India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బీఆర్ఎస్ ప్రాజెక్టుల బాట కార్యక్రమంలో భాగంగా గురువారం కరీంనగర్కు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కరీంనగర్ జిల్లా నేతలు కలిశారు. నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో పాటు పలువురు కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తదితరులు ఉన్నారు.

రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నివాసంలో గురువారం బడ్జెట్ విందును ఏర్పాటు చేశారు. విందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

@ సారంగాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ దుర్షేడులోని బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన కరీంనగర్ కలెక్టర్. @ రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారిగా వసంతరావు బాధ్యతలు స్వీకరణ. @ జగిత్యాల జిల్లా కేంద్రంలో మూడు ఇండ్లలో చోరీ. @ వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ కరీంనగర్ ఎల్ఎండి నీ పరిశీలించిన కేటీఆర్.

ఉమ్మడి కరీంనగర్ సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ నెల 27న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ దేవేందర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి, మంథని, గొల్లపల్లి, మేడిపల్లి, కోరుట్ల, ముస్తాబాద్, బోయిన్ పల్లి, జమ్మికుంట, బాలుర కళాశాలలో అడ్మిషన్ల కౌన్సిలింగ్కు సుల్తానాబాద్ శాస్త్రినగర్లో ఉన్న గురుకుల కళాశాల వద్ద ఉ.9 గంటలకు హాజరుకావాలని కోరారు.

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే బీపీఈడీ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 1 నుంచి, రెండో సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 2 నుంచి ప్రారంభమవనున్నాయి. యూనివర్సిటీ కామర్స్, బిజినెస్ బ్రాంచ్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు SU పరీక్షల నియంత్రణాధికారి డా. శ్రీరంగప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

మెట్పల్లి పట్టణంలో ఒక్క రోజే నలుగురికి డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. వారికి మెట్పల్లి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ టి.మోహన్తో కలిసి డిప్యూటీ డీఎంహెచ్వో పేషెంట్ల ఇళ్లకు వెళ్లి శానిటేషన్ చేయించారు. ఇద్దరి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వెంకటేశ్ తీర్పు చెప్పారు. కరీంనగర్ పట్టణంలో ఉంటున్న భార్యాభర్తలకు తొమ్మిదేళ్ల కుమార్తె 2020 FEB 24ర ఆడుకుంటుండగా ఇంలల్లి సమీపంలో ఉన్న నరేశ్, రవితేజ బాలిక ఓంటరిగా కనిపించడంతో అత్యాచారం చేసి చంపుతానని బెదిరించారు. మరుసటి రోజు కూడా బాలికపై అత్యాచారం చేయడంతో అస్వస్థతకు గురైంది, ఈక్రమంలో రక్త పరీక్షలు చేయగా విషయం తెలిసింది. కైసు నమోదైంది

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ఇవాళ శాసనసభలో ప్రవేశ పెడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఈ పద్దుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పథకాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కేటాయింపులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. సిరిసిల్ల JNTU బిల్డింగ్, గల్ఫ్ వెళ్లిన వారి సంక్షేమం , వస్త్రోత్పత్తి, ఆహార శుద్ధి పరిశ్రమ స్థాపన ప్రస్తావన ఉంటుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.

జేఈఈలో ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటీలో సీటు సాధించి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనే నాయక్ తండాకు చెందిన విద్యార్థిని బాదావత్ మధులతకు ప్రజా ప్రభుత్వం అండగా నిలిచింది. ‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల కాపరిగా’ మారడంతో సీఎం స్పందించారు. బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో గిరిజన శాఖ కార్యదర్శి శరత్ ద్వారా విద్యార్థిని మధులతకు రూ.1,51,831 చెక్కును అందించారు.

IIT పాట్నాలో సీటు సాధించిన పేద విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. తన చదువు పూర్తయ్యే వరకు ఆర్థిక సాయం అందించాలని CMO ఆదేశాలు జారీ చేసింది. వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాలోని రాములు-సరోజ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చివరి కూతురు మధులత. అయితే ఈమె JEE మెయిన్లో ప్రతిభ చూపి ST కేటగిరిలో 824వ ర్యాంకు సాధించింది. వారి ఆర్థిక పరిస్థితిని కొందరు CM దృష్టికి తీసుకురాగా సాయం అందించారు.
Sorry, no posts matched your criteria.