మాపూర్ మండలంలో పిడుగు పడి ఆవు, లేగా దూడ మృతి. @ సిరిసిల్ల జిల్లాలో పిడుగు పడి ఇద్దరు మృతి.
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నడిగట్టు సత్తయ్య దక్షిణాఫ్రికాలో మృతిచెందాడు. గుండెపోటుతో ఆయన చనిపోయినట్లు బంధువులు తెలిపారు. బతుకుదెరువు కోసం వేరే దేశం వెళ్లి.. ఇలా ఆకస్మిక మరణం చెందడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
పిడుగుపాటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వేములవాడ మండలం సాత్రాజుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పొలం వద్ద పనిచేస్తున్న కంబాల శ్రీనివాస్ (32)పై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పిడుగుపాటుతో రైతు మృతి చెందిన ఘటన తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన రుద్రారపు చంద్రయ్య గురువారం పొలం వద్ద పనిచేసుకుంటున్నాడు. వాతావరణ మార్పులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఈ క్రమంలోనే అతనిపై పిడుగు పడింది. దీంతో చంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.
కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల (అటానమస్) డిగ్రీ రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ, ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి గురువారం తెలిపారు.
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో పోలీసుల తనిఖీల్లో నగదుతో పాటు ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.9.17 కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన వాటిని ఎన్నికల పరిశీలన త్రిసభ్య కమిటీ అధికారులకు అప్పగించారు. ఇందులో రూ.8.96 కోట్ల నగదు ఉంది. పట్టుకున్న నగదుకు ఆధారాలు చూపడంతో రూ.కోటిని అధికారులు రిలీజ్ చేశారు.
Sorry, no posts matched your criteria.