India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ ఇబ్రహీంపట్నం మండలంలో పాముకాటుతో మహిళ మృతి. @ వేములవాడలో ఆటో బోల్తా పలువురికి గాయాలు. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కాటారం మండలంలో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. @ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ అభ్యర్థి వంశీ. @ ఎల్లారెడ్డిపేట మండలంలో ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్న కేటీఆర్. @ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్న మెట్ పల్లి మెజిస్ట్రేట్.
పెద్దపల్లి లోక్సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. బెల్లంపల్లి-70.96%, చెన్నూర్- 68.53%, ధర్మపురి73.35%, మంచిర్యాల-60.84%, మంథని-69.98%, పెద్దపల్లి- 71.34%, రామగుండం-61.59 శాతంగా ఉన్నాయి. మొత్తంగా 67.87% పోలింగ్ నమోదైంది. కాగా ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి వంశీకృష్ణ, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ బరిలో ఉన్నారు.
కరీంనగర్ లోక్సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. చొప్పదండి- 75.36%, హుస్నాబాద్- 77.25%, హుజూరాబాద్-73.82%, కరీంనగర్-60.51%, మానకొండూర్- 77.75%, సిరిసిల్ల-75.27%, వేములవాడ-74.44 శాతంగా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 72.54% పోలింగ్ నమోదైంది. కాగా ఈ స్థానంలో BJP నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి రాజేందర్ రావు, BRS నుంచి వినోద్ కుమార్ బరిలో ఉన్నారు.
కరీంనగర్ ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ లోక్సభలో 28 మంది, పెద్దపల్లిలో 42 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత KNR రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.
*పోల్ చీటీలు అందకపోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో పేర్లు ఉండి ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో పలువురు నిరాశ చెందారు.
*వావిలాలపల్లిలో ఈవీఎం పని చేయకపోవడంతో పోలింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.
*ఓటరు చీటీ మీద కేంద్రం కెన్క్రెస్ట్ పాఠశాల పేరు ఉండగా.. అక్కడికి వెళ్లి చూసే సరికి SR పాఠశాల బోర్డు కనిపించడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారు.
*చిగురుమామిడి, శంకరపట్నం మండలాల్లో ఈవీఎంలు మొరాయించాయి.
ఉపాధికి దుబాయ్ వెళ్లిన ముగ్గురు లోక్సభ ఎన్నికల్లో ఓటేయడానికి సొంతూరుకు వచ్చారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్కు చెందిన బాబురావు దుబాయ్లోని ఓ కంపెనీలో ఇంజినీర్గా పని చేస్తున్నాడు. సేవలాల్తండాకు చెందిన దేవనాయక్ ఆ దేశంలోనే పని చేస్తున్నాడు. వీరు ఓటేయడం కోసమే స్వగ్రామానికి వచ్చినట్లు తెలిపారు. మద్దికుంటకు చెందిన సుధాకర్రావు, శ్రవణ్కుమార్, మాధురిలు ముంబై నుంచి వచ్చి ఓటేశారు.
PDPL ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తండ్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కళ్లల్లో విజయానందం కనిపించింది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద సందడి చేస్తూ పుత్రోత్సాహంతో సంబరపడుతూ కనిపించారు. ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లిపోయిన ఆయన.. MLA ప్రేమ్సాగర్రావు అదే కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చారని తెలవడంతో మరోసారి వచ్చారు. చిరునవ్వు చిందిస్తూ.. చేయి కలిపేందుకు రాగా ప్రేమ్సాగర్రావు దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారు.
PDPLతో పోలిస్తే.. KNRలోనే ఎక్కువ శాతం పోలింగ్ నమోదయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33,93,580 మంది ఓటర్లు ఉండగా.. KNRలో 72.33, PDPLలో 67.88% నమోదయింది. NZBD లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చే జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్లలో కలిపి 73.75% పోలింగ్ నమోదయింది. చిగురుమామిడి మం. సీతారాంపూర్, ముల్కనూర్, గన్నేరువరం 190, 192, 208 పోలింగ్ బూత్లలో ఖాసీంపేట, శంకరపట్నం మం. మొలంగూర్లో ఈవీఎంలు మొరాయించాయి.
కాటారం మండలం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయ వార్షికోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం హాజరుకానున్నారు. భట్టి విక్రమార్కకు కమాన్ పూర్ ఎక్స్ రోడ్ వద్ద ఘన స్వాగతం పలకనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైనాల రాజు తెలిపారు. కావున.. కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. @ రాయికల్ మండలంలో అనుమానాస్పద స్థితిలో 20 గొర్రెలు మృతి. @ ఇబ్రహీంపట్నం మండలంలో ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్న యువకుడు. @ మెట్పల్లి పట్టణంలో ఒకరి ఓటును మరొకరు వేశారు. @ ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ అభ్యర్థులు. @ మెట్ పల్లి మండలంలో గుండెపోటుతో రేషన్ డీలర్ మృతి. @ ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్లు.
Sorry, no posts matched your criteria.