Karimnagar

News April 19, 2024

కరీంనగర్: ప్రమాదవశాత్తు బావిలో పడి బాలిక మృతి

image

ఓ బాలిక బావిలో పడి మృతి చెందింది. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన దేవరకొండ శ్రీనివాస్, అతని భార్య, కూతురుతో కలిసి బాతులు పెంచుకొనుటకు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారం గ్రామానికి వచ్చారు. గురువారం బాతులు మేపుతుండగా బాలికకు దాహం వేసి గూడెపు తిరుపతిరెడ్డి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేశారు.

News April 19, 2024

మానేర్ డ్యామ్‌లో దూకిన వ్యక్తి

image

ఎల్ఎండీ మానేరు డ్యామ్‌లో దూకిన యువకుడిని లేక్ పోలీసులు రక్షించారు. శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు గురువారం మానేరు డ్యామ్ నీటిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా గస్తీ కాస్తున్న పోలీసులు నీటిలో దూకి తనని రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఆ యువకుడు తెలియజేశారు.

News April 18, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల: ఇద్దరు SIలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెండ్
@ మల్హర్ మండలంలో లారీ, కారు ఢీ
@ పెద్దపల్లి: తొలి రోజు నాలుగు నామినేషన్లు
@ కరీంనగర్: తొలిరోజు రెండు నామినేషన్లు
@ మెట్ పల్లి: ఐదుగురు పేకాటరాయుళ్ల పట్టివేత

News April 18, 2024

KNR: ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్స్ సస్పెండ్..!

image

సారంగాపూర్ పీఎస్‌లో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్ అయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో 70 కిలోల గంజాయిని పట్టుకొని పీఎస్ వెనుక ఉంచినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ నెల 1న దుండగులు ఆ గంజాయిని ఎత్తుకెళ్లారు. వారి నిర్లక్ష్యంపై ఆగ్రహించిన ఉన్నతాధికారులు.. ఈ కేసులో ఎస్సైలు జి.మనోహర్‌రావు, ఎ.తిరుపతితో పాటు.. హెడ్ కానిస్టేబుల్ బి.రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ టి.నరేందర్‌ను సస్పెండ్ చేశారు.

News April 18, 2024

KNR: మామిడి భళే కాసింది.. ఒకే చోట 22 కాయలు

image

కరీంనగర్ జిల్లాలో వింత జరిగింది. ఓ మామిడి చెట్టుకు ఒకే కొమ్మకు దాదాపు 22 కాయలు కాసింది. ఈ ఘటన KNR జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లెకి చెందిన కర్ర జగన్మోహన్ రెడ్డి మామిడి తోటలో జరిగింది. రైతు మాట్లాడుతూ.. గతేడాది ఈదురు గాలులకు కొమ్మలు విరిగిపోవడంతో చెట్టు ఎండిపోయే దశకు చేరిందని అన్నారు. ఇక ఈ చెట్టు కాత కాయదనుకున్నా కానీ, ఒకే చోట సుమారు 50 కాయల వరకు కాసిందని అన్నారు.

News April 18, 2024

ఇల్లంతకుంటలో భర్త గెలుపు కోసం భార్య ప్రచారం

image

సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు గాలిపెళ్లి, తాళ్లపల్లి, అనంతగిరి గ్రామాలలో కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సతీమణి మాధవి గురువారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. గత ఐదేళ్లలో బండి సంజయ్ ఎంపీగా ఉండి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వినోద్ కుమార్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

News April 18, 2024

రేపే మంచి ముహూర్తం.. సిద్ధమవుతున్న నాయకులు

image

ఈరోజు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల MP అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. రేపు (శుక్రవారం) ముగ్గురు అభ్యర్థులు మొదటి సెట్టు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్-వంశీకృష్ణ, BRS-కొప్పుల ఈశ్వర్, BJP-గోమాస శ్రీనివాస్ సిద్ధమయ్యారు. తర్వాత మరో మారు అట్టహాసంగా నామినేషన్ వేయనున్నారు.

News April 18, 2024

సుదీర్ఘ అనుభవం.. గట్టెక్కిస్తుందా..!

image

లోక్ సభ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. జీవన్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎమ్మెల్సీగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో 3సార్లు మంత్రిగా పనిచేశారు. ఇక ఈశ్వర్ 6 సార్లు (మేడారం నుంచి రెండు, ధర్మపురి నుంచి నాలుగు సార్లు) గెలిచి చీఫ్ విప్‌గా, మంత్రిగా పనిచేశారు. మరి ఇంత అనుభవం ఉన్న వీరివురూ ఈసారి ఎన్నికల్లో సత్తా చాటుతారా..? కామెంట్ చేయండి.

News April 18, 2024

KNR: తీవ్ర విషాదం.. బాలింత మృతి

image

ప్రసవానికి వెళ్ళిన బాలింత డెలివరీ అనంతరం మృతిచెందిన ఘటన కరీంనగర్‌లో జరిగింది. తీగలగుట్ట పల్లికి చెందిన వర్షినికి పురిటి నొప్పులు రావడంతో వారం రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బాబుకు జన్మనిచ్చిన అనంతరం ఆపరేషన్ వికటించి
ఆమె మృతి చెందిందని బంధువులు తెలిపారు. దీంతో ఆస్పత్రి వద్ద పెద్దఎత్తున బంధువులు ఆందోళన చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని ఆరోపించారు.

News April 18, 2024

సిరిసిల్ల: సినీ ఫైటర్స్ రామ్ లక్ష్మణుల సందడి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు సందడి చేశారు. తన బంధువుల వివాహ కార్యక్రమానికి హాజరైన హాజరయ్యారు. వారిని చూసేందుకు గ్రామస్థులు ఉత్సాహాన్ని కనబరిచారు. వారితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడటంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.